ఆత్మ సాక్షాత్కారం




27.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

ఆభాత్యేవం పరో హ్యాత్మా తక్ట్వై వాజ్ఞానజమ్ తమ : // 50
శ్లో। స్నేహక్షయాద్యథా దీపో బలాన్నిర్యాణ మృచ్ఛతి /
తదాత్మ భావనాయుక్త స్స్వాత్మన్యే వావతిష్ఠతే // 51
శ్లో ఘట సంవృతమాకాశం నీయమనే యథా ఘటే /
ఘటో నీయేత నాకాశం తద్వజ్జీవో నభోపమ : // 52
శ్లో. భిన్నే కుంభే యథాకాశ మాకాశత్వం ప్రపద్యతే /
విభిన్న ప్రకృతే దేహీ తథాత్మా పరమాత్మతామ్ // 53
శ్లో. ఇత్యుక్త మధికారేణ సర్వజ్ఞే నాధికారిణా /
సర్వబంధా వినిర్ముక్తా స్సర్వజ్ఞ స్సర్వగో భవేత్ // 54
శ్లో. తదాగమాంత్సం పరిహృత్య సర్వాన్ శుచిమ్ గృహీత్వాత్మ సమాధియోగం /
అస్మాత్పరం నాన్య ది హాస్తి కించిత్ జ్ఞాత్వైవ సంత్యజ్ఞ మనో వికల్పమ్ // 55
శ్లో. విజ్ఞానమేవం సముపాస్యవిద్వాన్ విశత్యకాయం సతతం నియుక్త : /
సర్వత్రగామీ భవతీహ ముక్త స్తద్ధర్మధర్మీ బహిరంతరస్థ : // 56

శ్లో.  సర్వజ్ఞతా తృప్తిరనాది బోధ స్వతంత్రతా నిత్యమలుప్తశక్తి :  /
      అనంతశక్తి శ్చ నిరామయాత్మా విశుద్ధదేహా స్స శివత్వ మేతి // 57 

ముక్తునకు తనను తాను విశేషముగా భావించుకునే ఆలోచన వుండదు.  మనదృష్టిలో వారిని విశేషముగా చూస్తాము.  ఎందుకంటే, వారిస్థితి ప్రత్యేకంగా మనకు కనబడుతుంది.   అలాంటి ముక్తి మీద మనకు ఆసక్తి కలగడానికి పరమేశ్వరుడు ముక్తుని యొక్క విశేషములను మెచ్చుకుంటున్నారు. 


సర్వజ్ఞత్వము, తృప్తి, సనాతనమైన జ్ఞానము, ఎప్పుడూ స్వతంత్రంగా సంచరించే శక్తి,, అనంత శక్తి,  ఏ విధమైన అలజడి లేని మనస్సు,  విశుద్ధమైన దేహముకలిగిన ముక్తుడు శివ స్వరూపుడే. 


వివరణము :  ' సర్వము నాయందే వున్నది.  నాకన్నా అన్యముగాలేదు. ' అని తెలుసుకోవడమే సర్వజ్ఞత్వము.    అలాగే, ' నాకు కావలసినది ఏదీలేదు. ' అని దేనినీ కోరుకోకుండా జీవించడమే తృప్తి.   జ్ఞానము కలగడం వలన ముక్తి కలిగినదని జ్ఞాని అనుకోడు.  ఆ విధంగా తలిస్తే, మధ్యలో వచ్చిన జ్ఞానము మరలిపోవచ్చును.  అందువలన, ' నేను ఎప్పుడూ దేనికీ బద్ధుడను కాను. ఎల్లప్పుడూ నేను జ్ఞానరూపమునైన ఆత్మనే ! ' అని ముక్తుడు భావిస్తాడు.  అలాంటి జ్ఞానానికి కాల పరిచ్ఛిన్నము లేదు.  అందువలన అది అనాదిగా వున్నది.


ఒకపనిచెయ్యడానికీ, చెయ్యకుండా ఉండడానికీ ఎవరికైతే వెసులుబాటు వుంటుందో, వాడు ఆవిషయంలో స్వతంత్రుడు.  తంత్రము అనగా ఉపాయము.  అదియే కార్యసాధకము.  అలాంటి తంత్రములు ఎవరి అధీనంలో వుంటాయో అతడు స్వతంత్రుడు.    జ్ఞానికి ఏ విధములైన తంత్రములు అక్కరలేదు.  దేని కోసం ఎవరినీ కొలవడు, ప్రాధేయపడడు, ఆధారపడడు. అదే స్వతంత్రత.


ఇక శక్తి అనేది, జ్ఞానముగాను, క్రియ గాను వ్యక్తీకరించ బడుతుంది.  జ్ఞానశక్తి నిద్రలో కూడా స్ఫురణలో వుంటుంది. ' నేను సుఖంగా నిద్రించాను. '  అని చెప్పేది అహం అనే జ్ఞానము  వలననే.  ఆలోచనలు లేకపోయినా జనశక్తికి ఎప్పుడూ లోపము వుండదు.  అందువలన అది అలుప్తశక్తి.    ఆత్మ యొక్క క్రియాశక్తికి అంతములేదు.  ఎన్ని పర్యాయాలు ప్రళయాలు సంభవించినా  ప్రళయానంతరం సృష్టి జరుగుతూనే వుంటున్నది.    అలాగే చైతన్య శక్తి కూడా.  ఆత్మ యొక్క చైతన్యం ప్రళయానంతరము, జీవులపై ప్రసరిస్తూనే వుంటుంది. అది అనంతశక్తి. 


ఆమయం అనగా వ్యాధి.  ఆత్మ అనగా చింతలేని, వ్యాధిలేని మనస్సే. అది నిరామయాత్మ.  అదియే ప్రశాంత చిత్తము.  శరీరదోషాలు అన్నీచాలా వరకు మనస్సున౦దే ఆరంభింప బడతాయి.   వైద్య సిద్ధాంత ప్రకారము కూడా, మనస్సులో ఆరంభమైన కొన్ని దోషములే శరీరములో వ్యాధుల రీతిలో వ్యక్తమవుతాయని చెప్పబడుతున్నది.   కాబట్టి ఎవరి మనస్సు నిర్మలమో, సామాన్యముగా వారి దేహము కూడా విశుద్ధముగానే  వుంటుంది.    అవధూతల సన్నిధానంలో, మనస్సుకు ప్రశాంతత చేకూరడమేకాక వారి సన్నిధిలో ఆహ్లాదకరమైన పరిమళం వ్యాప్తి చెందుతుందని చెబుతూ వుంటారు.


తరువాతి రెండు శ్లోకాలలోపరమేశ్వరుడు సన్యాసులకు చెప్పబడిన నిషిద్ధ కర్మల గురించి ఉపదేశిస్తున్నాడు.

🕉🌞🌏🌙🌟🚩


ఓం నమః శివాయ:
26.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

ఆభాత్యేవం పరో హ్యాత్మా తక్ట్వై వాజ్ఞానజమ్ తమ : // 50
శ్లో। స్నేహక్షయాద్యథా దీపో బలాన్నిర్యాణ మృచ్ఛతి /
తదాత్మ భావనాయుక్త స్స్వాత్మన్యే వావతిష్ఠతే // 51
శ్లో ఘట సంవృతమాకాశం నీయమనే యథా ఘటే /
ఘటో నీయేత నాకాశం తద్వజ్జీవో నభోపమ : // 52
శ్లో. భిన్నే కుంభే యథాకాశ మాకాశత్వం ప్రపద్యతే /
విభిన్న ప్రకృతే దేహీ తథాత్మా పరమాత్మతామ్ // 53
శ్లో. ఇత్యుక్త మధికారేణ సర్వజ్ఞే నాధికారిణా /
సర్వబంధా వినిర్ముక్తా స్సర్వజ్ఞ స్సర్వగో భవేత్ // 54

శ్లో. తదాగమాంత్సం పరిహృత్య సర్వాన్ శుచిమ్ గృహీత్వాత్మ సమాధియోగం /
అస్మాత్పరం నాన్య ది హాస్తి కించిత్ జ్ఞాత్వైవ సంత్యజ్ఞ మనో వికల్పమ్ // 55
శ్లో. విజ్ఞానమేవం సముపాస్యవిద్వాన్ విశత్యకాయం సతతం నియుక్త : /
సర్వత్రగామీ భవతీహ ముక్త స్తద్ధర్మధర్మీ బహిరంతరస్థ : // 56

ఆత్మతత్వమును నిశ్చయముగా గ్రహించిన తరువాత, సాధకుడు ఏవిధంగా కృతార్థుడు కావాలో ఈశ్వరుడు చెబుతున్నాడు. అధికారి అయినవాడు చెప్పినది తప్పక గ్రహించవలసినదే ! కాబట్టి, ఆత్మకు మించినది వేరొకటి లేదని సాధకుడు తెలుసుకుని, మనోవికల్పాలను వదిలిపెట్టాలి.


ఆ తరువాత, శుచియై ఆత్మ సమాధియోగమును గ్రహించి, మిగిలిన సాధనాలను ప్రక్కన బెట్టి, పైన చెప్పిన విధంగా ఆత్మ విజ్ఞానమును ఉపాసించవలసినదే ! ఆలా ఉపాసించే విద్వాంసుడు ఎల్లప్పుడూ దానియందు మనసు నిలిపి, శరీర రహితమైన ఆత్మయందు ప్రవేశిస్తాడు. ఆవిధంగా ముక్తుడు అయినవాడు, అన్ని చోట్ల వ్యాపించి వుండి, ఆయా పదార్ధముల ధర్మములే తన ధర్మములుగా, వాటికి వెలుపలా, లోపలా వ్యాపించి వుంటాడు.


వివరణము : ఆత్మతత్వము అంటే యేమిటో కేవలము తెలుసుకుంటే చాలదు.  '  ఇదే పరమము.  దీనికి పైన ఇంకేమీ లేదు. ' అని దృఢమైన జ్ఞానము వుండడం అవశ్యం.   ఆ  విశ్వాసమే లేకపోతే,  లోకములోని అనేక సిద్ధాంతాల వలన సాధకునికి ఎన్నో సందేహాలు కలుగుతూ వుంటాయి.  అలాంటి సందేహాలలో ఒకటి, ' ధ్యానం చేసినంత మాత్రాన పైనుండి ఏదైనా దివ్యశక్తి వచ్చి మనలో ప్రవేశిస్తుందా ? ' అనేది.  దానికి రమణ మహర్షులు చెప్పిన సమాధానం చూద్దాం.


'  నీవు నీవుగానే వుండు. పైనుండి దిగివచ్చేదీ, లేదా కంటిముందు  ప్రత్యక్షమయ్యేదీ ఏదీ ప్రత్యేకంగా లేదు. అహంకారము వదులుకోవడమే కావలసినది. ఏదైతే శాశ్వతమో అది యెప్పుడూ వుంటుంది.  ఇప్పుడు కూడా నీవు ' అది ' గానే వున్నావు. '
ఈవిషయంలోఏమైనా సందేహాలు పెట్టుకుంటే, అవి ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు అవుతాయని కూడా రమణులు స్పష్టం చేసి వున్నారు. 


ఆ అవరోధములు ఏవి అంటే , ఒకటి శుద్ధమైన తన ఉనికిని అజ్ఞానముతో మరచిపోవడం, రెండవది,  అదృష్టవశాత్తూ, ఆత్మసాక్షాత్కారం అనుభవం కలిగినా,  అది ఆత్మసాక్షాత్కారమని గుర్తించలేక పోవడం.   అది భ్రమ ఏమో అని సంశయించడం.


కాబట్టి, ఆత్మ స్వరూపం  అంటే యేమిటో స్థిరంగా తెలుసుకుని, మనోవికల్పాలను వదలిపెట్టాలి.  ఆత్మ సాక్షాత్కరిస్తే, యేవో దివ్యశక్తులు వస్తాయనీ, దివ్యశక్తి ఆవహిస్తుందనీ, మహిమలు కలుగుతాయని మనస్సులో భావించడమే మనో వికల్పములు.  అలాంటి ఊహలకు తావిస్తూ, ఆత్మజ్ఞాన సాధన చేయరాదు.


ఏ స్థితి యందు మనస్సు చక్కగా నిలబడుతుందో, ఆస్థితినే ' సమాధి స్థితి '  అని గుర్తించాలి. అలా మనస్సును నిశ్చలంగా నిలపడానికి చేసే ప్రయత్నమే ఆత్మసమాధియోగము.   ఎల్లప్పుడూ, ' నేనెవడను ? నా స్వరూపము ఏమిటి ? ' అని విచారిస్తూ వుండడమే, ఆత్మవిచారము.  ఇది శుచిగా పరిశుభ్రంగా వుంచుతుంది, మనస్సును, అసంకల్పితంగా.


అలాకాకుండా ఆత్మవిచారము చేయడం మానేసి, జగత్తు, ఈశ్వరుడు, మాయ మొదలైన విషయాలను గురించి స్మరిస్తూ  వుంటే, అదే అశుచిత్వము, అపవిత్రత.  ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు, ఎదిగి ఆత్మ విచారణకు ముందుకు పోలేడు.


కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులను ఆత్మజ్ఞానము కావాలనుకున్నవాడు, పూర్తిగా పరిహరించాలి.  ఇక్కడ మనం తప్పుగా అర్ధం చేసుకో కూడదు.  లౌకిక వ్యవహారములందు, కామితార్దములందు ఇఛ్ఛ వున్నవారు, శాస్త్రములలో చెప్పిన యజ్ఞములు, ఉపాసనలు చెయ్యవలసినదే.  అందుకు సందేహంలేదు.  అయితే, అవి అన్నియు, ఆత్మ విచారణ చేయడానికి సంకల్పము చేసుకునే వైపు తీసుకువెళతాయి, కాలక్రమేణా.  ఆపైన ఉపయోగపడవు.  తీరానికి చేరిన తరువాత, నావను వదిలిపెట్టినట్లు,  ఆత్మ విచారణ మార్గములో వున్నవాడు, ఈ శాస్త్రములను ఎక్కడ వదిలిపెట్టాలి తెలుసుకోగలగాలి.  ఈ సందర్భంలో గురూపదేశం ఉపయోగ పడుతుంది.


ఆత్మను గురించి విచారించేటప్పుడు, ఈశ్వరుడు  చెప్పిన ఆత్మ తత్వమును సాధన చెయ్యాలి.  నేనే ఆత్మను సో >హం అని ఏ

కాగ్రతతో చేసే సాధనే ఉపాసన.   ఈ విధంగా ఉపాసన చేసే సాధకుడు మనస్సును నిలిపివుంచి, అకాయమైన ( శరీర రహితమైన ) ఆత్మయందు ప్రవేశించును.  అనగా కాయములు స్ఫురణకు రాని చైతన్యములో లీనమవడం అని అర్ధం చేసుకోవాలి.  అదే నిర్వికల్ప సమాధి.  తనను తాను శరీరము లేనివాడినిగా తెలుసుకున్న ముక్తుడు తన చైతన్యమునే సకల జగత్తులోని శరీరములందు, పదార్థములందు వ్యాపింప జేసుకుంటాడు.   అనగా సకల జగత్తూ తానే అనే భావనలో వుంటాడు.


బంగారానికే మాట్లాడడం వస్తే, '  ఈ ఉంగరం నేనే. ఆ కంఠహారం నేనే. ఈ గాజులు నేనే. ' అని ఎలా చెప్పగలదో,  అలాగే, ముక్తుడు, ' నేనే అగ్నిని, నేనే ఇంద్రుడను, నేనే బ్రహ్మను, నేనే విష్ణువును, నేనే శివుడను. ' అని  చెప్పగలిగే పరిస్థితిలో వుంటాడు.
***
24.ఆత్మ సాక్షాత్కారం 

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు. 
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి. 


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

ఆభాత్యేవం పరో హ్యాత్మా తక్ట్వై వాజ్ఞానజమ్ తమ : // 50
శ్లో। స్నేహక్షయాద్యథా దీపో బలాన్నిర్యాణ మృచ్ఛతి /
తదాత్మ భావనాయుక్త స్స్వాత్మన్యే వావతిష్ఠతే // 51 

శ్లో ఘట సంవృతమాకాశం నీయమనే యథా ఘటే /
ఘటో నీయేత నాకాశం తద్వజ్జీవో నభోపమ : // 52

' జ్ఞాని శరీరము పడిపోయినప్పుడు యేలోకానికీ పోకున్నను, పూర్వజన్మలలో యెన్నో లోకాలకు పోయి వచ్చివుంటాడు కదా ' అనే సందేహాన్నినివృత్తి చేస్తున్నారు.  


కుండను ఒకచోటినుండి మరియొకచోటికి తీసుకు వెళ్ళేటప్పుడు, కుండలోనిఆకాశము ( శూన్య ప్రదేశము ) ఎక్కడికీ పోవడం లేదు.  కేవలం కుండ మాత్రమే తీసుకుని వెళ్ళబడుతుంది.  ఆకాశము కుండ లోపలా వున్నది. వెలుపలా వున్నది   అందువలన ఆకాశమునకు రావడం పోవడం అనే వ్యవహారము లేదు.   


అలాగే జీవుడు సర్వ వ్యాపకుడైన ఆత్మ. దేహము లోపలా వుంటాడు. వెలుపలా వుంటాడు.   కాబట్టి అనేక శరీరములలో ఇతర లోకములకు పోవడం రావడం అనేది, ఆశరీరములకు సంబంధించినదే కానీ, ఆత్మకు సంబంధించినది కాదు.    ముక్తుడైన జ్ఞాని, తనకు పూర్వజన్మలు వున్నాయని కానీ, ఇతర లోకములకు పోయివచ్చినట్లు గానీ తలపనే తలపడు.    తనకు భిన్నంగా శరీరములు, జన్మలు, లోకములు యేవీ ఎప్పుడూ లేవనే జ్ఞానీ తలుస్తాడు. 


శ్లో.  భిన్నే కుంభే యథాకాశ మాకాశత్వం ప్రపద్యతే / 
      విభిన్న ప్రకృతే దేహీ తథాత్మా పరమాత్మతామ్   //  53  

కుండ పగిలినప్పుడు లోపల వున్న ఆకాశము వెలుపల వున్న ఆకాశముతో యెలా ఏకం అవుతున్నదో,  అలాగే, పాంచ భౌతిక శరీరం పడిపోయినంతనే,  దానిలోపల వున్నట్లు అనిపించే లోకులచే జీవుడు అని భావింపబడే,  జ్ఞానిగా వ్యవహరింప బడుతున్న ఆత్మ అంతటా వ్యాపించి వుంటుంది.  సమష్టి తత్వమైన పరమాత్మతో ఏకమవుతున్నది.    నిజానికి ఆత్మ పరమాత్మ అనే భేదము సామాన్య ప్రజలు కలిపించుకునే భేదమే కానీ, ఆ భేదమేదీ లేదు.   శరీరం వున్నా లేకున్నా, ఆత్మా ఒక్కటే. 


శ్లో.  ఇత్యుక్త మధికారేణ సర్వజ్ఞే నాధికారిణా /
      సర్వబంధా వినిర్ముక్తా స్సర్వజ్ఞ  స్సర్వగో భవేత్   // 54 

సర్వజ్ఞుడైన జ్ఞాని స్థూలసూక్ష్మ శరీరముల యొక్క సర్వ బంధములనుండి బయటకు వచ్చి, సర్వవ్యాపకమైన ఆత్మ అవుతుంది.    ఈ మాట సర్వజ్ఞుడైన అధికారి చేత అధికారంతో చెప్పబడినది.  అనగా దీనియందు సందేహించ వలసిన విషయము ఏదీ లేదు, అని భావము.  

***
23.ఆత్మ సాక్షాత్కారం 

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి. 


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో। అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్ /
నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని యత్సుఖం //

నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్ /
తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్ // 39
శ్లో। నిరస్య విషయాసంగం మనోవృత్తిం వివర్జయేత్ /
యాదాయా ట్యూన్మనీభావం తదా తత్పరమం సుఖం // 40
శ్లో। సర్వదిగ్దేశ కాలేషు యోగాభ్యాసో విధీయతే /
సర్వ వర్ణాశ్రమాణాం చ జ్ఞానభేదో న విద్యతే / 41
శ్లో। గవామనేక వర్ణానాం క్షీర స్యాప్యేక వర్ణతా /
క్షీరవద్దృశ్యతే జ్ఞానం లింగినశ్చ గవా౦ సమా : // 42
యస్మాత్సర్వా గతం బ్రహ్మవ్యాపకం సర్వతోముఖం /
తస్మాద్బ్రహ్మణి సంస్థ స్సన్ దిగ్దేశాన్న విచారయేత్ // 43
శ్లో। నైవ తస్య కృతే నారదో న కార్యో న విధిస్మృతా : /
న లింగం నాశ్రమాచారా స్స్థితస్య పరమాత్మని // 44
శ్లో । గచ్ఛం తిష్ఠన్ స్వపన్ జాగరణ్ భుంజానో>పి పిబన్నపి /
సర్వథా సర్వకాలేషు వాతశీతాతపేషు చ // 45
శ్లో। భయదారిద్య్ర రోగేషు మాంద్య విజ్వరకాదిషు /
ఆత్మన్యేవస్థితా శ్శాంత : ఆత్మత ప్తస్తు నిష్కళ : // 46
శ్లో। నాగతో>హం గతోవాపి నాగమిష్యే నమేగతి : /
నభూతో న భవిష్యామి ప్రకృత్యస్థిర ధర్మిణి // 47
శ్లో। ప్రాకృతాని తు కర్మాణి ప్రకృతి : కర్మసంభవా /
నైవ కించిత్కరో మీతి యుక్తోమన్యేత తత్త్వవిత్ // 48
శ్లో। నైవ ప్రకృబంధో>స్తి ముక్త ఇత్యభిధీయత్నే /
వ చైవ ప్రాకృతై రాదోషైర్లిప్యతే స కదాచన // 49
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో   నిర్ణాశ్య తమసో రూపం దీపో యద్వత్ప్రకాశతే  /
      ఆభాత్యేవం పరో హ్యాత్మా తక్ట్వై  వాజ్ఞానజమ్ తమ :  //  50 

వెలుగునకు చీకట్లు లేనట్లే, జ్ఞానరూపమైన ఆత్మకు అజ్ఞాన వాసనలు ఆపాదింపబడవు.  దీపము, చీకటిని రూపం లేకుండా ఎలా మటుమాయం చేస్తుందో, అలాగే పరమాత్మ అజ్ఞానము వలన కలిగే తమస్సును త్రోసివేసి వెలుగుచున్నది.

  
వివరణము :  ఈ దీపము యొక్క దృష్టాంతాము కొంతవరకే, విషయము అర్ధము చేసుకోవడానికి మాత్రమే గ్రహించవలెను.   దీపము యొక్క పరిధి పరిచ్ఛిన్నము.  ఆత్మ యొక్కపర్ది అపరిచ్ఛిన్నము.   అందువలన చీకటిని పోగొట్టే దీపమును   ఇక్కడ పోలికకు తీసుకుని అంతవరకే చెప్పుకోవాలి.  ఆత్మ ఎల్లప్పుడూ అన్నింటా వుంటుంది.  ఎవడు జ్ఞానరూపమైన  ఆత్మగా వున్నాడో, వాడికి అజ్ఞానమనే తమస్సు వుండదు. 


శ్లో।  స్నేహక్షయాద్యథా దీపో బలాన్నిర్యాణ  మృచ్ఛతి  /
       తదాత్మ భావనాయుక్త స్స్వాత్మన్యే వావతిష్ఠతే //  51  

లోకుల దృష్టిలో జ్ఞాని కూడా మరణిస్తున్నాడు.   అయితే, ఆ మరణం ఎలాంటిదో వివరింపబడుతున్నది.  నూనె అయిపోగానే దీపము ఎలా ఆరిపోతున్నదో, అలాగే ఆత్మభావము వున్నవాడు శరీరము పడిపోయినప్పుడు, తనయందు తానే నిలిచివుండును.  


వివరణము :  నూనె వున్నంతవరకు, దీపము వెలిగినట్లు, ప్రారబ్ధము వున్నంత కాలం, స్తూల శరీరము  కాంతివంతంగా, సూక్ష్మ శరీరము తెలివితేటలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రారబ్ధము తీరిపోయిన వెంటనే,  చుట్టూ తెరలు తొలగిన దీపము వలే, ఆత్మ ప్రకాసిస్తూ వుంటుంది.   


శ్లో  ఘట సంవృతమాకాశం నీయమనే యథా ఘటే /
     ఘటో నీయేత నాకాశం తద్వజ్జీవో నభోపమ :   //  52 

శరీరము పడిపోయినను, జ్ఞాని ఏలోకానికీ వెళ్ళడు. అయితే, ఇంతకుముందు అనేకజన్మలలో వెళ్లి వుంటాడు కదా అనే దానికి సమాధానం చెప్పబడుతున్నది. 

***
ఓం నమః శివాయ:
22.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో। అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్ /
నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని యత్సుఖం //

నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్ /
తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్ // 39
శ్లో। నిరస్య విషయాసంగం మనోవృత్తిం వివర్జయేత్ /
యాదాయా ట్యూన్మనీభావం తదా తత్పరమం సుఖం // 40
శ్లో। సర్వదిగ్దేశ కాలేషు యోగాభ్యాసో విధీయతే /
సర్వ వర్ణాశ్రమాణాం చ జ్ఞానభేదో న విద్యతే / 41
శ్లో। గవామనేక వర్ణానాం క్షీర స్యాప్యేక వర్ణతా /
క్షీరవద్దృశ్యతే జ్ఞానం లింగినశ్చ గవా౦ సమా : // 42
యస్మాత్సర్వా గతం బ్రహ్మవ్యాపకం సర్వతోముఖం /
తస్మాద్బ్రహ్మణి సంస్థ స్సన్ దిగ్దేశాన్న విచారయేత్ // 43
శ్లో। నైవ తస్య కృతే నారదో న కార్యో న విధిస్మృతా : /
న లింగం నాశ్రమాచారా స్స్థితస్య పరమాత్మని // 44
శ్లో । గచ్ఛం తిష్ఠన్ స్వపన్ జాగరణ్ భుంజానో>పి పిబన్నపి /
సర్వథా సర్వకాలేషు వాతశీతాతపేషు చ // 45
శ్లో। భయదారిద్య్ర రోగేషు మాంద్య విజ్వరకాదిషు /
ఆత్మన్యేవస్థితా శ్శాంత : ఆత్మత ప్తస్తు నిష్కళ : // 46

శ్లో। నాగతో>హం గతోవాపి నాగమిష్యే నమేగతి : /
నభూతో న భవిష్యామి ప్రకృత్యస్థిర ధర్మిణి // 47

శ్లో। ప్రాకృతాని తు కర్మాణి ప్రకృతి : కర్మసంభవా /
నైవ కించిత్కరో మీతి యుక్తోమన్యేత తత్త్వవిత్ // 48
( నిన్నటి దానికి కొనసాగింపు )

' కర్మలు ప్రకృతికి సంబంధించినవి.  ప్రకృతి,  కర్మలవలన రూపొందుతున్నది. నేను ఏమీ చెయ్యడం లేదు. ' అని జ్ఞానయోగం సాధన చేస్తున్న తత్వవేత్త ఎప్పుడూ తలుస్తూ వుండాలి.


వివరణము :  గురువుద్వారా ఆత్మను గురించి తెలుసుకున్నవాడు తత్వవిదుడే. గాఢమైన భక్తి చేత లేక విరక్తి చేత ఎవరికైతే వాసనలు క్షీణిస్తాయో, వాడికి ఆత్మ తత్వము తెలుసుకున్నంతనే, ఆత్మసాక్షాత్కారము కలిగి ఆత్మ సుఖమును అనుభవిస్తాడు.


అయితే, ప్రబలమైన వాసనలు కలవానికి ఆత్మసాక్షాత్కారము కలగాలంటే, మరికొద్ది జ్ఞానయోగ అమనస్క సాధన నిరంతరమూ అవసరం అవుతుంది. మట్టితో రూపొందిన కుండ మట్టి అయినట్లే, ప్రకృతి వలన రూపొందిన శరీరము కూడా ప్రకృతియే.  అజ్ఞానము వలన సంకల్పములు, వాటివలన కర్మలు ఆకర్మల వలన ప్రాకృతమైన శరీర ఫలములు అనుభవించాలిసిందే।  ' ఏది చేసినా శరీరమూ, ఇంద్రియాలు కదా చేసేది.  కాబట్టి, ఏ ఫలమైనా అవే పొందుతున్నవి. నాకేమీ సంబంధము లేదు. '  అని జ్ఞాని భావించాలి.

ఇప్పుడు ఇంకొక ప్రశ్న తలయెత్తుతున్నది.

' నిరంతర అమనస్కయోగంతో ఆత్మసాక్షాత్కారము కలిగి అజ్ఞానము నశించి సంసారబంధముల విముక్తి కలుగుతుందని చెబుతున్నారు కదా !  కానీ ఇప్పటి వరకువున్న ఈ అజ్ఞానము ఎప్పుడువచ్చి మనలను చేరినదో తెలియదు కదా. ఇప్పుడు జ్ఞానము చేత అది తొలగిపోయినా, మరలవచ్చి ఆవరింపదని ఎలా చెప్పగలం ?  ఉదయం సూర్యుడు వున్నా, సాయంత్రానికి సూర్యుడు వెళ్ళిపోగానే చీకటి వస్తున్నది కదా !  అలాగే అజ్ఞానము కూడా మరల ఆవరించినచో దానితో పాటు దూరమైన సంసారరూపమైన ప్రకృతి బంధములు తప్పవుకదా.'  అనే సందేహానికి  పరమేశ్వరుడు  సమాధానం చెబుతున్నాడు ।

శ్లో।  నైవ ప్రకృబంధో>స్తి ముక్త ఇత్యభిధీయత్నే /
       వ చైవ ప్రాకృతై రాదోషైర్లిప్యతే  స కదాచన  //  49

అసలు ప్రకృతిబంధమే లేదు.ఎవడునూ ముక్తుడనీ చెప్పబడ లేదు. ప్రకృతి సంబంధములైన దోషములు ఎప్పుడూ ఆత్మ స్వరూపుడైన వాడికి అంటేనే అంటవు.


వివరణము :   ఎవరైనా ఒక జ్ఞానిని గురించి ప్రజలు, ' ఆ మహానుభావుడు ఫలానా దేవుని భజించి ముక్తిని పొందాడు ' అని చెబుతారు.  అంటే వారి దృష్టిలో, అప్పటివరకు సంసారము చేత బంధించబడి,  ఆ దేవుని అనుగ్రహం వలన ఆ బంధమునుండి అతడు విముక్తుడు అయ్యాడని అర్ధము.


కానీ, ఆత్మ సాక్షాత్కారమును పొందినవాని అనుభవం అలా వుండదు. ఆత్మ ఎప్పుడూ శుద్ధమూ, అద్వితీయము అని వేదాంతములు ఘోషిస్తున్నాయి కాబట్టి, ఆత్మ ఎప్పటికీ ప్రకృతిచే బంధించబడదు.  ఆత్మ సాక్షాత్కారమును పొందిన వాడు, తనకన్నా అన్యంగా ఏదీలేదనీ, ప్రకృతికి తానెప్పుడూ బద్ధుడను కాదనీ తెలుసుకుంటాడు.


' ముక్తి అనేది ఇంతకుముందు లేక ఇప్పుడు కలిగితే, కొంతకాలానికి పోతుందేమో అనుకోవడం సంభవమే. '  మనము ఎప్పుడూ ముక్తులమే, మనము ఎప్పుడును ప్రకృతి చేత బంధింపబడిలేము. '  అనే భావన ఆత్మజ్ఞానులకు పరిపూర్ణంగా వుంటుంది.


శ్రీ గౌడపాదుల వారు, మాండూక్య కారికలలో  ' ప్రళయమూ లేదు, సృష్టీలేదు.బద్ధుడూ లేడు, సాధకుడూ లేడు. ముముక్షువూ లేడు, ముక్తుడునూ లేడు.  ఇదే పరమార్ధము. ' అని చెప్పివున్నారు.


అనగా, అందరూ ఎల్లప్పుడూ ముక్తులే. కానీ కొందరు బద్ధులమని భ్రమలో వున్నారు. నేనుసంసారిని అనుకోవడమే భ్రమ.  ' నేను సంసారిని కాను, ఆత్మను. ' అని తెలుసుకున్నవాడు భ్రాంతిరహితుడై ముక్తుడు అవుతున్నాడు. కాబట్టి సాధన చేస్తుంటే కొంతకాలానికి ముక్తి కలుగుతుందనుకోవడం భ్రాంతి.  ఆత్మ స్వరూపుడుగా ప్రతివ్యక్తీ తాను ముక్తుడే.


' నేను సంసారిని కాను. ' అని ఎప్పుడు అనుకోగలిగితే అప్పుడే ముక్తి.  భగవాన్ రమణ మహర్షి ఎందరికో ఈ విషయాన్ని, అనేక పర్యాయాలు చెప్పివున్నారు.


సూర్యుడు క్రొత్తగా రానక్కరలేదు, సూర్యుని చుట్టూ వున్న మబ్బులు తొలగితే, సూర్య ప్రకాశం మనకు తెలుస్తుంది కదా !  ఇదీ అలాంటిదే!.

🕉🌞🌏🌙🌟🚩

21.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో। అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్ /
నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని యత్సుఖం //

నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్ /
తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్ // 39 ।
శ్లో। నిరస్య విషయాసంగం మనోవృత్తిం వివర్జయేత్ /
యాదాయా ట్యూన్మనీభావం తదా తత్పరమం సుఖం // 40
శ్లో। సర్వదిగ్దేశ కాలేషు యోగాభ్యాసో విధీయతే /
సర్వ వర్ణాశ్రమాణాం చ జ్ఞానభేదో న విద్యతే / 41 ।

శ్లో। గవామనేక వర్ణానాం క్షీర స్యాప్యేక వర్ణతా /
క్షీరవద్దృశ్యతే జ్ఞానం లింగినశ్చ గవా౦ సమా : // 42

యస్మాత్సర్వా గతం బ్రహ్మవ్యాపకం సర్వతోముఖం /
తస్మాద్బ్రహ్మణి సంస్థ స్సన్ దిగ్దేశాన్న విచారయేత్ // 43 ।

శ్లో। నైవ తస్య కృతే నారదో న కార్యో న విధిస్మృతా : /
న లింగం నాశ్రమాచారా స్స్థితస్య పరమాత్మని // 44

శ్లో । గచ్ఛం తిష్ఠన్ స్వపన్ జాగరణ్ భుంజానో>పి పిబన్నపి  /
      సర్వథా సర్వకాలేషు వాతశీతాతపేషు చ  //  45

శ్లో। భయదారిద్య్ర రోగేషు మాంద్య విజ్వరకాదిషు /
      ఆత్మన్యేవస్థితా శ్శాంత : ఆత్మత ప్తస్తు నిష్కళ :  //  46

ఆత్మానందం చేత తృప్తిచెందిన యోగి, పశువులు మనుష్యులు అని ఏ భేదములను పాటింపడు.  నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, మెలకువతో వున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, ఏదైనా త్రాగుతున్నప్పుడు, అన్నివేళలా వాతావరణముతో సంబంధము లేకుండా, తనను దారిద్య్రము, రోగము మాంద్యము, విషరోగము బాధిస్తున్నా    తనకన్నా అన్యమైనది ఏదీలేదనే భావనతో శాంతుడై నిలిచివుంటాడు.

శ్లో। నాగతో>హం గతోవాపి నాగమిష్యే నమేగతి :  /
      నభూతో న భవిష్యామి ప్రకృత్యస్థిర ధర్మిణి //  47.

నేను ఎక్కడినుండి రాలేదు. ఎక్కడకూ పోయేవాడను కాను.  ఇకముందు ఎక్కడికీపోయేది లేదు. నేను ఒకప్పుడు వేరే విధంగా వున్నదీ లేదు. అసలు నాకు గమనమే లేదు.  నేను వెనుకటి రోజులలో ఒక విధంగా వుండి, భవిష్యత్తులో వేరే విధంగా వుండబోయేదీ లేదు.   నేను ఎప్పుడూ నిశ్చలంగానే నిర్వికారంగానే వున్నాను.


కానీ ఈ శరీరము ప్రకృతి చేత షడ్వికారములూ పొందుతూ, అస్థిరములైన ధర్మములతో వుంటున్నది.  కాబట్టి మార్పులు ఏమైనా వుంటే అవి శరీరానికి సంబంధించినవి కానీ, నాకు కావు.


వివరణము :    స్థూల భూతములు, సూక్ష్మ భూతములు, ఇంద్రియములు మొదలైనవాటి సముదాయమే ప్రకృతి.  ఈ ప్రకృతి, జీవుని కర్మను అనుసరించి,  స్థూల సూక్ష్మ శరీరాలుగా రూపొంది, నిరంతరమూ మార్పు చెందుతూ, శరీరాన్ని నడిపిస్తూ వుంటుంది.   అందువలననే స్థూల శరీరము, ఒక చోటనుండి వేరొక చోటికి వెళుతూ, వస్తూ, పెరుగుతూ, కృశిస్తూ ఎన్నో మార్పులు చెందుతుంది.  సూక్ష్మ శరీరము కూడా ఎన్నో సుఖ దుఃఖాలను పొందుతూ వుంటుంది.


స్థూల శరీరము పడిపోగానే, సూక్ష్మ శరీరము లోకాలను దాటి వెళుతూ వస్తూ, కొత్త స్థూల శరీరాలను పొందుతూ వుంటుంది.
ప్రయాణసాధనములో కూర్చుని, మనము కదలకుండా గమ్యము చేరుతున్నట్లు, సూక్ష్మ శరీరముచే నడుపబడుతున్న స్థూలశరీరము ఎన్ని రాకపోకలు గావించినా, ఆగిపోయినా, ఆత్మజ్ఞునకు అది ఏమీ తెలియదు.   కేవలము సాక్షిగానే వుంటున్నాడు.

శ్లో। ప్రాకృతాని తు కర్మాణి ప్రకృతి : కర్మసంభవా  /
      నైవ కించిత్కరో మీతి యుక్తోమన్యేత తత్త్వవిత్  //  48.

🕉🌞🌎🌙🌟🚩

ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
20.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్ /
నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని యత్సుఖం //

నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్ /
తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్ // 39 .
శ్లో. నిరస్య విషయాసంగం మనోవృత్తిం వివర్జయేత్ /
యాదాయా ట్యూన్మనీభావం తదా తత్పరమం సుఖం // 40
శ్లో. సర్వదిగ్దేశ కాలేషు యోగాభ్యాసో విధీయతే /
సర్వ వర్ణాశ్రమాణాం చ జ్ఞానభేదో న విద్యతే / 41 .

శ్లో. గవామనేక వర్ణానాం క్షీర స్యాప్యేక వర్ణతా /
క్షీరవద్దృశ్యతే జ్ఞానం లింగినశ్చ గవా౦ సమా : // 42

యస్మాత్సర్వా గతం బ్రహ్మవ్యాపకం సర్వతోముఖం /
తస్మాద్బ్రహ్మణి సంస్థ స్సన్ దిగ్దేశాన్న విచారయేత్ // 43 .

ఎన్ని రంగుల ఆవులున్నా, అవి ఇచ్చే పాలరంగు తెలుపు మాత్రమే అయినట్లు, వర్ణాశ్రమ ధర్మములు కలవారు వేరువేరుగా వున్నా, ఈ అమనస్క జ్ఞానయోగము మాత్రము  గోవుపాలవలె ఏకరూపముగానే వుంటుంది.

బ్రహ్మము సర్వ గతము, సర్వ వ్యాపకం, సర్వతో ముఖం. అలాంటి బ్రహ్మాన్ని ' అహం బ్రహ్మాస్మి ' అనే భావనతో వున్నవాడు దర్శించేటప్పుడు, దిక్కులను గురించి, ప్రదేశాల గురించి, సమయముల గురించి విచారణ చేయకూడదు.


వివరణము : ఆత్మతత్వమే బ్రహ్మము.  అది చేతనము గా వున్నప్పుడు, అచేతనంగా వున్నప్పుడూ అన్నింటా వ్యాపించి వున్నది.   ఏ వస్తువుకైనా నామరూపాలే ముఖాలు.   నామరూపములు లేని ఏ వస్తువు గురించి ఆలోచన చెయ్యాలని ప్రయత్నించినా,  ఆ ఆలోచనలు బ్రహ్మము వద్దకే చేరుస్తాయి.   కాబట్టి వస్తువుల యొక్క ముఖద్వారాలన్నీ బ్రహ్మమును చేరడానికే ఉపయోగపడతాయి.    కాబట్టి బ్రహ్మము సర్వతోముఖము. 


అలాంటి బ్రహ్మమునందు వున్నవాడు, అనగా ఆత్మ విచారణ అనే సాధనలో వున్నవాడు ఏ భేదములకు బద్ధుడు కారాదు.   అన్నివర్ణాలలోని బ్రహ్మచారులు, గృహస్తులకు  కూడా  ' ఈ అమనస్క జ్ఞానయోగమును అవలంబిస్తే,  తమకు శాస్త్రములలో విధించిన ధర్మాలను, ఆచారాలను భేదాలను పాటించనక్కర లేదా ? ' అనే సందేహం వస్తూ వుంటుంది.     ఇక్కడ నిశితముగా విచారణ చేస్తే,  ' ఏకాంతముగా మనస్సులో ఏ తలుపులూ లేకుండా సాధన చేసేటప్పుడు  ఏ నియమాలూ పాటించనక్కర లేదనీ, లోకంలో విషయములతో,  ప్రాణులతో వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం,  వ్యవహారాలు చేస్తూనే, సర్వమును బ్రహ్మముగా  చూస్తుండడం అలవాటుచేసుకోవడం జ్ఞానయోగం '.  అనీ అవగాహనా వస్తుంది.

భావమునందు  మాత్రమే యోగి బ్రహ్మదృష్టిని కలిగి వుంటాడు.   కానీ ప్రవర్తనలో ధర్మభేదాలను తప్పక పాటిస్తాడు.    ఆదిశంకరులు, సరతత్వోపదేశ గ్రంధం లో,

శ్లో. భావాద్వైతం సదాకుర్యాత్ క్రియాద్వైతం నాకర్హిచిత్ /
     అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం  గురుణా సహ  //    అని చెప్పారు.

అనగా,   ' ఎల్లప్పుడూ జ్ఞాని భావంలో అద్వైతమును కలిగి వుండవలెను.  క్రియయందు అద్వైతమును అవలంబింపరాదు.  మూడులోకములందూ అద్వైతము భావన చేసినా, గురువు విషయంలో అద్వైతమును చూడరాదు. '


అనేక ధర్మాలతో కూడిన  జ్ణాని అయిన యజమాని, యజ్ఞాలు మొదలైన మహాకార్యాలు నిర్వహిస్తున్నా, సకల పదార్థములందూ  బ్రహ్మదృష్టిని ఎలా కలిగి ఉంటాడో, భగవద్ గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. 

                              శ్లో. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి : బ్రహ్మాగ్నో   బ్రాహ్మణాహుతం  /
      బ్రహ్మయివ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా  //

అదే,  '  అర్పణము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము,  ఆ హవిస్సు బ్రహ్మము అనే అగ్ని యందు బ్రహ్మము చేతనే హుతము కావింపబడుతున్నది.  కర్మ బ్రహ్మ స్వరూపమే అనే   దృష్టితో యజ్ఞాన్ని చేసేవాడు పొందవలసిన లోకము కూడా బ్రహ్మమే అయివున్నది.  '

శ్లో.  నైవ తస్య కృతే నారదో న కార్యో న విధిస్మృతా :  /
      న లింగం నాశ్రమాచారా స్స్థితస్య  పరమాత్మని  //  44

ఇప్పటి వరకు ఈ యోగమును అవలంబించే సామాన్యుల గురించి చెబుతూ, ఇప్పుడు సకల కర్మలను సన్యసించి, ఆత్మవిచారమునే అవలంబించే యోగులను గురించి  పరమేశ్వరుడు చెబుతున్నాడు.


పరమాత్మ  తప్ప వేరుగా భావములేని వారికి ఆశ్రమముల యొక్క, ఆచారములు యొక్క, నియమాలు గానీ, శిఖా, యజ్నోపవీతము,  బొట్టు మొదలైన చిహ్నములు అక్కరలేదు.    ఎందువలన అనగా అలాంటి వారు ప్రత్యేకంగా పొందవలసినది ఏమీ లేదు.    కాబట్టి చేయవలసిన కర్మలూ ఏవీలేవు.     ధర్మశాస్త్రం లో వారికి ఏ విధీ చెప్పబడి లేదు.


వివరణము :   శాస్త్ర క్రతువులన్నీ ఫలాపేక్ష మీదా,  వ్యక్తి యొక్క అభిమానము మీదా ఆధారపడి ఉంటాయి.    స్వర్గము కావలసిన బ్రాహ్మణుడు సోమయాగము చెయ్యాలి అని చెప్పినప్పుడు,  నేను బ్రాహ్మణుడను అని అభ

ిమానము కలవాడు మాత్రమే ఆ యాగం చెయ్యడానికి అర్హుడు. 


అలాగే ఇంద్రునితో సమానమైన పదవి కావాలంటే, క్షత్రియుడు రాజసూయ యాగం చెయ్యాలి అన్నప్పుడు,  క్షత్రియుడను అనే అభిమానం వున్నవాడు మాత్రమే ఆ యాగము చెయ్యగలడు.    తక్కినవారు, ఆయాగములు తమకు సంబంధించినవిగా తలపోయరు.    అందువలన ఆ యజ్ఞాలు చెయ్యడానికి వారు పూనుకోరు.


కాబట్టి శాస్త్ర విధులన్నీ మనము కోరుకున్న ఫలము మీదా, మనకు వున్న వ్యక్తిత్వము మీదా ఆధారపడి వున్నాయి.   లోక వ్యవహారము కూడా ఇలాంటిదే !   నేను ఫలానా వర్ణము వాడిని, ఫలానా  ఆశ్రమ ధర్మాలువున్నవాడిని  అని జ్ఞానికి దృష్టి లేనప్పుడు, ఈ క్రతువుల ధ్యాస కూడా వుండదు.


ఒకయజమాని వద్ద పదిమంది భృత్యులు వున్నప్పుడు,   యజమాని ఒక భృత్యుని పేరు పెట్టి  పిలిచి,  ' ఈ పని చేసుకురా ! '  అని చెప్పినప్పుడు,మిగిలిన భృత్యులు దాని గురించి ఆలోచించరు కదా.   అలాగే, దేహాభిమానము లేని యోగి, వర్ణాలకు, ఆశ్రమాలకు   సంబంధించిన వ్యక్తులకు ఏవైనా శాస్త్ర విధులు నిర్దేశిస్తే,  అవి తనకు సంబంధించినవి కావని జ్ఞాని నిర్లిప్తంగా ఉంటాడు. 

అనగా దేహాభిమానరహితునకు, ఏ శాస్త్రవిధీ  నిర్దేశింపబడి లేదు.

***
19.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్ /
నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని యత్సుఖం //

నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్ /
తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్ // 39 .
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో.  నిరస్య విషయాసంగం మనోవృత్తిం వివర్జయేత్  /
      యాదాయా ట్యూన్మనీభావం  తదా తత్పరమం సుఖం //  40

కీర్తి, పదవులు, సుఖములు మొదలైన విషయములందు ఆసక్తిని వదలిపెట్టి మనస్సులో వృత్తులు లేక ఆలోచనలు కలుగకుండా చేసుకోవాలి.  నిరంతరమైన అభ్యాసముతోనే ఇది సాధ్యము. 


కంటిలో పొర కలిగిపోవాలంటే కంటిమందు చుక్కలు వేసుకుంటే,  క్రమంగా పొర కరిగిపోతుంది.   పొర ద్రవరూపంలో కంటిలోవున్నా  దృష్టికి అవరోధము కలుగకుండా వుంటుంది.   అలాగే, తలపులు పుట్టని మనస్సు ఆత్మ యొక్క ప్రకాశానికి అడ్డుగా వుండదు.   దానినే ' ఉన్మనీభావము '  అంటారు.   ఆ స్థితి యందే పరమ సుఖం కలుగుతుంది.

శ్లో.  సర్వదిగ్దేశ కాలేషు యోగాభ్యాసో విధీయతే /
     సర్వ వర్ణాశ్రమాణాం చ జ్ఞానభేదో న విద్యతే /   41 .

మనస్సును వృత్తిరహిత౦ గా చేసుకునే యోగాన్ని ఎవరైనా యెక్కడైనా చేసుకోవచ్చును.
అన్ని దిక్కులలో, అన్ని స్థలములలో, అన్ని కాలములలో ఈ యోగమును అభ్యసిస్తూనే   వుండాలి.   ఏ కులము వారైనా, ఏ ఆశ్రమ ధర్మాలలో వున్నవారైనా దీనిని నిరభ్యంతరంగా  అభ్యసించవచ్చు.  జ్ణానమార్గాన వెళ్లే వారికి చిత్తశుద్ధి మినహా  ఏ భేదములు లేవు.


వివరణము :    మనస్సులో ఆలోచనలు లేకుండా  చేసుకోవడాన్ని, '  అమనస్కము  ' అంటారు.   దీనినే పద్దతి  ప్రకారం చేయడము అమనస్క యోగము అంటారు.   దీనిని అభ్యసించేవారికి,  మిగిలిన దేవతలను పూజిస్తున్నప్పుడు  వున్న దిక్కుల, ప్రదేశములు, కాలముల ఆంక్షలు ఏమీ వుండవు. ఏదిక్కు వైపు తిరిగి కూర్చొవాలి ?  ఏ స్థలంలో కూర్చోవాలి,  ఏ సమయంలో చెయ్యాలీ ? అనే పట్టింపులు వుండవు.


అలాగే బ్రాహ్మణాదివర్ణముల వారు కర్మానుష్టాన సమయంలో చేసే విధి విధానాలు అమనస్క యోగ సాధనలో అవసరం లేదు.  బ్రహ్మచర్యాది ఆశ్రమముల  భిన్నములైన విధానములు కూడా ఈ యోగమును అభ్యసించడానికి అడ్డంకి కావు.   ఎవరైనా దీనిని అభ్యసించవచ్చును.


శ్లో.   గవామనేక వర్ణానాం  క్షీర స్యాప్యేక వర్ణతా /
      క్షీరవద్దృశ్యతే  జ్ఞానం లింగినశ్చ గవా౦  సమా :  //  42

      యస్మాత్సర్వా గతం బ్రహ్మవ్యాపకం సర్వతోముఖం  /
      తస్మాద్బ్రహ్మణి సంస్థ స్సన్ దిగ్దేశాన్న విచారయేత్  //  43 .

ఎన్ని రంగుల ఆవులున్నా, అవి ఇచ్చే పాలరంగు తెలుపు మాత్రమే అయినట్లు,  వర్ణాశ్రమ ధర్మములు కలవారు వేరువేరుగా వున్నా,  ఈ అమనస్క జ్ఞానయోగము మాత్రమూ గోవుపాలవలె ఏకరూపముగానే వుంటుంది.


బ్రహ్మము సర్వ గతము, సర్వ వ్యాపకం, సర్వతో ముఖం.  అలాంటి బ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి అనే భావనతో వున్నవాడు  దర్శించేటప్పుడు,  దిక్కులను గురించి, ప్రదేశాల గురించి, సమయముల గురించి విచారణ చేయకూడదు.

***
ఓం నమః శివాయ:
18.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్ /
నాన్య శ్శరణద : కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్ // 25 .
ఆత్మానం పరమో భూత్వా యో విజానాతి తత్త్వత : /
స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ // 26 .
శ్లో. ఆత్మలాభాత్పరో లాభ : క్వచిదన్య న్న విద్యతే /
తదాత్మాన ముపాసీత యో >య మాత్మా పరంతు స : // 27 .
శ్లో. న ప్రాణో నైవ చాపానో విశిష్టకరణ స్తథా /
సర్వజ్ఞమ్ తు త మాత్మానం పరిపూర్ణం సదా స్మరేత్ // 28
శ్లో. నచైవాభ్యంతరే బాహ్యే వాతిదూరే సమీపత : /
సునిష్కళే పరే స్థానే తత్ర చిత్తం నివేశయత్ // 29 .
శ్లో. తిర్యగూర్ధ్వ మధశ్చైవ బహిరన్తశ్చ నిత్యశ : /
సర్వశూన్యం భాసమాన మాత్మానం భావయేత్సదా // 30 .
శ్లో. నైవ శూన్యం నచాశూన్యమశూన్యం శూన్యమేవచ
పక్షపాత వినిర్ముక్తమాత్మనమ్ పర్యుపాసయేత్ // 31 .
శ్లో. నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం /
నిరంజనం గుణాతీతమాత్మానం పర్యుపాసయేత్ // 32 .
శ్లో. నిరాశ్రయం నిరాలమ్బమప్రమేయ మనౌపమం /
స్వభావ విమలం నిత్యమాత్మానం పర్యుపాసయేత్ / ౩౩
శ్లో. సన్న్యస్య సర్వకర్మాణి నిస్పృహ స్సంగవర్జిత : /
భావయేదాత్మ నాత్మాన మాత్మన్యే వాత్మనిస్ధితం // 34 .
శ్లో. స దేశజాతి సంబంధాన్ వర్ణాశ్రయమాన్వితాన్ /
భావానితాం పరిత్యజ్య స్వరూపం భావయేద్బుద : // 35
శ్లో. మంత్రోయం దేవతాహ్యేషా త్విదం ధ్యాన మిదం తప : /
సర్వభావాన్ పరిత్యజ్య స్వాత్మభావం తు భావయేత్ // 36 .
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో. అభవో భావమాశ్రిత్య భావం కుర్యాన్నిరాశ్రయం /
ఆత్మసంస్థం మన : కృత్వా న కించిదపి చింతయేత్ // 37

శ్లో. నైవచింత్యం నచాచిన్త్యమచిత్తం చిత్తమేవచ /
పక్షపాత వినిర్ముక్తా మాత్మానం పర్యుపాసయేత్ట్ / 38 .


శ్లో.  అచింత్యం చింతయేన్నిత్యం కృత్వాచిత్తం నిరాశ్రయమ్  /
      నిస్తత్వే నిష్కళీభూతే విన్దత్యాత్మని  యత్సుఖం  // 

      నిర్వికల్ప మచిన్త్యం చ హేతు దృష్టాంతవర్జితమ్  /
      తత్సుఖం పరమం ప్రోక్తమాత్యన్తిక మనౌపమమ్  //  39 . 

మనస్సులో ఇతరములైన తలంపులు లేకుండా,  సాధారణమైన ఆలోచనలకు అందని ఆత్మను గురువుచే చెప్పబడిన,  శాస్త్రములలో చదువబడిన ఉపదేశములను అనుసరించి  ఎల్లప్పుడూ చింతన చేస్తూ వుండవలెను. 


నిస్తత్వము, నిష్కళం అయిన ఆత్మ సాక్షాత్కరించినప్పుడు నిర్వికల్పము అచింత్యము  హేతు దృష్టాంతవర్జితము అయిన ఏసుఖమును పొందుచున్నదో,  అదే పరమసుఖమని అనౌపమమని చెప్పబడుచున్నది. 


స్థూల దేహముతో, సూక్ష్మదేహముతో తాదాత్మ్యమును అనగా గుర్తింపును పొంది మనము  అదే ' నేను ' అనుకుంటున్నాము.  కాబట్టి వాటికీ సంబంధించిన సుఖ దుఃఖముల చేత భయ క్రోధముల చేత నేను అనే స్ఫురణ ఎప్పుడూ వుంటుంది.   అందువలన నేను అనే స్ఫురణ యొక్క అసలు స్వరూపము తో కూడిన ఆనందము చిల్లులకుండలో వున్న దీపము యొక్క కాంతిలాగా కొంచెమే లభిస్తుంది.   దానిని ఆవరించివున్న లౌక తత్వములను తొలగించినచో,  నేను యొక్క ఆనందము సంపూర్ణంగా గోచరిస్తుంది. 


అహంకారము, బుద్ధి, సూక్ష్మ భూతములు, స్థూల భూతములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు మనస్సు, అవ్యక్తము  అనేవి తత్వములు.  స్థూల సూక్ష్మ శరీరముల రూపంలో ఆత్మను ఆశ్రయించి వుంటాయి.    గాఢనిద్రలో ఈ స్థూల సూక్ష్మ శరీరముల తత్వములనుండి బయటకు వస్తాడు కాబట్టి,  నేను అనే స్ఫురణ కూడా బయటకు పోతుంది. 


మనలోవున్న ఆత్మ,  తత్వములు లేనిదిగా ఎప్పుడు గోచరిస్తుందో, అప్పుడు సకల ప్రాణులలో నిష్కళముగా  అనగా ఏ భేదములు లేకుండా అఖండంగా గోచరిస్తుంది.   గాఢనిద్రలో వున్నవానికి  మెలకువ వచ్చినంతనే,  నిద్రలో సుఖము చెల్లిపోతుంది.  నిద్ర సుఖానికి,  మెలకువ వికల్పము.    అలాగే రాజభోగములు అనుభవించే వాడికి అవి ఒక్కసారిగా తొలగిపోతే అతడికి వికల్పము.  లౌకకమైన ప్రతి సుఖానికి ఏదో ఒక వికల్పము వుంటుంది.    కానీ ఆత్మయొక్క ఆనందానికి వికల్పం వుండదు.


ఎవడైనా తాను ఊహాలోనికి తనకు తెలిసిన వస్తువులనే, విన్న వస్తువులతోనే పోలిక తెచ్చుకుని  తత్వము గ్రహించాలని చూస్తాడు.   అయితే ఆత్మతత్వము ఏ ఊహకూ అందదు. అందువలన అది అచింత్యము.  సమాజంలో, ధనము, కీర్తి, భోగములు యిలా ఏదో ఒకదాని కారణంగా మానవుడికి సుఖం కలుగుతుంది.    ఆ హేతువు పొతే సుఖం కూడా పోతుంది.  ఆత్మసుఖానికి హేతువు అంటూ ఏదీలేదు.  కాబట్టి ఆ సుఖము శాశ్వతము. 


అలాగే దృష్టాంతారములు కూడా.   తెలిసిన వాటితోనే ఎవరైనా కొత్తదాని పోలిక చెబుతారు.   లోకములోని సుఖములు మనస్సు చేత గ్రహింప బడుతుండగా, ఆత్మ మనస్సుకు అతీతం.  కాబట్టి ఆత్మసుఖంతో సామ్యము చెప్పగలిగిన దృష్టాంతరం లోకమున ఏదీలేదు.  అందువలన ఆత్మ దృష్టాంతవర్జితము.


ఆత్మ ఆత్యంతికము.  అంతం అనగా  నిశ్చయము.  అంతమునకు శ్రేష్టమైనది అత్యంతము.    ఇది ఇంత పెద్దగా విశాలముగా వుండును అని  దేని గురించి చెప్పలేమో అది అత్యంతము.  ఆత్యంతికము.  మన నిశ్చయములకు అందనిది.  ఆత్మసుఖము బుద్ధికి అతీతశము కావున అత్యంతికము.


ఉపమ అనగా పోలిక. పోలికచేత గ్రహింపబడేది ఔపమము.  అలా గ్రహిచుటకు సాధ్యము కానిది అనౌపమము.   ఆత్మసుఖనికి  దృష్టాంతరంలేనట్లే ఉపమానము కూడా లేదు.  కాబట్టి ఆత్మ అనౌపమము.  


అలాగే దేనికన్నా మి౦చినది లేదో అది పరమము.   ఆత్మసుఖమునకు
 సామ్యము లోకమున లేకుండుటచే దానిని మి౦చి వేరొక సుఖము లేదని అర్ధం అవుతున్నది.  అందువలన ఆత్మసుఖము పరమము.    

***

ఓం నమః శివాయ:
16.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్ /
నాన్య శ్శరణద : కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్ // 25 .
ఆత్మానం పరమో భూత్వా యో విజానాతి తత్త్వత : /
స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ // 26 .
శ్లో. ఆత్మలాభాత్పరో లాభ : క్వచిదన్య న్న విద్యతే /
తదాత్మాన ముపాసీత యో >య మాత్మా పరంతు స : // 27 .
శ్లో. న ప్రాణో నైవ చాపానో విశిష్టకరణ స్తథా /
సర్వజ్ఞమ్ తు త మాత్మానం పరిపూర్ణం సదా స్మరేత్ // 28
శ్లో. నచైవాభ్యంతరే బాహ్యే వాతిదూరే సమీపత : /
సునిష్కళే పరే స్థానే తత్ర చిత్తం నివేశయత్ // 29 .
శ్లో. తిర్యగూర్ధ్వ మధశ్చైవ బహిరన్తశ్చ నిత్యశ : /
సర్వశూన్యం భాసమాన మాత్మానం భావయేత్సదా // 30 .
శ్లో. నైవ శూన్యం నచాశూన్యమశూన్యం శూన్యమేవచ
పక్షపాత వినిర్ముక్తమాత్మనమ్ పర్యుపాసయేత్ // 31 .
శ్లో. నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం /
నిరంజనం గుణాతీతమాత్మానం పర్యుపాసయేత్ // 32 .
శ్లో. నిరాశ్రయం నిరాలమ్బమప్రమేయ మనౌపమం /
స్వభావ విమలం నిత్యమాత్మానం పర్యుపాసయేత్ / ౩౩
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో. సన్న్యస్య సర్వకర్మాణి నిస్పృహ స్సంగవర్జిత : /
భావయేదాత్మ నాత్మాన మాత్మన్యే వాత్మనిస్ధితం // 34 .

సర్వకర్మలనూ విడిచిపెట్టి,  దేనియందూ వ్యామోహం పెంచుకోకుండా,  పుత్ర మిత్ర కళత్రాదులందు  అపేక్ష లేనివాడై,  తనలోతనే రమించుచూ తనలోవున్న చైతన్యాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ, శాస్త్రముల చేత, గురువుల చేత చెప్పబడిన ఉపదేశములను మననం చేసుకుంటూ, నిశ్చితమైన బుద్ధితో పరమాత్మను భావిస్తూ వుండవలెను.


శ్లో. స దేశజాతి సంబంధాన్ వర్ణాశ్రయమాన్వితాన్ /
భావానితాం పరిత్యజ్య స్వరూపం భావయేద్బుద : // 35 

అన్ని వర్ణములను, అన్నిఆశ్రమములనూ అన్ని ప్రద్దేశాలనూ వాటికి సంబంధించిన వాటిని ప్రక్కకుపెట్టి, వాటి సకలమైన ఆలోచనలనూ పరిత్యజించి,  ఈ భావములకు అన్నింటికీ అతీతమైన స్వరూపమును తెలుసుకోవడానికి  పండితుడైన సాధకుడు మొదలుపెట్టాలి. 

శ్లో. మంత్రోయం దేవతాహ్యేషా త్విదం ధ్యాన మిదం తప : /
సర్వభావాన్ పరిత్యజ్య స్వాత్మభావం తు భావయేత్ // 36 .

'  ఇది మంత్రము, ఈ మంత్రము ఫలానా దేవతది.  ఈ దేవతని ఈ విధంగానే ధ్యానించాలి. ఇలా నియమపూర్వకంగా ధ్యానించడమే తపస్సు. '  ఇలాంటి భావాలని అన్నింటినీ పరిత్యజించి వెనుక చెప్పిన విధంగా ఆత్మ విచారణను మాత్రమే చేస్తూ వుండాలి.  


ఈ మూడు శ్లోకములలో మొదటిది,  ' సర్వకర్మలను సన్యసించి.. అని ఆరంభం అవుతున్నది.    కాబట్టి, ఈ చెప్పబోయే  విషయములు  సన్యాసాన్ని స్వీకరించి ఆ దిశలో వున్నవారిని గురించి చెబుతున్నట్లుగా గ్రహించాలి.    సన్యాసం స్వీకరించిన వారు రెండు విధాలుగా వుంటారు.   విద్వత్సన్యాసులు. వివిదిషాసన్యాసులు.


విద్వత్సన్యాసులు  ఆత్మను గురించి చక్కగా తెలుసుకున్నవారు.  విద్వాంసులు  అయిన తరువాత సన్యాసం స్వీకరించినవారు వీరు.  వివిదిషాసన్యాసులు  .ఆత్మజ్ఞానమనే విషయము తెలుసుకోవాలనే కోరికతో  వివిదిశతో సన్యాసమును స్వీకరించినవారు.


విద్వత్సన్యాసులు అప్పటికే జ్ణానులవడం వలన ఆత్మకన్నా అన్యముగా వారికి మరేదీ భాసింపదు.  వారు రమణమహర్షుల వలే ఏ వ్యవహారమందును, వేలుపెట్టరు.  ఏదీ చెయ్యవలసిన పనిగా వారికి తోచదు.  ఒకానొకప్పుడు విద్యారణ్య మహర్షి చెప్పినట్లు, ' తనకేదో ఇంకా చేయవలసిన కర్తవ్యమ్ వున్నదని భావించేవాడు, తత్వవేత్త కాదు. '  జ్ఞానము అనే అమృతం చేత తృప్తి చెందిన యోగికి,  కొంచెము కూడా కర్తవ్యమ్ కనిపించదు.   విద్వత్సన్యాసులకు ఇది లక్షణంగా ఉంటుంది.  


 వివిదిషా సన్యాసుల విషయంలోనే,  కర్తవ్యధోరణి కనబడుతుంది.  సన్యాసము ఉత్తమమైనదని భావించి కొంతమంది సన్యాసం స్వీకరిస్తారు.    వీరందరూ నిరంతరమూ శ్రవణము, మననము, నిదిధ్యాసనము చేస్తూ, ఆత్మజ్ఞానము సాధించి, కృతకృత్యులై, ఇక కర్తవ్యమ్ తోచని తత్వవేత్త స్థితికి రావాలి.   వివిదిషాసన్యాసులకు అందరికీ వైరాగ్య స్థితి ధృడంగా ఉంటుందని భావించలేము.   మరికొందరికి సన్యాసము స్వీకరించినా తత్వజ్ఞానములోనికి బుద్ధి ప్రసరించదు.  


అలాంటివారికి సంసార భావనలు క్రొత్తరూపాలతో ప్రవేశిస్తాయి.    వారు, ' ఆత్మను తెలుసుకోవడానికి సన్యసించితిమి. '  అనే ధ్యాసను మర్చిపోయి,  దేవాలయాలు, ఆస్పత్రులూ విద్యాలయాలు, ఆశ్రమాలు నిర్మిస్తూ వాటి యొక్క బాగోగులు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు.   ' మానవసేవే - మాధవసేవ '  ఇత్యాది సూత్రాలు వల్లే వేస్తూ వుంటారు.   వారికి మళ్ళీ వ్యవహారాలు ప్రారంభమై,  తాముచేసే పనులకు అనుకూలించే వారియందు అనురాగము,  ప్రతికూలించేవారి యందు ద్వేషము ఏర్పడును. 


అంతేకాకుండా, '  వీడు మన ప్రాంతము వాడు, వీడు మనజాతి వాడు, వీడు కాదు. '   అనే భేదభావాలు అంకురించడం మళ్ళీ మొదలవుతాయి.    మరికొంతమంది దేవతలను ఉపాసిస్తూ మంత్రసిద్ధులను సాధిస్తూ,  శిష్యులను పోగుచేసుకుని, ఉపదేశములు చేయుచుందురు. 


వీరిలాంటి వారిని  ఉద్దేశించి, పరమేశ్వరుడు, ఈ నిషేధాలను విధించాడు.    సన్యాసమనగా, సకల లౌకిక వ్యవహారములు, వైదిక వ్యవహారములు వదులుకోవడమే కదా !  ఆలయాలు, మొదలైనవి నిర్వాహ్ణచడానికి సన్యాసమెందుకు ?  గృహస్తులుగానే వుండి సాంఘిక సేవా కార్యక్రమాలు అనేకం చెయ్యవచ్చును. 


అందువలనే, ఆత్మను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస వున్నవాడు, అన్ని వ్యవహారాలను వదిలిపెట్టి, శరీరశక్తిని మనోశక్తిని శ్రవణ, మనన నిదిధ్యాసలకే వినియోగించి, ఆత్మజ్ఞానము  సంపాదనకై ప్రయత్నించాలి.    అన్యములైన పనులేమీ చేయరాదు.  '  నేను గ్రహించితిని. నేను బ్రహ్మమునైతిని. ' అనే రూఢమైన జ్ఞానము కలవాడే తత్వవేత్త.  అప్పటిదాకా  ఎట్టి సన్యాసి కూడా, ఇతర వ్యవహారములు జోలికి పోరాదని  పరమేశ్వరుడు చేస్తున్న ఉపదేశ పరమార్ధం ఇది.


'  చిత్తశుద్ధికోసం సన్యాసులు ధర్మకార్యములు చేయరాదా ? '  అని కొందరు ప్రశ్నిస్తూ వుంటారు.    చిత్తశుద్ధికోసం గానీ, జ్ఞానసేకరణ  చేసుకున్నది దృఢంగా ఉండాలన్నా గానీ , సన్యాసులు శ్రవణాదులే చెయ్యాలి.   దానములు, ధర్మ కార్యములు గృహస్తులకు విధింపబడిన కర్మ
లు గానీ,  సన్యాసులకు  కాదు.  


ఇక, '  లోక శ్రేయస్సు కోసం కొన్ని కార్యాలు చేస్తున్నాము. '  అనే సన్యాసులు వున్నారు. అప్పుడు కూడా మొదట తాను ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆత్మనిష్ఠుడై వుండడం లోకమునకు ఆ సన్యాసి చేసే మహోపకారం.  ఈ విషయంలో రమణ మహర్షులు కూడా ఈ విధంగా చెప్పారు:


' తాను ఆత్మసాక్షాత్కారం పొందడమే ఏ వ్యక్తి అయినా మిగిలిన మానవులకు చేసే ఉత్తమమైన ఉపకారము.   కాబట్టే, అరణ్యంలో వుండే జ్ఞానులు, లోకానికి ఉపకారము చేస్తున్నారని చెప్పబడుతున్నది.  ఆ ఉపకారము పైకి కనబడదు. అయినా ఆ ఉపకారం వుండనే వుంటుంది.   మానవులకు, వారికి తెలియకుండానే, జ్ఞాని ఉపయోగపడుతూ వుంటాడు.'

***
15.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్ /
నాన్య శ్శరణద : కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్ // 25 .
ఆత్మానం పరమో భూత్వా యో విజానాతి తత్త్వత : /
స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ // 26 .
శ్లో. ఆత్మలాభాత్పరో లాభ : క్వచిదన్య న్న విద్యతే /
తదాత్మాన ముపాసీత యో >య మాత్మా పరంతు స : // 27 .
శ్లో. న ప్రాణో నైవ చాపానో విశిష్టకరణ స్తథా /
సర్వజ్ఞమ్ తు త మాత్మానం పరిపూర్ణం సదా స్మరేత్ // 28
శ్లో. నచైవాభ్యంతరే బాహ్యే వాతిదూరే సమీపత : /
సునిష్కళే పరే స్థానే తత్ర చిత్తం నివేశయత్ // 29 .
శ్లో. తిర్యగూర్ధ్వ మధశ్చైవ బహిరన్తశ్చ నిత్యశ : /
సర్వశూన్యం భాసమాన మాత్మానం భావయేత్సదా // 30 .
శ్లో. నైవ శూన్యం నచాశూన్యమశూన్యం శూన్యమేవచ
పక్షపాత వినిర్ముక్తమాత్మనమ్ పర్యుపాసయేత్ // 31 .

శ్లో. నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం /
నిరంజనం గుణాతీతమాత్మానం పర్యుపాసయేత్ // 32 .

ఆత్మను నిరామయంగా, ఏ ఆధారం మీద నిలబడి లేనిదానినిగా, రంగూరూపు లేనిదిగా, ఉదాసీనంగా, గుణాతీతమైనదానిగా భావించి ఉపాసించ వలెను.

శ్లో. నిరాశ్రయం నిరాలమ్బమప్రమేయ మనౌపమం /
స్వభావ విమలం నిత్యమాత్మానం పర్యుపాసయేత్ / 33

ఆత్మను, ఏఆశ్రయము కోరని దానిగా, ఏ ఆధారమూ అవసరం లేనిదిగా, లెక్కకు అందని దానినిగా, ఉపమానం చెప్పవీలుకాని దానినిగా, స్వచ్ఛమైన శాశ్వతమైన దానినిగా భావించి ఉపాసన చేయాలి.


వివరణము :  అమయము  అనగా వ్యాధి.  దేనికి వ్యాధిగ్రస్తము అవడం ఉండదో, అది నిరామయము.  శరీరం వుంటే, వ్యాధి వుంటుంది. ఆత్మకు శరీరం లేదు, వ్యాధీ లేదు.  అందువలన అది నిరామయము.


పాలను పోసి వుంచడానికి  పాత్ర అవసరం ఉన్నట్లు, ప్రతి వస్తువు నిలిచి వుండడానికి, ఒక ఆధారం కావాలి.   దాని కి ఆధారం లేకపోయినా ఉండగలుగుతున్నదీ అంటే అది నిరాధారం, పరిపూర్ణంగా తెలుసుకోవాలి.   ఆత్మ నిరంజనము.  అంజనము అనగా కాటుక.  కాటుక దేనికి తగులుకున్నా మరకలు అవుతాయి.  అలాంటి మరకలయేవీ లేకుండా స్వచ్ఛంగా ఉండేది నిరంజనం. 


అలాగే ఆత్మ గుణాతీతము.  అతి సూక్ష్మమైన ఆత్మకు,  నిప్పు యొక్కవేడిగానీ, జలము యొక్క చల్లదనం గానీ ఏమీ అంటదు.  ఇలా ఏవిధములైన గుణముల చేత ఆవరింపబడక ఆత్మ గుణాతీతం అవుతున్నది.


అలాగే దేనికి ఆశ్రయం ఉండదో అది నిరాశ్రయము.   పక్షులు నివాసం వుండడానికి చెట్లను ఆశ్రయిస్తాయి.   అయితే, ఆత్మసర్వవ్యాపకం అవడం వలన  ఆత్మయే సర్వమునకు ఆశ్రయం యిస్తుంది.  అది వేరొకచోట ఆశ్రయము పొందవలసిన అవసరం లేదు.    కాబట్టి ఆత్మ నిరాశ్రయము.  ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి వుంటుంది అనే భావన తప్పు.  శరీరరమే ఆత్మను ఆశ్రయించి వుంటుంది.    ఆలంబన అనగా అండ, ఆసరా.  చెట్టుతీగకు వృక్షము ఆలంబన.    అలాంటి ఆలంబన ఆత్మకు అవసరం లేదు కాబట్టి, అది నిరాలంబనము. 


ఇక అప్రమేయమంటే ఏమిటో చూద్దాం. .  మానము అనగా కొలవడం.  అలా కొలవడానికి వీలైనది మేయము.  హెచ్చుతగ్గులు లేకుండా కొలవగలిగి చెప్పడం,  ప్రమేయము.  గణితము, జ్యోతిషము మొదలైన విషయములు.  దీని స్వరూపం ఇది.  అని చెప్పగలిగిన విషయములు ప్రమేయములు.   ఉదాహరణకు, భూమిని,  ఇంటిని, వస్త్రాన్ని కొలిచినట్లు ఆత్మను కొలిచి హద్దులు చెప్పలేము. 


అనౌపమేయము.  అనగా ఉపమాణములకు అందనిది.   ఏదైనా కొత్త వస్తువు గురించి వర్ణించి చెప్పాలంటే,  మనకు తెలిసిన వస్తువుతో ఉపమానంగా చెప్పడం సహజం.    పిల్లిని చూపించి సుమారుగా పులిని వర్ణించవచ్చు.   అనగా పులికి రూపం వున్నది.  అలాగే పిల్లికీ రూపం వున్నది.   కాబట్టి పిల్లీ, పులీ ఉపమాన ఉపమేయములుగా సరిపోతాయి.  అయితే ఆత్మకు, రూపము, గుణము మొదలైన గుర్తించగల లక్షణాలు లేకపోవడంతో,  దానిని దేనితో ఉపమాన గా చెప్పలేము.   కాబట్టి అది అనౌపమేయము.  


శ్లో.  సన్న్యస్య సర్వకర్మాణి నిస్పృహ స్సంగవర్జిత  :    /
      భావయేదాత్మ నాత్మాన  మాత్మన్యే వాత్మనిస్ధితం  //  34  .

శ్లో.
  సందేశజాతి సంబంధాన్  వర్ణాశ్రయమాన్వితాన్   /
      భావానితాం పరిత్యజ్య స్వరూపం భావయేద్బుద :  //   35

శ్లో.  మంత్రోయం దేవతాహ్యేషా త్విదం ధ్యాన మిదం తప :  /
     సర్వభావాన్ పరిత్యజ్య స్వాత్మభావం తు భావయేత్  //   36  .

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ ఆర్యా ద్విశతి  - 16  🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక  (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. II ఆర్యా ద్విశతి - 31వ  శ్లోకము II 🌻

తాపింఛమేచకాంగీం తాళీదళఘటిత కర్ణతాటంకామ్ I
తాంబూలపూరితముఖీం తామ్రాధరబింబదృష్టదరహాసామ్ II ౩౧

🌻. తాత్పర్యముః
తాపింఛ - కానుగు ఆకుల వలె, మేచక-నల్లనయిన, అంగీం - శరీరము గలదియు, తాళీదళ - తాటి ఆకులతో, ఘటిత - చేయబడిన, కర్ణ - చెవియందలి, తాటంకాం - కమ్మలు గలదియు, తాంబూలపూరిత ముఖీం - నోటి నిండా తాంబూలము చర్వణముచేత నిండి ఉన్నదియు, తామ్ర - ఎర్రని, అధరబింబ - దొండపండువంటి పెదవి యందు, దృష్ట - కనబడుచున్న, దరహాసాం - చిరునవ్వు కలదియు.

అనగా, కానుగు ఆకులవలె నల్లనయిన శరీరం కలిగి, తాటి ఆకులతో చేయబడిన తాటంకములను ధరించినది, తాంబూలపూరితముఖీ, ఎర్రని పెదవులు కలిగి, చిరునవ్వు కలిగినదియు (31వ శ్లోకము)

🌻. II ఆర్యా ద్విశతి - 32వ  శ్లోకము II 🌻

కుంకుమపంకిలదేహాం కువలయజీవాతుశాబకవతంసామ్ I
కోకనదశోణచరణాం కోకిలనిక్వాణకోమలాలాపామ్ II ౩౨

కుంకుమ - కుంకుమచేత పంకిల - పూయబడిన, దేహాం - శరీరము గలదియు, కువలయజీవాతు - కలువలకు ప్రాణాధారమైన చంద్రుని యొక్క, శాబక - బాలుని (బాలచంద్రుని), వతంసాం - శిరోభూషణముగా గలదియు, కోకనద - ఎర్రతామర వలె, శోణ - ఎర్రని, చరణాం - పాదములు గలదియు, కోకిల - కోయిలయొక్క, నిక్వాణ - ధ్వనివలే, కోమల - మనోజ్ఞమైన, ఆలాపాం - కంఠస్వరము గలదియు,

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹

14.ఆత్మ సాక్షాత్కారం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్ /
నాన్య శ్శరణద : కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్ // 25 .
ఆత్మానం పరమో భూత్వా యో విజానాతి తత్త్వత : /
స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ // 26 .

శ్లో. ఆత్మలాభాత్పరో లాభ : క్వచిదన్య న్న విద్యతే /
తదాత్మాన ముపాసీత యో >య మాత్మా పరంతు స : // 27 .

శ్లో. న ప్రాణో నైవ చాపానో విశిష్టకరణ స్తథా /
సర్వజ్ఞమ్ తు త మాత్మానం పరిపూర్ణం సదా స్మరేత్ // 28
శ్లో.  నచైవాభ్యంతరే బాహ్యే వాతిదూరే సమీపత :  /
      సునిష్కళే పరే స్థానే  తత్ర చిత్తం నివేశయత్  //   29  .

శ్లో.  తిర్యగూర్ధ్వ మధశ్చైవ బహిరన్తశ్చ నిత్యశ :   /
      సర్వశూన్యం భాసమాన మాత్మానం భావయేత్సదా //  30 .

ఆత్మను, సర్వ దిక్కులలో అనగా నేలకు సమాంతరంగా , ఊర్ధ్వముఖంగా, అధోముఖంగా, వెలుపల, లోపల అన్నిదిశలలో ఎల్లప్పుడూ,ఏదీ తనలో ఉంచుకోకుండా సాక్షీభూతంగా ఉండేదే  అని భావించవలెను. 


ఆత్మ  సర్వశూన్యంగా ప్రకాశించడం ఏమిటీ ?   ఎప్పుడైనా పదార్థముల యొక్క మూలముల మీద దృష్టి పెడితే, వాటికి వున్న నామరూపములు దృష్టిలో వుండవు.   బంగారు వర్తకుడు ఏదైనా ఆభరణం వేళా కడుతున్నప్పుడు,  దానిలో వున్న బంగారం మీదనే అతని ధ్యాస వుంటుంది కానీ,  ఆభరణంమీద వుండదుకదా !   అతనిచూపు అంతా  విలువైన మూలవస్తువు బంగారం మీదనే కేంద్రీకరించి వుంటుంది.  మిగిలినది శూన్యం గా గోచరిస్తుంది.


అణుశక్తి మీద పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులు కేవలం అణుశక్తి మీదనే ధ్యాస పెడతారు. మిగిలిన పదార్ధాలు శూన్యములే వారి దృష్టిలో.  అనగాదృష్టి ఏకాగ్రం  అయినప్పుడు ఇతరములేవీ గోచరము గాక, లక్ష్యమొక్కటే కనబడుతూ వుంటుంది. 


మనం లక్ష్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ద్రోణాచార్యులు కురు పాండవులకు అస్త్ర విద్యనేర్పే సమయంలో,  చెట్టు మీద పక్షికంటిని లక్ష్యంగా చూడడం గురించి చదువుకున్నాము కదా !  బుద్ధి కుశలుడైన అర్జునుడొక్కడే చెప్పాడు, తనకు పక్షి కన్ను తప్ప మరేదీ కనబడడం లేదని.    ఆ సమయమున అర్జునునికి అన్యమైనవన్నీ శూన్యంగా కనిపించిన విషయం లక్ష్యసాధనకు దోహదం చేసింది.


కాబట్టి, సర్వమునకు మూలమైన ఆత్మ వస్తువునందు ఎవరు ఏకాగ్రమైన దృష్టి వుంచుతారో,  వారికీ అన్య విషయాలు సర్వమూ శూన్యంగా అనిపించి,  ఆత్మ ఒక్కటే మస్తిష్కంలో ప్రకాశిస్తూ వుంటుంది.

శ్లో.  నైవ శూన్యం నచాశూన్యమశూన్యం శూన్యమేవచ
      పక్షపాత వినిర్ముక్తమాత్మనమ్ పర్యుపాసయేత్  //  31 .  

ఆత్మ శూన్యం కాదు. అలా అని దేనితో నిండి వుండలేదు. దానిని శూన్యము అనవచ్చును, అశూన్యమనవచ్చును.  కాబట్టి ఇది ఏ వర్గములోనికీ చేరనిది  అగుట వలన,  పక్షపాత వినిర్ముక్తమైన ఆత్మగా ఉపాసించవలెను.


వివరణము :    ధనం ఉండవలసిన పెట్టెలో ధనం  లేకపోతే,  ఆ పెట్టె శూన్యముగా వున్నది అని అనవచ్చును.  కానీ ఆత్మ ఆ విధంగా ఎప్పుడూ లేని వస్తువు కాదు.   అది ' నేను ' అని ప్రతివారిలో  ఎల్లవేళలా స్ఫురిస్తూనే వుంటుంది.  కాబట్టి ఆత్మ శూన్యమెలా అవుతుంది ?


ధనం వుంచే పెట్టె శూన్యంగా ఉండకూడదని ఆ పెట్టెలో కొంత ధనం వుంచుతాము.   అప్పుడు ఆపెట్టే శూన్యంగా లేదు కదా ! అనగా అశూన్యం అన్నమాట !   అలాగే తిలకము పెట్టుకోకపోతే, ముఖం శూన్యం.  తిలకధారణ తరువాత అశూన్యం.  అయితే, ఆత్మ అశూన్యం అవ్వాలంటే, వేరొక పదార్ధము వచ్చి చేరనక్కరలేదు.  మరి యొక్క పదార్ధము యొక్క సంయోగము అవసరం లేదు.   ఆత్మ సహజంగా పూర్ణము.   దానికి వెలితి వుండడానికి  ఆస్కారం లేదు. 


ఆత్మయందు జగత్తు నామరూపాలతో ద్యోతకం అవుతున్నది.   నామరూపాలు వదిలి కేవలం  ఆత్మ స్వరూపాన్నే చూస్తున్న జ్ఞానికి అది నిర్వికారంగా, అఖండంగా, శూన్యంగా అనిపిస్తుంది.


ఏదైనా ఒక విషయాన్నీ ఆశించి, రెండు వర్గాలు  ( పక్షాలు ) పోట్లాడుకుంటుంటే, అప్పటివరకు తటస్థంగా వున్న వ్యక్తి ఏ కారణం చేతనైనా ఒక వర్గములో చేరిపోతే, వాడు పక్షపాత దృష్టితో అలా చేరాడని అంటారు.  పక్షము అనగా వర్గము.  పాతము  అనగా అనూహ్యంగా పడడడం. ఆత్మకు అలాంటి పక్షపాత వైఖరి వుండదు. రెండుపక్షములలో దేనియందూ చేరదు.  ఎందుకంటే, అది శూన్యమూ కాదు, అశూన్యమూ కాదు.   ఆత్మ పక్షపాతానికి అతీతము. 


శ్లో.  నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం /
      నిరంజనం గుణాతీతమాత్మానం పర్యుపాసయేత్ //  32  .

ఆత్మను నిరామయంగా,  ఏ ఆధారం మీద నిలబడి లేనిదానినిగా,  రంగూరూపు లేనిదిగా, ఉదాసీనంగా, గుణాతీతమైనదానిగా భావించి ఉపాసించ వలెను.


శ్లో.  నిరాశ్రయం నిరాలమ్బమప్రమేయ మనౌపమం /
      స్వభావ విమలం

నిత్యమాత్మానం పర్యుపాసయేత్ /  33 

ఆత్మను, ఏఆశ్రయము కోరని దానిగా, ఏ ఆధారమూ అవసరం లేనిదిగా,  లెక్కకు అందని దానినిగా,  ఉపమానం  చెప్పవీలుకాని దానినిగా, స్వచ్ఛమైన శాశ్వతమైన దానినిగా భావించి ఉపాసన చేయాలి.

🕉🌞🌏🌙🌟🚩
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
🕉🌞🌎🌙🌟🚩
                      భక్తురాలు :
   స్వామి ! చెడుగుణాలు పోగొట్టుకోటానికి తగిన సాధనను తెలిపే గురువును వెదకాలి కదా ముందు ?

                         మహర్షి :
    చెడుగుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే, గు
రువు దొరకడం ఏమి ? పోగొట్టుకోవాలి అనే జిజ్ఞాస కలగాలి ముందు మనకు.
   
                         కలిగితే,
                   
      గురువు వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు. కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మనల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడు, గురువును మనకు చూపుతాడు.

      తన బిడ్డ క్షేమం తండ్రి కంటే విచారించేవారు ఎవరు? ఆయన ( ఈశ్వరుడు , గురువు ) సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు.


 పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు. అయితే, మనం హృదయపూర్వకంగా నమ్మాలి.

🕉🌞🌎🌙🌟🚩

ఓం నమః శివాయ:
12.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. అద్వైతభావనాయుక్త స్సర్వ త్రాత్మని సంస్థిత : /
సర్వగం సర్వ దేహస్తం పశ్య తత్ర నాసంశయ : // 15
ఏవమేకాత్మభావేన సంస్థితస్య తు యోగిన : /
సర్వజ్ఞత్వం ప్రవర్తేత వికల్ప రహితస్య చ // 16 .
శ్లో. యో>సౌ సర్వేషు శాస్త్రేషు పఠ్యతే హ్యాజ్ ఈశ్వర : /
అకాయో నిర్గుణో హ్యాత్మా సో>హ మస్మి న సంశయ : // 17 .
శ్లో. అవిజ్ఞత: పశు స్సోహి సృష్టిధర్మ సమాశ్రిత : /
విజ్ఞాత శ్శాశ్వత శుద్ద స్స శివో నాత్ర సంశయ : // 18 .
శ్లో. తస్మాదాత్మా సదా వేద్య స్సువిచార్య విచక్షణై : /
పరాపర విభాగేన స్థూలసూక్ష్మ విభాగశ : // 19
పర : పరమనిర్వాణ స్త్వపర స్స్రుష్టి భేదత : /
స్థూలో మంత్రమయ : ప్రోక్తా సూక్ష్మో ధ్యానై కసంస్థిత : // 20 .
శ్లో. అధవా బహుశో>నేన కి ముక్తేన షడానన /
వాగ్వికల్ప విశేషేణ మనస్సమ్మోహకారిణా // 21 .
శ్లో. ధర్మాస్సంత్యాత్మన స్సర్వే య దేవ పరికల్పయేత్ /
తత్తద్భవత్య సందేహా త్సదా తద్భావ భావిత : // 22
శ్లో. ఇత్యేవమాత్మ విజ్ఞానం కథితం తు సమాసత : /
జ్ఞాత్వైవాత్మమయం సర్వమాత్మానం పర్యుపాసతే // 23
శ్లో. న తత్ర దేవా వేదా వా యజ్ఞా వా బహుదక్షిణా : /
ఆశ్రయేదాత్మ విజ్ఞానం విమలం సర్వతోముఖం // 24 .

శ్లో. సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్ /
నాన్య శ్శరణద : కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్ // 25 .

ఆత్మానం పరమో భూత్వా యో విజానాతి తత్త్వత : /
స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ // 26 .

సంసారమునుండి బయట పడాలని అనుకునేవారికి ఆత్మజ్ఞానము కన్నా శరణ్యము లేదు అని చెబుతున్నారు.


సంసారం అనే సముద్రంలో మునుగుతూ, శరణు కోరుతున్న జీవులకు ఆత్మజ్ఞానము కన్నా శరణమును యిచ్చేదిలేదు. ఆత్మజ్ఞానమును పొందితే, ఎలాంటివాడైనా ఏ స్థితిలో వున్నా, సులభముగా సంసార సాగరాన్ని దాటగలడు.


ఎవరు పరమైన ఆత్మ గురించి, వున్నది వున్నట్లుగా తెలుసుకుంటున్నాడో,  వాడు సకలములైన అవస్థలను అనుభవిస్తున్నా, అప్రయత్నంగా ముక్తిని పొందగలడు.


వివరణము :   పరముడు అనగా ఉత్తముడు అని అర్ధం.   కర్మ, భక్తి,,  యోగ సాధనలలో అన్నింటిలో కంటే, ఆత్మజ్ఞానమే శ్రేష్టమని ఎవడు నమ్ముతాడో వాడే పరముడు.


ఆత్మ గురించి చక్కగా తెలుసుకున్నంత మాత్రాన,  ప్రారబ్ధమును తప్పించుకోగలమని చెప్పలేము.  ప్రారబ్ధము ను అనుసరించి,  ధనము, దరిద్రము, ఆరోగ్యము, రోగము, యౌవనము,  ముసలితనము, మొదలైనవి సంప్రాప్తిస్తూనే వుంటాయి.  ఇలాంటి సుఖములు, బాధలు ఎన్ని వచ్చినా ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు పొంగిపోడు, బెదిరిపోడు.  అవి శరీరానికే గానీ, తనకు కాదని వాటితో తనకు సంబంధము లేదని ఆనందరూపుడుగా వుంటాడు.   అప్రయత్నంగానే సుఖంగా వుంటాడు.  అదే ఆత్మజ్ఞానికీ, ఇతరులకూ  తేడా.

మనము అనేకమంది భాగవతోత్తములను,  ఆత్మజ్ఞానులను చూస్తూ వుంటాము.  శారీరిక బాధలు అనుభవిస్తూ, గృహంలో ఆర్ధిక బాధలు అనుభవిస్తూ కనబడతారు.  వారిని చూసి, ' ఆత్మజ్ఞానము కూటికా గుడ్డకా ? '   అని హేళన చేయరాదు.  మహాత్ములు  వాటికి పెద్ద ప్రాధాన్యం యివ్వరు.  లౌకిక జీవనంలో వారు ఇమడలేరు.  

సంఘంలో ధనవంతుడికి ఇచ్చే గౌరవం ఆత్మజ్ఞానికి యివ్వడం అలవడని చోట, వారు చెప్పే విషయాలు తృణీకరింపబడతాయి.  అందువలన ఆత్మజ్ఞానులకు ఏ నష్టమూ వుండదు.  అశాశ్వతములైన వాటిని శాశ్వతం గా భావించి, తరువాతి కాలంలో అవి అశాశ్వతాలని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికి, ఈ తత్త్వం బోధపడుతుంది.  అందువలన ఆత్మజ్ఞానులను తెలుసుకోవడం కష్టమైన ఈ తరుణంలో,  అలాంటివారు ఎప్పుడైనా తారసపడితే,  కించపరచ కూడదు.  వితండవాదం చేయకూడదు.    

శ్లో.  ఆత్మలాభాత్పరో లాభ : క్వచిదన్య న్న విద్యతే /
      తదాత్మాన ముపాసీత యో >య మాత్మా పరంతు స :  //  27 .

ఆత్మలాభమున కన్నా మించిన లాభము ఎక్కడాలేదు.  కాబట్టి ఆత్మనే ఉపాసించాలి. వేరొక మార్గం లేదు.  అయితే, ఆత్మ వేరుగా ఎక్కడోలేదు.   నీయందే,  ' నేను, నేను ' అని తోచుతున్న స్ఫురణే నీవు ఉపాసించదగిన ఆత్మ.  అదే పరమాత్మ. 

వివరణము :  ఆత్మజ్ఞానము పొందడమే ఆత్మలాభము.  ఆత్మ అంటే స్వ స్వరూపమే కదా !  వేరే ఎక్కడనుండి లభిస్తుంది ?  తనను తాను తెలుసుకోవడం అంటే ఏమిటి ?  ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే, , స్థూలంగా ఆలోచిస్తే, తెలుసుకోవలసినది, పొందవలసినదీ ప్రత్యేకంగా ఏమీలేదు. 


' నేను  ' అనే స్ఫురణను  నిద్రలో మరచిపోయినట్లు,  జాగ్రద్ అవస్థలో  మరచిపోయి, విషయరహితంగా వుండడం కుదరదు.  నిద్ర లేవగానే, ' నేను ఫలానా '  అనే స్ఫురణ వస్తుంది.  నేను ధనికుడను, బీదవాడను, భార్యాపుత్రులు కలవాడిని   '  అని మొదలైన అనేక విషయాలు జ్నప్తికి వచ్చి, లౌక కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాడు.   


అంతవరకూ నిద్రలో ఈ విషయాలు ఏమీ పట్టక సుఖంగా వున్న  ఈ ' నేను ' అనే స్ఫురణ  నిద్ర లేవగానే,  ఎన్నో విషయాలతో సతమతం అవుతూ వుంటుంది.


ఉదాహరణకు, కబాడీ ఆటలో కూతపెట్టి అవతల వర్గం వారిని బయటకు పంపే ప్రయత్నంలో,  వారికి చిక్కకుండా, తిరిగి తమ జట్టులోకి వచ్చినప్పుడు, ఆ జట్టులోని వారు యెంతో సంతోషిస్తారు.  అతడు తిరిగి రావడం గొప్పలాభంగా భావిస్తారు.  నిజానికి అతను ఎప్పుడూ వారి వర్గంలోని వాడే.


అలాగే,  విషయాలతో తాదాత్మ్యం చెందేవాడికి,  నిద్రలో లాగా, జాగ్రదవస్థలో కూడా విషయరహితంగా వుండడమే  ఆత్మలాభము.    నిద్రనుండి మేలుకున్నప్పుడు   జాగ్రద్ అవస్థలోనుండి నిద్రలోకి జారుకునేటప్పుడు, విషయరహితముగా రెండు మూడు లక్షణాలు ఉంటాయి.  మేలుకున్నప్పుడు  విషయముల లోనికి వెంటనే వెళ్లకుండా, జారకుండా,  అలాగే నిద్రలోకి జారుకునే ముందు ఆ తమస్సులోకి జారకుండా, కొంతమంది ఆ చైతన్య తత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు.  


మరి కొందరు సంకల్పములు బయటకు వచ్చినా,  '  ఈ ఆలోచనలు, సంకల్పములు ఇప్పుడు అవసరమా ?  ఇవి ఎవరికి కలుగుతున్నాయి. నేను ఎవరిని ?  నేను అనే స్ఫురణ ఎక్కడినుండి వస్తున్నది ? '  అని విచారణ చేసుకుంటూ, చిత్త నిరోధనం చేసుకుంటారు.   అప్పుడు విషయవాసనలు సోకకుండా,  నేను అనే సహజస్థితి హృదయం వద్ద నిలిచిపోతుంది.  అదే ఆత్మలాభము.


ఎవరు పగలంతా ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా,  సామ్రాజ్యాలు ఏలుతున్నా, ఏదో ఒక సమయానికి నిద్రలోకి జారక తప్పదు.   అంటే ఏమిటి అన్నమాట ! పగలంతా పొందిన అన్నిసుఖాలు, లాభాలకంటే, నిద్రాసుఖము యొక్క లాభము మిన్నదైనది అని అర్ధము.   నిద్ర అంటే, విషయరహితంగా తమస్సులో లీనమవడమే. 


కాబట్టి తాను విషయరహితంగా వుండడమే పరమసుఖం.  జాగ్రద్ అవస్థలో  కూడా నిర్విషయముగా వుండడమే ఆత్మ లాభం.  దానిని మిం
చిన లాభమేదీ వుండదు.


తరువాతి శ్లోకంలో ఆత్మను ఎలా తెలుసుకోవాలో  పరమేశ్వరుడు చెబుతున్నాడు.

శ్లో.  న ప్రాణో నైవ చాపానో విశిష్టకరణ స్తథా /
      సర్వజ్ఞమ్ తు త మాత్మానం పరిపూర్ణం సదా స్మరేత్  // 28

ప్రాణాపానములలోని పంచవాయువులైనా,  విశిష్టమైన కరణము (మనస్సు ) గానీ, ఆత్మకాదు.   ఆత్మను సర్వజ్ఞముగా పరిపూర్ణముగా ఎప్పుడూ స్మరిస్తూ వుండాలి.   🕉🌞🌏🌙🌟🚩

11.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.


శ్లో. అద్వైతభావనాయుక్త స్సర్వ త్రాత్మని సంస్థిత : /
సర్వగం సర్వ దేహస్తం పశ్య తత్ర నాసంశయ : // 15
ఏవమేకాత్మభావేన సంస్థితస్య తు యోగిన : /
సర్వజ్ఞత్వం ప్రవర్తేత వికల్ప రహితస్య చ // 16 .
శ్లో. యో>సౌ సర్వేషు శాస్త్రేషు పఠ్యతే హ్యాజ్ ఈశ్వర : /
అకాయో నిర్గుణో హ్యాత్మా సో>హ మస్మి న సంశయ : // 17 .
శ్లో. అవిజ్ఞత: పశు స్సోహి సృష్టిధర్మ సమాశ్రిత : /
విజ్ఞాత శ్శాశ్వత శుద్ద స్స శివో నాత్ర సంశయ : // 18 .
శ్లో. తస్మాదాత్మా సదా వేద్య స్సువిచార్య విచక్షణై : /
పరాపర విభాగేన స్థూలసూక్ష్మ విభాగశ : // 19
పర : పరమనిర్వాణ స్త్వపర స్స్రుష్టి భేదత : /
స్థూలో మంత్రమయ : ప్రోక్తా సూక్ష్మో ధ్యానై కసంస్థిత : // 20 .
శ్లో. అధవా బహుశో>నేన కి ముక్తేన షడానన /
వాగ్వికల్ప విశేషేణ మనస్సమ్మోహకారిణా // 21 .
శ్లో. ధర్మాస్సంత్యాత్మన స్సర్వే య దేవ పరికల్పయేత్ /
తత్తద్భవత్య సందేహా త్సదా తద్భావ భావిత : // 22

శ్లో. ఇత్యేవమాత్మ విజ్ఞానం కథితం తు సమాసత : /
     జ్ఞాత్వైవాత్మమయం సర్వమాత్మానం పర్యుపాసతే // 23

     న తత్ర దేవా వేదా వా యజ్ఞా వా బహుదక్షిణా : /
     ఆశ్రయేదాత్మ విజ్ఞానం విమలం సర్వతోముఖం // 24 .

సుబ్రహ్మణ్యా ! ఈవిధంగా ఆత్మజ్ఞానము నీకు సంగ్రహంగా చెప్పబడినది. విజ్ఞులు సర్వము ఆత్మమయమని తెలుసుకుని ఆత్మను ఉపాసిస్తూ మోక్షర్గంలో వుంటారు. అనగా తనకన్నా అన్యము లేదని తెలిసి మసలుతూ వుంటారు. అంటే, కనబడేదంతా, తమ స్వరూపమే అని తెలుసుకున్నారు అని భావం. అదే విజ్ఞానం. అదే ఆత్మోపాసన.

మోక్షసాధనలు చేసుకోవడానికి, దేవతలు, వేదములు లేక బహు దక్షిణలతో కూడి చేసిన యజ్ఞములు కానీ అక్కరకు రావు. మోక్షము కోసం నిర్మలమైన సర్వతోముఖమైన ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించాలి.


వివరణము :  వేదాలను అధ్యయనం చెయ్యడం, యజ్ఞాలు చెయ్యడం,  గొప్పవిషయాలు కదా !  వాటివలన యెందుకు మోక్షము రాదు. ?   దేవతలను ఉపాసిస్తే వారి అనుగ్రహం సంపాదిస్తే, వారు మోక్షాన్ని ఇవ్వలేరా ?   

దీనికి సమాధానం ఏమంటే,  వేదాధ్యయనము, యజ్ఞములు చెయ్యడమూ గొప్ప విషయములే.  అయితే, ఏ కోరికలూ  లేకుండా వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తిస్తే, అవి చిత్తశుద్ధిని కలిగించి, ఈశ్వరానుగ్రహంతో ఆత్మజ్ఞానము తెలుసుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపిస్తాయి.


' ఈశ్వరానుగ్రహా దేవా పుంసా మద్వైతవాసనా  '  ఈశ్వరానుగ్రహం వలననే మనుషులకు అద్వైత వాసనలు కలుగుతున్నవి.   అందువలన పైన చెప్పుకున్న క్రతువులు ఆత్మజిజ్ఞాస కలిగించునే కానీ, మోక్షమును ఇవ్వజాలవు.    శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి గొప్ప అనుగ్రహంతో,  ఆత్మ విజ్ణానం అంటే యేమిటో చెప్పాడు కానీ, మోక్షాన్ని సరాసరి యివ్వలేదు.


జన్మ పరంపరతో సాగే సంసారప్రవాహంలో,  వేదాధ్యయనము చేయుట, యజ్ఞములు చేయుట, దేవతలను ఉపాసించుట,  భవ సాగరాన్నిదాటించడానికి ఉపయోగపడే పడవల వంటివి.  వాటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు,  కొద్దికాలానికి ఆత్మజ్ఞానం అనే తీరం కనబడుతుంది.   అదే తుది మజిలీగా భావించి,  ఆ పడవ తీరమును చేరగానే, మనమే ఆ పడవలోనుండి దిగి,  తీరములో ప్రవేశించాలి.  ఇక పడవతో ఉపయోగం లేదు.


ఆత్మజిజ్ఞాస కలిగిన తరువాత, వేదములతో, యజ్ఞములతో, ఉపాసనలతో  పనిలేదు.  అప్పటికే గట్టుపైకి చేరినవారిని చూసి,  తానును వారివలే గట్టు ఎక్కుటకు ప్రయత్నించ వలెను.   అంతేగానీ, వెనుకకు తిరిగి పడవ వైపు చూసే ప్రయత్నం చెయ్య కూడదు.   అలా చూస్తే ఏమి ప్రయోజనము ?


కాబట్టి జిజ్ఞాసతో గురువు వలన ఆత్మ విజ్ఞాన ఉపదేశమును పొందిన వాడు,  ఆత్మ విజ్ఞానము ద్వారానే, చిత్తశుద్ధిని, వాసనాక్షయమును, ఏకాగ్రతను సాధించాలి.    గురూపదేశాన్ని మననం చేసుకుంటూ, ధ్యానించి తరించాలి. అంతేకాని, వెనుకకు తిరిగి మరల కర్మానుష్టాన ప్రక్రియలోనికి దిగకూడదు.   అయితే, ఆ ఆత్మవిజ్ఞానము విమలము, సర్వతోముఖము అయి ఉండవలెను.


కొందరికి, '  దేవతోపాసన లేకుండా, కేవలము ఆత్మజ్ఞానము వలననే మోక్షం కలుగుతుందా ? '  అనే శంక కలుగుతూ వుంటుంది.   వారికి ముక్తి అంటే, '  విశ్వరూప ప్రదర్శన వంటి మహిమలు చూపించడం, అందరూ తమను గుర్తించడము '  అనే ఆలోచన వుంటుంది.   అలాంటి మలములైన ఆలోచనలు లేనిది ఆత్మవిజ్ఞానము. అదే విమలము. 


సముద్రమునకు అన్నివైపులా ముఖాలే.  నది ఏవైపు నుంచి వచ్చినా సముద్రం తనలో ఇముడ్చుకుంటుంది.   అలాగే సకల విజ్ఞానములు, సాధనాలు, యోగములు, అన్నీ చివరకు ఆత్మ విజ్ఞానం లోనే లీనమవుతాయి.  కాబట్టి అది సర్వతోముఖము.    నది యెంత పెద్దది అయినా, సముద్రాన్ని మించి వుండదు కదా !   అలాగే, ఏ యోగమైనా, విజ్ఞానమైనా, ఆత్మవిజ్ఞానాన్ని మించి వుండదు.

శ్లో.  సంసారార్ణవ మజ్ఞానానాం భూతానాం శరణార్థినామ్  /
      నాన్య శ్శరణద :  కశ్చి దాత్మజ్ఞానా ధృతే క్వచిత్  //   25 .

      ఆత్మానం   పరమో భూత్వా యో విజానాతి తత్త్వత :  /
      స ముచ్యతే త్వయత్నేన సర్వావస్థా౦ గతో>ప్యసౌ  //   26 .

సంసారమునుండి బయట పడాలని అనుకునేవారికి ఆత్మజ్ఞానము కన్నా శరణ్యము లేదు అని చెబుతున్నారు.  


సంసారం అనే సముద్రంలో మునుగుతూ, శరణు కోరుతున్న జీవులకు ఆత్మజ్ఞానము కన్నా శరణమును యిచ్చేదిలేదు.  ఆత్మజ్ఞానమును పొందితే, ఎలాంటివాడైనా ఏ స్థితిలో వున్నా, సులభముగా సంసార సాగరాన్ని దాటగలడు.


ఎవరు పరమైన ఆత్మ గురించి, వున్నదివున్నట్లుగా తెలుసుకుంటున్నాడో,  వాడు సకలములైన  అవస్థలను అనుభవిస్తున్నా,  అప్రయత్నంగా ముక్తిని పొందగలడు.

🕉🌞🌏🌙🌟🚩

9 ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.


శ్లో. అద్వైతభావనాయుక్త స్సర్వ త్రాత్మని సంస్థిత : /
సర్వగం సర్వ దేహస్తం పశ్య తత్ర నాసంశయ : // 15
ఏవమేకాత్మభావేన సంస్థితస్య తు యోగిన : /
సర్వజ్ఞత్వం ప్రవర్తేత వికల్ప రహితస్య చ //

 16 .
శ్లో. యో>సౌ సర్వేషు శాస్త్రేషు పఠ్యతే హ్యాజ్ ఈశ్వర : /
అకాయో నిర్గుణో హ్యాత్మా సో>హ మస్మి న సంశయ : // 17 .

శ్లో. అవిజ్ఞత: పశు స్సోహి సృష్టిధర్మ సమాశ్రిత : /
విజ్ఞాత శ్శాశ్వత శుద్ద స్స శివో నాత్ర సంశయ : // 18 .
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో.  తస్మాదాత్మా సదా వేద్య  స్సువిచార్య  విచక్షణై  :   /
      పరాపర విభాగేన స్థూలసూక్ష్మ విభాగశ :  //

      పర : పరమనిర్వాణ స్త్వపర స్స్రుష్టి భేదత :  /
      స్థూలో మంత్రమయ : ప్రోక్తా సూక్ష్మో  ధ్యానై కసంస్థిత :  //  20 .

బుద్ధిమంతులు పరము, అపరము స్థూలము, సూక్ష్మము అనే విభాగాలను బాగుగా విచారించి, ఆత్మను ఎల్లప్పుడూ తెలుసుకుంటూ వుండవలెను.  


పరం  అనగా  దేని తరువాత దేనిపైన యింక యేదీ చూడాలేమో అదే పరము.   పరమ నిర్వాణము.   నిర్వాణమనగా ఆనందము.   సృష్టి భేదము వలన ప్రకృతి మాయ వలన ఏర్పడేది అపరము.    స్థూలంగా కనిపించే ఆత్మ మంత్రమయము.   ధ్యానంతో తాదత్మ్యత చెందితే అదే ఆత్మ సూక్షమంగా గోచరిస్తుంది. 


వివరణము :   గురువు నుండి ఉపదేశమును పొందిన తరువాత,  సందేహ రహితముగా ఆత్మసాక్షాత్కారం అనుభవాన్ని పొందేదాకా సాధకుడు,  నిర్విరామంగా ఆత్మను గూర్చి విచారణ చేస్తూ వుండాలి.     పిందెలోనే పండినట్లు గ్రంథ పఠన జ్ఞానంతో ఆత్మ అంటే తెలిసిపోయిందనే భావనలో వుండరాదు.  అందువలననే పెద్దలు,  ' నిద్ర వచ్చేదాకా,  పెను నిద్ర ( మరణము  )  ముంచుకు  వచ్చేదాకా కాలమును వేదాంత చింతనతోనే గడపాలని చెప్పిన  విషయం యెప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.  ' అసుప్తేరామృతే : కాలం నయే ద్వేదాంతచింతయా  '


నిర్వాణం అంటే ఆనందమని చెప్పుకున్నాము కదా !  పరమ నిర్వాణం అంటే శ్రేష్టమైన ఆనందం.  పరమానందమే పరమాత్మ.  లౌకిక జగత్తులోని వ్యవహారములకు అతీతంగా కేవలము ఆనందరూపంగా వుండే ఆత్మ పరము.    అయితే, పశువులు, మానవులు, దేవతలు మొదలైన సృష్టి భేదములతో కనిపించేవి  ఆత్మ యొక్క అపర విభాగము.


అన్ని బంగారు నగలలో వున్న బంగారము వలే,  ప్రతి జీవియందు స్థూల సూక్ష్మ కారణ   శరీరాలతో వ్యాపించి వారికి చైతన్యమును కలిగిస్తూ,  నిర్వికారంగా నిర్మలంగా వున్న ఆత్మయే ముక్తి  పొందినవాడికి పరాత్మగా  పరమానందం కలిగిస్తున్నది.


సంసారంలో అనురక్తితో ప్రవర్తించే జీవాత్మ స్థూలము.  ఇది  మంత్రమయము.  జీవుడు మాతృగర్భంలోనికి వచ్చినప్పటినుండి, జీవుని యొక్క సూక్ష్మ శరీరముమాత్రం మంత్ర సంస్కారములతో కంటికి కనబడకుండా రూపొందుతుంది.   మంత్రమనగా ఆలోచనకూడా మంత్రమే !   తనకు కావలసినవి పొందడానికి,  అక్కర లేనివి దూరంగా పెట్టడానికి సంసారంలో ఆసక్తి వున్న జీవుడు,  ఎప్ప్పుడూ ఆలోచిస్తూనే వుంటాడు.   కామక్రోధ లోభ మోహములతో ఎప్పుడూ సుఖమునో దుఃఖాన్నో అనుభవిస్తూ, వాసనామయ సూక్ష్మ శరీరాన్ని పెంచుకుంటూ,  వుండే సంసారి యొక్క జీవుని ఆత్మ స్థూలంగానే కనిపిస్తుంది. 


జ్ఞానాగ్ని చేత, కర్మవాసనలను దగ్ధం చేసుకున్న వాడు ఆత్మధ్యానమును పెంపొందించుకుని, సాధనచేస్తే  జీవుని యొక్క ఆత్మ సూక్ష్మం అవుతుంది. .    సాధారణంగా ధ్యానంలో ధ్యానించేవాడు, ధ్యానించబడు దేవత, ధ్యానము అనే మూడు అంశములు కనబడుతూ ఉంటాయి.   ఆ సమయంలో సకల దేవతలను, జగత్తును తన స్వరూపంగానే చూస్తూ నిశ్చలంగా వున్న జీవాత్మ సూక్ష్మము. 


శ్లో.  అధవా బహుశో>నేన  కి ముక్తేన షడానన  /
      వాగ్వికల్ప విశేషేణ మనస్సమ్మోహకారిణా   //  21  .

శ్లో.   ధర్మాస్సంత్యాత్మన స్సర్వే య దేవ పరికల్పయేత్  /
       తత్తద్భవత్య సందేహా త్సదా తద్భావ భావిత :   //   22

షడాననా ( సుబ్రహ్మణ్యా )  !   మనస్సునకు సమ్మోహనము కలిగించే  వాక్చాతుర్య విశేషణములతో  అనేక విధాలుగా ఆత్మను గురించి చెబితే ఏ
మి ప్రయోజనము ?   అనగా నిష్ప్రయోజనము అని  అర్ధం.


ఆత్మకు అన్ని ధర్మాలూ వున్నాయి.   అయితే, ఎవడు ఏ ధర్మమును అనేకవిధాల తన ఊహకు తగినట్లు కల్పించుకుంటున్నాడో, వాడు యెప్పుడూ ఆభావముతోనే వుండి, అస్థిర చిత్తుడై, నిస్సందేహంగా  అందులోనే సంచరిస్తూ వుంటాడు. 

ఈ శ్లోకముల వివరణ రేపు తెలుసుకుందాం.        

***
ఓం నమః శివాయ:
8.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.
ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది. దీనిని 1933 లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.
దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.


శ్లో. అద్వైతభావనాయుక్త స్సర్వ త్రాత్మని సంస్థిత : /
సర్వగం సర్వ దేహస్తం పశ్య తత్ర నాసంశయ : // 15

ఏవమేకాత్మభావేన సంస్థితస్య తు యోగిన : /
సర్వజ్ఞత్వం ప్రవర్తేత వికల్ప రహితస్య చ // 16 .
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో. యో>సౌ సర్వేషు శాస్త్రేషు పఠ్యతే హ్యాజ్ ఈశ్వర :  /
      అకాయో  నిర్గుణో హ్యాత్మా సో>హ మస్మి న సంశయ :   //  17  .

అజుడు ఈశ్వరుడు శరీరము లేనివాడు, నిర్గుణుడు  అని ఏ ఆత్మ సర్వశాస్త్రముల౦దు చెప్పబడుతున్నదో,  ఆతడే నేను.  ఆ ఆత్మనే నేను.  అందుకు సందేహం లేదు.


వివరణము :    ఏ శిశువైనా, తమకు జన్మనిచ్చిన తలిదండ్రులను  వారి నడవడి వలన, పెద్దవాళ్ళు చెప్పిన దానివలన తప్ప, స్వంతబుద్ధితో  గుర్తించలేదో,   అలాగే మానవులు కూడా తమ ఉపాధికీ, సకలజగత్తుకు కారణమైన పరమాత్మను,  శాస్త్రముల వలన అపౌరుషేయములైన వేదవాక్కుల వలన తప్ప,  స్వంతబుద్ధితో గ్రహించలేరు.


అయితే కొందరు జ్ఞానసిద్ధులుగా పుడతారు.  వారికి గురువుయొక్క వుపదేశము అక్కరలేదు.  వారు వ్రేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వుంటారు కాబట్టి, వారి గురించి విశ్లేషించనక్కర లేదు.    భగవంతుడైన వేదవ్యాసుడు పుట్టుకతోనే సకల వేదాలను పుక్కిటబట్టి, జన్మించారు.  పుట్టినవెంటనే యౌవనం తో తపస్సు చెయ్యడం ఆరంభించారు.   అలాంటివారికి గురువు యొక్క  ఉపదేశము ఈ జన్మలో లేకపోయినా పూర్వజన్మలో వున్నదని గ్రహించాలి.


ఎవరు ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారమును పొందినా,  వారికి ఈ జన్మలోనో  వెనుకటి జన్మలోనో వేదాంత ఉపదేశము జరిగినదని గుర్తించాలి.  '  ప్రతివ్యక్తికీ  ఆత్మ వున్నదని తెలుసు.  అయినా దానిని గుర్తించలేని స్థితిలో వుంటాడు.  ఉపనిషద్ మహావాక్యాలు విన్న తరువాతనే  మానవుడు ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేస్తాడు. '    ఇది  ఉపనిషద్ వాక్య సంగ్రహము.    ఆ సారము తెలుసుకున్నవాడు, తన స్వంత అనుభవంతో,  ఆత్మయొక్క ఉనికిని, అదే తాను అనీ  తెలుసుకుంటాడు. 


ఎవరికి పుట్టుక లేదో వాడు అజుడు.   ఇంతకూ ముందు లేకుండా ఇప్పుడు కలగడమే, పుట్టడము.  బిడ్డపుట్టినా, ఆలోచన పుట్టినా,  సంపదలు కలిగినా, ఇంతకూ ముందు లేనివి  కలగడం అన్నమాట !    కాల పరిచ్ఛిన్నము లేనివాడు పరమాత్మ.   ఆయన ఎప్పుడూ వుండేవాడు కాబట్టి పుట్టడం అంటూ జరగదు.  కాబట్టి పరమాత్మ  అజుడు. 


ఇక ఈశ్వర తత్వము అంటే, నియమించే సత్తా ఉండడం.  సూర్య చంద్రులను, అగ్ని, వాయువు మొదలైన దేవతలను  తన ఛైతన్యంతో నడిపిస్తూ, వారు తమ తమ విధులను సమయ పాలనతో, వారి లక్షణములు గుర్తెరిగి, చేసుకునేటట్లు చేయడమే పరమాత్మ పరిపాలన.  అందువలననే అతడే ఈశ్వరుడు. 


శరీరము లేనివాడు అకాయుడు.  దేవతల, మానవుల మొదలైన అన్ని చైతన్యాలలో   పరమాత్మ వున్నాడు కనుక, పరమాత్మకు ప్రత్యేక శరీరం వుండదు.   సకలజీవులందు స్థూల సూక్ష్మ కారణ శరీరములు గతించినా,  మిగిలేది పరమాత్మ తత్వము.  కాబట్టి పరమాత్మ అకాయుడు.


గుణములు లేనివాడు నిర్గుణుడు.  స్థూల దేహ సౌందర్యమైనా, సూక్ష్మదేహము యొక్క శౌర్యధైర్యాది గుణములైనా,  జ్ఞానాజ్ఞాములనే కారణ శరీర విషయాలైనా ఈ గుణములు అకాయుడికి వుండవు.   కాబట్టి పరమాత్మ నిర్గుణుడు. 


శ్లో.     అవిజ్ఞత: పశు స్సోహి సృష్టిధర్మ సమాశ్రిత :  / 
          విజ్ఞాత శ్శాశ్వత శుద్ద  స్స శివో నాత్ర సంశయ :  //  18  .

అద్వైత జ్ఞానము లేనివాడు సృష్టి ధర్మమును ఆశ్రయించి పశువు అవుతున్నాడు.   ఆ జ్ఞానము కలవాడు  శాశ్వతుడు, శుద్ధుడు, శివుడు అవుతున్నాడు.   ఇందుకు సందేహము లేదు. 


వివరణము :  సృష్టిని కొనసాగించే ధర్మాలు సృష్టి ధర్మాలు.   ఆహారమును భుజించుట, నిద్రించుట, సంతానమును పొందుట, సృష్టిలో అన్నిప్రాణులకు సహజధర్మాలు.   ఈ ధర్మాలు వారికి అనుకూలంగా జరుగుతున్నప్పుడు సుఖ సంతోషాలు, ప్రతికూలించి నప్పుడు భయద్వేషాలు కలగడం కూడా సహజమే.    ఈవిషయంలో,  మనుషులకు, జంతువులకు ఎక్కువ తేడాలేదు.


పశువు పచ్చిగడ్డిని చూపిస్తే పరిగెత్తుకు వస్తుంది.  కర్రను చూపిస్తే పారిపోతుంది.  అలాగే   అనేక శాస్త్ర విద్వాంసులు కూడా భోగములు కనబడితే అటువైపు పరిగెడతారు.  అక్కడ ప్రమాదం వున్నదని తెలిసినంతనే పారిపోతారు, భయంతో. 


మరికొందరు,  దేవతలను పూజిస్తారు.  పూజలో లోపంవస్తే ఆ దేవుడు /  దేవత ఆగ్రహిస్తారేమో  అని భయంతో  ప్రవర్తిస్తూ వుంటారు.   పశువులను బెత్తంతో బెదిరిస్తూ, పనులకు ఉపయోగించుకుని, మనము వాటికీ గడ్డి ఎలా వేస్తున్నామో, అలాగే, దేవతలు మన పూజలు, సేవలూ పొందుతూ,  మన కోరికలు తీరుస్తున్నారు.    ఇలా ఇతరులను ఆశ్రయించి పొందే సుఖము భయహేతువు కూడా అవుతూ వుంటుంది.


అలాకాకుండా,  ' సకల దేవతలకు స్వరూపమైన ఆత్మయే నా స్వరూపముగా వున్నది.   అదే సుఖదుఃఖములకు మూలమైన ఆనందము. ' అని ఎవడు ఆత్మ సాక్షాత్కారం పొంది ఆనందించ కలుగుతున్నాడో, వాడే జ్ఞాని.   అతడు  ఏవిధమైన దేవతలను ఆశ్రయింపడు.  వాడి సుఖము గురించి వాడికి భయం వుండదు.


అలంటి జ్ఞానీ, సృష్
టి ధర్మములకు అతీతుడు  అవడం వలన వాడికి జనన మరణములు వుండవు.   కాబట్టి అతడు శాశ్వతుడు.  స్థూల సూక్ష్మ కారణ శరీరముల దోషములు ఏవీ అతడికి అంటవు.   అందువలన అతడు శుద్ధుడు.  


సకల మంగళస్వరూపమైన ఆనందమే వాడి స్వరూపం అవడం వలన,  జ్ఞాని శివుడే అవుతున్నాడు.

***

6.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.


ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది.

దీనిలోమొత్తము 62 శ్లోకాలు వున్నాయి.

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.


శ్లో. ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ /
ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య తు నిష్కళం // 1 .
శ్లో. యేన విజ్ఞాయతే సమ్యగ్యం జ్ఞాత్వా తు శివోభవేత్ /
స కస్య చిన్మయాఖ్యాతం తద్విజ్ఞానం శృణుష్వ మే // 2
శ్లో. గురుపరంపరాయాత మదృష్టం సర్వవాదిభిః : /
భవబంధ విమోక్షార్థం పరమం సర్వతోముఖం // 3
శ్లో. యో>సౌ సర్వగతో దేవా : సర్వాత్మా సర్వతోముఖ : /
సర్వతత్వమయో>చింత్య : సర్వస్యోపరి సంస్థిత : // 4
సర్వతత్వవ్యతీత శ్చ వాగ్మనోనామావర్జిత : /
సో>హ మేవ ముపాసీత నిర్వికల్పేన చేతసా // 5
శ్లో. య దేవ నిష్కళం జ్ఞానం శాశ్వతం ధ్రువ మవ్యయం /
నిర్వికల్ప మనిర్దేశ్యం హేతు దృష్టాంత వర్జితం // 6
అలింగమక్షరం శాంతం విషయాతీత గోచరం /
అవిభాస్య మ సందేహం త దహం నాత్ర సంశయ : // 7 .
ప్రకాశకులు భగవద్ గీతలో శ్లోకమును 8 వ శ్లోకముగా పొరబాటుగా చూపించడం జరిగింది. కాబట్టి 9 వ శ్లోకం చదువుకుందాం.
శ్లో. అహమేవ పరో దేవ స్సర్వమంత్రమయ శ్శివ : /
సర్వమంత్రవ్యతీత శ్చ సృష్టి సంహార వర్జిత : // 9
శ్లో. మయావ్యాప్తమిదం సర్వం దృశ్యాదృశ్యం చరాచరం /
అహమేవ జగన్నాదో మత్త స్సర్వం ప్రకాశతే // 10
( నిన్నటి దానికి కొనసాగింపు )

శ్లో. అనేకాకార సంభిన్నం విశ్వం భువన సంచయం  /
     శివాద్యవని పర్యంతం తత్సర్వం  మయి సంస్థితం //  11 . 

శివుని నుండి భూమివరకు అనేకములైన చరాచరములైన ఆకారాలతో అనేక లోకముల సముదాయముగా విశ్వం  అంతా నాయందు వున్నది.  

శ్లో. యచ్చ కిఞ్చిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతే>పి  వా  /
     బహిరంతర్విభాగేన వ్యాప్తిన్ తత్సకలం మయా  //  12  .

జగత్తులో వెలుపల, లోపల అనే విభాగాలలో ఏమి కనిపించినా  అది అంట నాచేతనే వ్యాపించబడి వున్నవి.


వివరణము :    స్వప్నంలో ఏది కనిపించినా,వినిపించినా అది మనసు వలననే అని విచారణ చేసి వున్నాము కదా !   అదే విధంగా జాగ్రదావస్థలో కూడా  జగత్తులో వున్న అనేక బయటి విషయములను లోకములను,  మనము వేటిని చూస్తున్నా, వాటిని అన్నింటినీ మనసు ద్వారానే గ్రహించాలి.   మనము వాటిని మనసుతో గ్రహించి ఏ విధంగా అర్ధం చేసుకుంటే,  ఆ విధంగా అవి మనకు గోచరిస్తున్నాయి.


ఆ విధంగా మనము తెలుసుకునే   సకలమునందు  స్వప్నంలో లాగా మనసే వ్యాపించి వున్నది.   ఆమనస్సు మనయందే వున్నది.  కాబట్టి విశ్వమంతా మనలోనే  వున్నది.


శ్లో.  అహమాత్మా శివోహ్యన్య : పరమాత్మేతి య : స్మరన్   /
       మోహాదేవ ముపాస్తే స న శివత్వ మవాప్నుయాత్ //  13 .

       శివో>న్య స్త్వహ మే వాన్య : పృథగ్భావం వివర్జయేత్  /
       య శ్శివస్సోహమే వేతి హ్యద్వైత్వం భావయేట్ సదా //  14 . 


'  నేను ఆత్మను.  శివుడనగా నాకన్నా భిన్నుడైన పరమాత్మ  '  అని ఈవిధంగా అజ్ఞానము వలన భవిస్తూ,  ఎవడు దేవుడిని ఉపాసిస్తున్నాడో వాడు శివత్వమును పొందే అవకాశం లేదు. శివుడు వేరే, నేను వేరూ అనే భేదభావము విడిచిపెట్టాలి.   ' ఎవడు  శివుడో, ఆ శివుడను నేనే ! '  అని ఎల్లప్పుడూ అద్వైతమునే భావించాలి.


వివరణము :  నేను అల్పశక్తిగల జీవుడను.  పరమాత్మ అనంతశక్తి కలవాడు. ఆయనను ఆరాధిస్తే, సకల కోరికలూ నెరవేరతాయి. ' అనే భావనతో జనులు దేవతలను పూజిస్తారు.  అయితే, ఆ కోరికలకు మితం వుండదు. ఒకటి తీరిన తరువాత, మరియొకటి. పుడుతూనే వుంటుంది.    ఆ ఫలములను అనుభవిస్తూ వుండడం వలన కర్తృత్వ భోక్తృత్వ భావనలు పెరుగుతూ,  సంసార వాసనలు ప్రస్ఫుటమై, మరు జన్మకు ఆస్కారం కలుగుతుంది.


అందువలన ఆ విధమైన ఆరాధన వలన పరమాత్మ మానవుడిని ఎన్ని జన్మలు యెత్తినా ముక్తి మార్గం వైపు పంపే అవకాశము వుండదు.   ముక్తి  అంటేనే  శివత్వము.  కాబట్టి ముక్తి కోరుకునే వాడు,  పరమాత్మను తన స్వరూపంగానే భావించాలి.
****
 ఓం నమః శివాయ:
5.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.


ఈ ప్రకరణం అంతా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమశివుడు ఉపదేశిస్తూన్నట్టుగా ఉంటుంది.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో. ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ /
ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య తు నిష్కళం // 1 .
శ్లో. యేన విజ్ఞాయతే సమ్యగ్యం జ్ఞాత్వా తు శివోభవేత్ /
స కస్య చిన్మయాఖ్యాతం తద్విజ్ఞానం శృణుష్వ మే // 2
శ్లో. గురుపరంపరాయాత మదృష్టం సర్వవాదిభిః : /
భవబంధ విమోక్షార్థం పరమం సర్వతోముఖం // 3
శ్లో. యో>సౌ సర్వగతో దేవా : సర్వాత్మా సర్వతోముఖ : /
సర్వతత్వమయో>చింత్య : సర్వస్యోపరి సంస్థిత : // 4
సర్వతత్వవ్యతీత శ్చ వాగ్మనోనామావర్జిత : /
సో>హ మేవ ముపాసీత నిర్వికల్పేన చేతసా // 5
( నిన్నటిదానికి కొనసాగింపు )

శ్లో. య దేవ నిష్కళం జ్ఞానం శాశ్వతం ధ్రువ మవ్యయం /
నిర్వికల్ప మనిర్దేశ్యం హేతు దృష్టాంత వర్జితం // 6

అలింగమక్షరం శాంతం విషయాతీత గోచరం /
అవిభాస్య మ సందేహం త దహం నాత్ర సంశయ : // 7 .

( నిన్నటి దానికి కొనసాగింపు )
ప్రకాశకులు భగవద్ గీతలో శ్లోకమును 8  వ శ్లోకముగా పొరబాటుగా చూపించడం జరిగింది.  కాబట్టి 9 వ శ్లోకం చదువుకుందాం.

శ్లో.  అహమేవ పరో దేవ స్సర్వమంత్రమయ శ్శివ :  /
       సర్వమంత్రవ్యతీత శ్చ సృష్టి సంహార వర్జిత :  //  9

సర్వమంత్ర మయుడు, సర్వమంతాలకు అతీతుడు,  సృష్టి సంహారములు  లేనివాడు అయిన శివుడిని నేనే.  


వివరణము :   మంత్రాలు అక్షరాలతో కూర్చబడినవి.  అక్షరాలు శబ్దముతో ఏర్పడినవి.  ఆ నాదము వలననే మనము మంత్రాలను స్వప్నంలో కూడా వినే అవకాశము కలుగుతున్నది.   మంత్రము మానసికంగా జపించేటప్పుడు స్వరమే కదా ఆలంబన.


నీటిలో అలలు పుట్టినట్లు,  శబ్దములో అక్షరాలు పుడుతున్నాయి.   ఆభరణాలు స్వర్ణమయం అయినట్లు, సర్వమంత్రములు నాదమయములే.   ఆ నాదము ఆత్మ చైతన్యమునుండే ఉద్భవిస్తుంది.  ఎందుకంటే ఆ చైతన్యమే లేకపోతే, వినేవాడేవారు ?   మంత్రము జపించేటప్పుడు, అక్షరాల శబ్దము యెక్కడ పుడుతున్నదో అది కనిబెట్టాలి. అక్కడికి మనసును తీసుకుపోతే, అది అప్రయత్నంగా ఆత్మలో లీనమై పోతుంది.   సర్వమంత్రమయ  నాదముల స్వరూపము అత్మయే.  కాబట్టి ఆత్మ స్వరూపుడైన పరమాత్మ సర్వమంత్ర మయుడు.


ఒక్కొక్క మంత్రము, అందులోని వర్ణాలకు అనుగుణంగా ఒక్కొక్క దేవతను సాక్షాత్కరింప జేసుకోటానికి ఉపయోగ పడుతుంది.   అదే ఆత్మను సాక్షాత్కరింప జేసుకోవాలంటే, ఏ మంత్రమూ ఉపయోగపడదు.  ఆత్మను సాక్షాత్కరించుకునే మంత్రములు యింతవరకు పుట్టలేదు.  అనగా ఏ మంత్రాలకూ ఆత్మ అందదు.   ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడు అన్నిమంత్రాలకు అతీతుడు.


మనం ఎన్నో పనులు చేస్తుంటాము. మనం చేస్తున్నామని తలుస్తూ వుంటాము.   గాఢనిద్రలో అలాంటి  ఆలోచనలు వుండవు.  అయినా మన ఉనికి వుంటున్నది.   అనగా ఏమిటి అర్ధం ?  ఉనికి మాత్రమే మన స్వరూపం. ఆలోచనలు మనస్సువి.   ఒక్కసారి గాఢనిద్ర నుండి మేల్కొనగానే మనస్సుతో పాటు అవి కూడా పైకి వస్తాయి.   మనస్సును సమాధిలో లీనం చెయ్యడం అలవాటు చేస్తే, మనస్సులోని ఆలోచనలు అణిగిపోతాయి.


ఆలోచనలు మనమే సృష్టించుకోగలము. లయము చేసుకోగలం, సాధనతో.   సృష్టికి కర్త బ్రహ్మ,  లయమునకు ఈశ్వరుడుగా గుర్తిస్తాము.   సమాధిస్థితిలో కర్తృత్వము వుండదు.   అంటే బ్రహ్మకు, మహేశ్వరుడికి మధ్యలో ఆత్మ అనుసంధానం.  కాబట్టి ఆత్మ స్వరూపుడనైన  పరమాత్మను నేనే అని తెలుస్తున్నది.


శ్లో.  మయావ్యాప్తమిదం సర్వం దృశ్యాదృశ్యం చరాచరం  /
      అహమేవ జగన్నాదో  మత్త స్సర్వం ప్రకాశతే //   10

దృశ్యముగా, అదృశ్యముగా,  కదులుతున్న,  కదలని వస్తువులుగా తోస్తున్న ఈ సర్వములో నేనే వ్యాపించి వున్నాను. నేనే జగన్నాధుడను. నా వలననే సర్వము, ప్రకాశించుచున్నది.


వివరణము :   ఈ కల్పనాలోకము దృశ్యము.  పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్నవి, స్వర్గాదిలోకములు అదృశ్యములు.  చైతన్యముతో చరిస్తున్న ప్రాణి
 సముదాయము చరములు. చెట్లు కొండలు మొదలైనవి అచరములు. 


ఇవి అన్నీ నానావిధ నామ రూపములతో మనకు కనబడుతున్నాయి.  అన్ని నామధేయాలతో వుండే ఆభరణాలలో,  ఒకే బంగారము ఎలా కనిపిస్తుందో,  అలాగే జగత్తు అంతా ఆత్మ వ్యాపించి వుండడం వలన, నా స్వరూపం కూడా ఆత్మ స్వరూపమే అని గ్రహించిన వాడిని అవడం వలననూ, నేనే అంతటా వ్యాపించి వున్నాను.   ఆ గ్రహణశక్తి  వచ్చే వరకు, దృశ్యాదృశ్యములు, చరాచరములు వేరు వేరుగానే మననుండి కనిపిస్తూ వుంటాయి. 


జగత్తుకు అధినాయకుడు జగన్నాధుడు.  మనకు స్వప్నంలో ఎన్ని దేశాలు కనిపించినా, ఎంతమంది ప్రజలు కనిపించినా,  వారందరూ మన మనస్సులోనుంచి పుట్టినవారే.   స్వప్నంలో మనస్సుకు భిన్నంగా ఎవరూలేరు.  అలాగే, జగత్తులో దృశ్యాదృశ్యములను, చరాచరములను మనస్సే గ్రహిస్తున్నది.  జగన్నాధుని గురించి కూడా తెలుసు కుంటున్నది.   అదే ఒకసారి మనస్సు లయించగానే,   మనస్సూ లేదు, జగన్నాధుడు లేడు.


కాబట్టి ఆత్మ చైతన్యముతో, ప్రసరిస్తున్న మనస్సు వలననే, సర్వమూ ప్రకాశిస్
తుంది.   ఆ మనస్సునందు గోచరించే జగన్నాధుడు, నాకంటే భిన్నుడు కాడు. నేనే జగన్నాధుడను.

🕉🌞🌏🌙🌟🚩

1.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో  ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము.   అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.  


ఈ ప్రకరణం అంతా,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి  పరమశివుడు ఉపదేశించినట్లు ఉంటుంది.  దీనిని 1933  లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమిళ పద్యాలలోనికి అనువదించారు.   తెలుగులో శ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మగారు  వ్రాసినారు. 


దీనిలోమొత్తము 62  శ్లోకాలు వున్నాయి.  శ్రద్ధగా, నిదానంగా రోజుకు కొంత మననం చేసుకుందాం.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

శ్లో.  ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ  /
      ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య  తు నిష్కళం //   1 .

గుహా  ( సుబ్రహ్మణ్యా ) ! సూక్ష్మమై అంతటా వ్యాపించివున్న ఆత్మ అగ్రాహ్యం. అనగా తెలుసుకోలేనిది.  అయినప్పటికీ, దానిని వున్నది ఉన్నట్లు గ్రహించడానికి నిష్కళమైన  ఇంకొక ఉపాయము చెబుతున్నాను.


వివరణము :  కుమారస్వామికి గుహుడు అనే పేరుకూడా వున్నది. గుహనమనగా రక్షించుట. గుహుడనగా రక్షించేవాడు.  జ్ఞానోపదేశం చేత సంసారభీతినుండి ముముక్షువులను రక్షించేవాడు అని కూడా గ్రహింపవచ్చును.  


అణుశక్తి కన్నా సూక్ష్మంగా ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది.  దానిని ఇంద్రియముల చేత, మనస్సు చేత గ్రహించుటకు వీలుకాదు.   అందువలన అది అగ్రాహ్యము.  మరి ఏ ఉపాయంతో గ్రహించాలి ?   


బహిర్ముఖమై ప్రపంచములోని దృశ్యములను, విషయములను గ్రహించి ప్రవర్తించే ఇంద్రియాలకు, మనస్సుకు అది అగ్రాహ్యమే.  అదే మనస్సును ఇంద్రియములనుండి వెనుకకు మరల్చి శుద్ధమై ఏకాగ్రమై ఉంచితే,  అప్పుడు మనస్సు గ్రహించే స్థితిలో వుంటుంది. 



కళలు ప్రదర్శించనిది నిష్కళము.  కళ అనగా అంశము లేదా అంగము.    యోగసాధనలో యమము, నియమము మొదలైన అంశములు సాధనకు ఉపయోగ పడతాయి.  జపము, ధ్యానము, పూజ, సంకీర్తన మొదలైన అంగములు  భక్తి మార్గం లో ఉపయోగపడతాయి.   అయితే,   ఆత్మ గురించి తెలుసుకోవాలంటే, నిర్దిష్టమైన అంగములు అనగా కళలు ఏవీ లేవు.   అందుకాని ఈ ఉపాయము నిష్కళము.

🕉🌞🌎🌙🌟🚩

2.ఆత్మ సాక్షాత్కారం

శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.

1శ్లో. ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ /
ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య తు నిష్కళం //

( నిన్నటిదానికి   కొనసాగింపు )

శ్లో.  యేన విజ్ఞాయతే సమ్యగ్యం జ్ఞాత్వా తు శివోభవేత్  /
       స కస్య చిన్మయాఖ్యాతం తద్విజ్ఞానం శృణుష్వ  మే  //    2

       గురుపరంపరాయాత  మదృష్టం సర్వవాదిభిః :  /
       భవబంధ విమోక్షార్థం పరమం సర్వతోముఖం  //  3 

సుబ్రహ్మణ్యా !  ఏ విషయము వలన చక్కని జ్ఞానము కలుగుతున్నదో,   దేనిని తెలుసుకున్నవాడు శివుడే అవుతున్నాడో, ఆ విజ్ఞానాన్ని నేను ఇంతకుముందు ఎవరికీచెప్పలేదు.  దానిని తెలుసుకో !


దానిని వినడం వలన ప్రయోజనం ఏమిటి అంటావా !  భవబంధ మోక్షమే దాని ప్రయోజనం.   అదే పరమము.  సర్వతోముఖము.  అది గురుపరంపర ద్వారా  ఆర్జించేది.  శాస్త్రవాదములు చేయడం వలన కాదు. 


వివరణము :  జ్ఞానమును పొందినవాడు శివుడు అవుతున్నాడు అంటే, త్రినేత్రుడు అవుతున్నాడని కాదు.   శివమ్ అనగా మంగళం.   అదియే నిత్యసుఖమైన ఆనందం.  అనగా జ్ఞానమును పొందినవాడు, అమంగళమైన దుఃఖభాజనమైన సంసారమునుండి, బయటబడి, ఆనందంతో మంగళస్వరూపుడు అవుతున్నాడని  భావము. 


భవము అనగా జన్మించడం.   జన్మ మరణాల మధ్యలోనిది సంసార జీవితం.   అది పాశము లాగా జీవుని బంధించి వుంచుతుంది.    ఈ సంసారవాసనలు, మరణించిన తరువాత కూడా, మళ్ళీ జన్మకు కారణం అవుతాయి.  ఇలాంటి పాశము నుండి జీవునికి మోక్షము కలిగించడమే యిది తెలుసుకోవడం వలన ప్రయోజనం.  అంతే కానీ, యోగసిద్ధులు, వైకుంఠ ప్రాప్తి దీని ప్రయోజనం కాదు.


కర్మభక్తియోగములు జ్ఞాన ప్రాప్తికై ఉపకరిస్తాయి.  జ్ఞానము లేనిది మోక్షము కలుగదు.   అది కలిగించేది కనుకనే ఇది పరమము.   అలాగే ఈ జ్ఞానము సర్వతోముఖము.  దీని ద్వారములు అన్నివైపుల నుండి తెరుచుకుని వున్నాయి.  అందువలన, శరీర ధృఢత్వము లేని వారైనా సాధన సంపత్తి తో అధికారమును పొందిన తరువాత, ఈ సాధనలలో ప్రవేశించి కృతార్థులు అవవచ్చును.  స్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు ఎవరైనా జ్ఞాన సముపార్జనకు అర్హులే.   ఏ విధమైన ద్వారము ( భక్తి యోగ మార్గములు మొదలైన ద్వారములు ) నుండి అయినా ఈజ్ఞాన సంపాదనకు ప్రయత్నించవచ్చును.  కాబట్టి ఇది సర్వతో ముఖము.


ఐది గురుశిష్య పరంపరగా వచ్చే జ్ఞానము.  ఆకస్మికంగా పైనుండి వూడిపడేది కాదు.   సాక్షాత్తూ పరమశివుడే ఈ మాట చెప్పాడు.  ఇది కేవలము శాస్త్ర వాదములు చేసే వారికీ గోచరము కాదు. వేదముల ప్రామాణికత, గురువుల ఉపదేశము లేకుండా, స్వాంతబుద్ధితో   ఆలోచించి చేసే సిద్ధాంతానికి '  దర్శనము ' అని పేరు. బౌద్ధము, జైనము అలాంటివే !


కేవలము ఒకరి బుద్ధితో ఏర్పడిన సిద్ధాంతమును వేరొక బుద్ధిమంతుడు ఖండించవచ్చును. వాద ప్రతి వాదములు కొనసాగుతూ వుంటాయి.  అదే గురు పరంపరతో వచ్చిన జ్ఞానము విశ్వసనీయము.   అందుకని, కేవలం శాస్త్ర చర్చల ద్వారా వాదముల ద్వారా తత్వము గోచరము కాదు.


' ఇది సాంప్రదాయ సిద్ధము.  కాబట్టి విశ్వసించ తగినది. '  అని ప్రామాణ బుధ్హితో తెలుసుకున్నవాడు సంసారబంధమునుండి విముక్తుడు అవుతాడు.

🕉🌞🌏🌙🌟🚩

ఓం నమః శివాయ:
3.ఆత్మ సాక్షాత్కారం

ఆగమములలో సర్వజ్ఞానోత్తర ఆగమము సుప్రసిద్ధము. అందులో ఆత్మసాక్షాత్కారము ఒక ప్రకరణము. అద్వైత సిద్ధాంత ప్రమాణంగా దీనిలో ఆత్మజ్ఞానము ఉపదేశింప బడినది.


శివ ఉవాచ - ఈశ్వరుడు కుమారస్వామితో చెబుతున్నాడు.


శ్లో. ఆధాన్యం సంప్రవక్ష్యామి ఉపాయం తత్త్వతో గుహ /
ఆగ్రాహస్యాపి సూక్ష్మస్య సర్వగస్య తు నిష్కళం // 1 .

శ్లో.  యేన విజ్ఞాయతే సమ్యగ్యం జ్ఞాత్వా తు శివోభవేత్ /
       స కస్య చిన్మయాఖ్యాతం తద్విజ్ఞానం శృణుష్వ మే // 2

శ్లో. గురుపరంపరాయాత మదృష్టం సర్వవాదిభిః : /
     భవబంధ విమోక్షార్థం పరమం సర్వతోముఖం //  3


శ్లో.  యో>సౌ సర్వగతో దేవా : సర్వాత్మా సర్వతోముఖ  :   /
      సర్వతత్వమయో>చింత్య : సర్వస్యోపరి సంస్థిత :  //  4

      సర్వతత్వవ్యతీత శ్చ వాగ్మనోనామావర్జిత :  /
      సో>హ మేవ ముపాసీత నిర్వికల్పేన చేతసా  //  5

సర్వ విషయములను అధిగమించి వున్నవాడు, సర్వతోముఖుడు, సర్వతత్త్వమయుడు, సర్వతత్వములకు అతీతుడు కూడా.  వాక్కు ,  మనస్సు పేరు లేనివాడు,  కాబట్టి అచింత్యుడు.  ఈలక్షణాలన్నీ వున్న ఆ పరమాత్మనే నేను అనే సో>హం భావముతో ఉపాసన చేయాలి.

వివరణం. :  సో >హం అనే భావనే  ముక్తికి ముఖ్యమైన ఉపాయం. ' స:  అహం '  రెండూ కలిపితేనే సో>హం.   స : అనగా అతడు లేక పరమాత్మ.  అహం అంటే  నేను.   ప్రతివాడికీ నేను అనగానే, తన పేరు, శరీరము, మనస్సు, తన బుద్ధి గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ఇచ్చినవాడు గుర్తుకు రాడు.  నేను పరమాత్మను అని భావించే స్థితి రావాలంటే,  ఇప్పుడు నేను అనుకుంటున్నవి,  నా స్వరూపాలు కావని గుర్తెరగాలి. 


కాబట్టి సాధకుడు మొదటగా, 'నేను ఈ శరీరానికి, బుద్ధి, ఇంద్రియములకు పరిమితుడను కాను. '  అని తెలుసుకోవాలి.  ' నిద్రలో వీటి స్ఫురణ లేకపోయినా నేను వున్నాను కదా ! ' అనే భావన ఎప్పుడూ వుండాలి.   అందువలన నేను వీటికి అతీతుడను అనే భావన స్థిర పడుతుంది.

సరే !  నేను యివన్నీ కానప్పుడు నా అసలు స్వరూపం ఏమిటి ? అనే ప్రశ్న ఉదయిస్తుంది.    దానికి అన్ని ఉపనిషత్తులూ, ' నీవే పరమాత్మవు '  అని చెబుతున్నవి.  మరి అయితే ఆ పరమాత్మ స్వరూపం ఏమిటి ?   ఈ ప్రశ్నకు ఉపనిషత్తులు పరమాత్మ  సర్వగతుడు, సర్వాత్ముడు అని అనేక విశేషణాలతో పరమాత్మ స్వరూపం నిరూపించి చెబుతున్నాయి.

అన్ని బంగారునగలందు ఒకే బంగారం ఎలా వ్యాపించివున్నదో, అలా జగత్తు అంతా భగవంతుడు వ్యాపించి వున్నాడని తెలుసుకోవాలి.   పంచదారతో ఎలాంటి  అచ్చులు తీసి పంచదార చిలుకల వంటి వస్తువులు చేసినా,  స్థూలంగా విచారిస్తే, ఆ అన్ని మధుర పదార్ధాలు ముద్దచేస్తే, పంచదారే మిగులుతుంది.   అలాగే దేవుడు సర్వాత్ముడు.   సకల నామ రూపాలకు అతీతంగా, సువర్ణము,  పంచదార   వున్నట్లు  భగవంతుని కూడా సర్వాత్ముడు అని గ్రహించాలి. 

పురుషసూక్తంలో చెప్పినట్లు ఆ విరాట్ పురుషుని పాదములో  నాలుగవవంతు భాగమే ఈజగత్తు  సర్వ భూతములుగా ప్రకాశిస్తున్నది.   మిగిలిన మూడువంతులు దివిలో అమృతంగా  భాసిస్తున్నవి.    కాబట్టి పరమాత్మ సర్వానికి పైన ఉన్నాడనే  భావం స్థిరపడుతున్నది.

ఆయన సర్వతోముఖుడు.  ప్రహ్లాదుడు, '  ఇందు గలడందు లేడని సందేహము వలదు 'అని నిశ్చయంగా చెప్పగా,  భక్తునిమాటను మన్నించి పరమాత్మ, స్తంభంలో నుండి రాలేదా ?  అలాగే, ఆయనను సేవించడానికి అనేక దారులు.  ఆయనను దర్శించడానికి అనేక దారులు.  ఆయన సర్వతత్వమయుడు.  ఈ పాత్ర వెండిది అని చెప్పినప్పుడు, అందులో అంతా వెండిని దర్శించడం ఎలా జరుగుతుందో,  సకలతత్వములకు పరమాత్మే మూలము అని చెప్పినప్పుడు,  పరమాత్మ తప్ప వేరొక వస్తువు లేదని తెలుసుకోవాలి. 

ఆయన సర్వ తత్వములకూ అతీతుడు.  అనగా అన్ని పరిథితులను దాటుకుని, తట్టుకుని నిలిచినవాడు.  లోకాలకు అతీతుడై, లోకేశులు, లోకస్థులు దాటిన తరువాత పెనుజీకటి కవతల ఎవడు ఏకాకృతితో వెలుగుతూ  వుంటాడో వాడే పరమేశుడు.    పరమాత్మ.    అదేకదా గజేంద్రుని ప్రార్ధనలో మనము తెలుసుకున్నది.

ఆయనకు పేరు వాక్కు, మనస్సు లేదు.  భగవంతునికి ఆయన లీలలకు ప్రతీకలుగా కలిపించిన నామాలతో మనము ఆయనకు చేసే పూజలోనివే ఆ నామాలు.  ఆణామాలన్నీ  అయన లీలలు, స్వభావం తెలిపేవే ! ఆయన లీలలుమన కనులకు గట్టేవే !  తద్వారా ఏకాగ్రత పొందుతాం, ధ్యానంలో ఆ నామాలు పఠిస్తూ.

నా ఇల్లు అని చెప్పినపుడు ఇల్లు నేను కానట్లే,   నా వాక్కు, నామనస్సు  అని    చెప్పినప్పుడు ఈ వాక్కు నేనుకాదు.  ఈమనస్సు నేను కాదు.  


చింతనలులేనివాడు అచింత్యుడు.  అచింత్యుని ఉపాసించడం ఎలా ?   కేవలము గురూపదేశము వలననే వేదాంత విజ్ఞానము వలననే అది సాధ్యము.  ఆయనను నిశ్చలమైన నిర్వికల్పమైన మనస్సుతో ఉపాసించాలి.  సంకల్ప రహితమైన మనస్సు ఉండాలన్న మాట.  కేవలము ముక్తి సంపాదించవలెననే సంకల్పమే జ్ఞానము. అది ముక్తికి త్రోవ కలిపిస్తుంది.

ఉపాసన అనగా ' ఓంకారమే బ్రహ్మము '  అనే భావముతో స్థిర ఛితంతో, ఆ తరువాత  ఆదిత్యుని బ్రహ్మముగా భావిస్తూ, క్రమంగా సర్వాత్మకుడైన ఆ బ్రహ్మము నేనే అనే చోట ఉపాసన అంతం కావాలి.   త్రాడును త్రాడుగా చూపించి,  ఇది సర్పము కాదు అని చెప్పేదే ఉపాసన.   అదే జ్ఞానము.  ఆ జ్ఞానము కలుగగానే, సంసారభయము పోయి, మనస్సు నిలకడ పొందుతుంది.  

ప్రయత్నంతో చేసేది ఉపాసన.  ఏ ప్రయత్నం లేకుండా సహజంగా అభావన రావడమే జ్ఞానసిద్ధి.  అదే ముక్తి.
****

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ