ప్రాంజలి ప్రభ 1౦/౦4/2023
అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది. జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది! ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు . "నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ." "సత్యమేవ జయతే " ........ *చివరి వరకు ఎవరు పట్టుదలతో ఉంటారో వారే జయిస్తారు. *ప్రకృతి నుండి అన్నింటినీ పొందాలని అనుకుంటాం. కానీ ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి, పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది. భాగవతము శ్రీగురుభ్యోనమః "ఓం సత్యం పరం ధీమహి" అనునది నిజమైన గాయత్రి మంత్రం. పరమైనది, సత్యమైనది అను దానిని నేను ఆరాధన చేస్తున్నాను అని అర్ధము....