ప్రాంజలి ప్రభ ..09 /04*




న్యస్తాక్షరి.......


స్వ

ర్ణ 

కా

రు

లు

పద్య పాదాది న రావాలి

పంచపది లో పూరించండి.

♣️♣️♣️

స్వరము నిస్వరము కదిలె సమయ కల వ

ర్ణనను తెలుపగలరు విధాన కరుణ కథ

కాల మునుబట్టి సహనపు కలలు మన గు

రువులు భోధన తృప్తియు ఋణ సుగుణము

లు విధి తెలుపుట విద్యయే ముఖ్య మౌను

దత్తపది...........

గంగ   యమున  కృష్ణ  తుంగ

సీస పద్యము


కవులశ్వేచ్ఛ యనేది కావ్యపటిమబట్టి

హృదయమ్ము రంజింప హృద్య మేను

శాంతి ప్రశాంతిగా సామరస్యపు దృష్టి

మనుషుల రుగ్మత మాయ తెంచు

పలుకు గంగ ప్రవాహ ప్రగతి కోరి బతుకు

సందేశపు కథలు దేశ భక్తి

కాలనిర్ణయమును కలిసేటి జీవితం

కరుణ దయ హృదయ కావ్య జగతి


గంగ కదులుతూ దాహము గమ్య మగుట

యమున సహనముగా చేరి ఎల్లె కలిసె

కృష్ణ గోదావరి కలియు కృపతొ చూడు

తుంగ భద్ర ఉప్పొంగుట పుణ్య మగుట

....

🕉️🙏शुभोदयः।🙏🕉️


देयं भोज्यधनं सदा सुकृतिभिर्नो सञ्चितव्यं कदा

श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता ।

अस्माकं मधुदानभोगरहितं नष्टं चिरात् सञ्चितम्

निर्वाणादिति नैजपादयुगलं धर्षन्त्यहो मक्षिकाः ॥



దేయం భోజ్యధనం సదా సుకృతిభిర్నో సఞ్చితవ్యం కదా

శ్రీకర్ణస్య బలేశ్చ విక్రమపతేరద్యాపి కీర్తిః స్థితా‌।

అస్మాకం మధుదాన భోగరహితం నష్టౌ చిరాత్ ‌సఞ్చితమ్

నిర్వాణాదితి పాణిపాదయుగళం ధర్షన్త్యహో మక్షికాః॥


యోగ్యులు తమ అవసరాలకు మించి ఉన్నదంతా దానధర్మాలకు ఇవ్వాలి. దాతృత్వం ద్వారా నేటికీ కర్ణుడు, బలి మరియు రాజు విక్రమాదిత్య మాత్రమే జీవించి ఉన్నారు. తేనెటీగలు భూమిపై నిరాశతో కాళ్లను కొట్టుకునే దుస్థితిని చూడండి. వాళ్ళు తమలో తాము “అయ్యో! మేము నిల్వ చేసిన తేనెను ఆస్వాదించలేదు లేదా దాతృత్వానికి ఇవ్వలేదు మరియు ఇప్పుడు ఎవరైనా దానిని తక్షణం మా నుండి తీసేసుకుంటున్నారు. మేము ఎప్పుడూ నష్టపోతున్నాము" అని బాధపడుతున్నాయి. భావము - అవసరానికి సరిపడినంత మాత్రమే ఉంచుకొని మిగిలినది దానం చెయ్యాలి.

......

*ప్రాఃజలి ప్రభ


పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి
     *చిన్న సంఘటన*

పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.*
ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు.
 ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.

ఆయన  మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*

తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.
వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది
యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.
అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

 *ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు*

 ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు
భార్య వడ్డిస్తూ వుంది.

 *భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు*

 అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.

*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*

అప్పుడు *తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా  యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*

 అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

 *పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

 "పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు.

*ఇంత  చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

 *భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.*

 సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.
వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని
వాళ్ళు విసుక్కున్నారు.

 చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది.*

 భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు.

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను  మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*

 ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

*భార్యకు, అత్తామామలకూ  విషయం వివరించి నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*

 ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

 *భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.

*చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!*

 అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

 "తల్లిదండ్రులను ద్వేషించకండి!
అంతకంటే పాపం
ఇంకోటి వుండదు"🌞

🔯🔯🔯🔯🔯🔯
🤷‍♂🤷‍♂😊😊😔😔😊😊
భట్టాచార్య

   "కల్ప వృక్ష చక్రము" లేదా "హృత్ చక్రము"  8 దళముల కమలముగా ఉన్నది. ఉన్న స్థాయి కుండలినీ యోగులు, ఈ కల్పవృక్ష చక్రము పై ధ్యానము చేయుట ఉత్తమము. ఈ చక్రము, అనాహత చక్రానికి క్రిందుగా, 2 నుండి 4 అంగుళముల క్రింద కలదు.

    అనాహత చక్రానికి క్రింద "ఆనంద కందము" అనే కేంద్రము కలదు. ఇది ఆనందానికి కేంద్రము. పూర్వ ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని "కల్ప వృక్షము" (wish full filling tree) అనేవారు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని "చింతామణి" గా కూడా పిలిచేవారు. ఈ "చింతామణి" శబ్ద బ్రహ్మ తత్వాన్ని కలిగియుంటుంది.

శబ్ద బ్రహ్మం▶నాద బ్రహ్మం▶పరంబ్రహ్మ

ఈ చక్రం తెల్లని, బంగారు,ఎరుపు వర్ణాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ చక్ర జయం ద్వారా సాధకుడు తన కోరికలు తీర్చుకొనే శక్తిని సముపార్జిస్తాడు. ఈ చక్రానికి హృత్ పద్మము, హృత్ పుండరీకము, హృదయాంభోజము అనికూడా అంటారు.


🌹. ధ్రువతార - ధ్రువరేఖ - 2 🌹

ఇట్టి రేఖను మొట్టమొదటగా మన ఖగోళమునకు యజ్ఞవరాహమూర్తి తన కోరలతో నేర్పరచెను.

అటుపైన భూగోళము చుట్టును భూమధ్యరేఖను మనువేర్పరచెను.   ధ్రువుడు ధ్రువరేఖను ఏర్పరచెను.

వరాహమూర్తి యేర్పరచిన రేఖలను బట్టి గోళములకు స్థితి ఏర్పడెను.  మనువు గీచిన రేఖను‌ బట్టి జీవుల ధర్మము లేర్పడెను.  ధ్రువుని రేఖను బట్టి  అహోరాత్రాది పరిభ్రమణ మేర్పడెను.

ఇందు వరాహరేఖలు,  ధ్రువరేఖ సృష్టిని శాసించును.  మనురేఖ ధర్మమును శాసించును. అంతేగాక మానవులు స్వధర్మాచరణము రూపమున మనురేఖ ననుసరించి సుఖపడుచున్నారు.......

***
* కఠోపనిషత్తు

ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు. స్త్రీ పుత్ర ధనాదులు. ఏమండీ, ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలే ఎక్కువమంది వున్నారు. మీరు స్త్రీలని బహిరంగంగా చెప్తున్నారు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. ఇందాకే చెప్పాను. స్త్రీలంటే ప్రకృతీ స్వభావం కలిగినటువంటి, జీవస్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించేవారందరూ స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు. 

పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండీ అనుకోవనక్కర్లా. పున్నామనరకం ఎవరికైతే కలుగుతుందో, ఆ పునః నామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డవారందరూ కూడా మోహమును కలిగివున్నవారే. 

అందరూ మోక్షమునకు దూరమైనవారే. మోక్షం అంటే మోహక్షయం. విద్యారూపమగు శ్రేయోమార్గము చేత మోహము క్షయించిపోతుంది. ఆత్మజ్ఞానవిశేషంచేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం.

         ఆత్మవిశేషంచేత, ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి. అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. అదీ అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అదీ అవదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనం? నీలోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు.

 నీకు దేనియందైతే, జగత్తుయందున్నటువంటి వస్తు, మానవ, జీవ సంబంధాలు ఏవైతే వున్నాయో వాటన్నింటి యెడల మోహము క్షయించిపోయేట్లు చేస్తుంది. అదొక్కటే ఈ ఆత్మవిచారణ వలన ప్రయోజనం. విద్య - ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం, శ్రేయోమార్గము వల్ల ప్రయోజనం; ఏక ప్రయోజనం. ఏమిటంటే సత్య శాంత సమరస భావముచేత మోహక్షయం కలుగుతుంది. మోహము క్షయించి పోవడం ద్వారా నీవు ఉత్తమగతిని పొందుతావు. ఏమిటా ఉత్తమగతి అంటే? జననమరణ చక్రంలో పడకుండా వుంటావు.

 అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రేయోమార్గమును అనుసరించేటటువంటి వారు, తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో, అది మాత్రమే ఆశ్రయిస్తారు. శాశ్వత దుఃఖం ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేరు. గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారము వలన, అవిద్యాదోషము వలన, మోహప్రభావంవలన, తమను తామే గొప్పగా తలుస్తారు. 

అందుకని పెద్దలు ఎవరైనా గానీ వారి యొక్క జ్ఞానబలాన్ని తెలుసుకోవాలి అంటే, వారేం మాట్లాడుతున్నారో, వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుంది. ఎవరిమాటలలో అయితే ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ వుంటాయో ఇవి అవిద్యకి ప్రధమ ముఖం. అవిద్యా దోషమునకు ప్రధమ ముఖము ఏమిటంటే ఆత్మ స్తుతి, పరనింద. తననుతాను పొగుడుకోవడం. తననుతాను గొప్పగా చేసుకోవడం. తననుతాను అహంభావంతో వ్యక్తీకరించుకోవడం. తనను తాను అభిమానంతో చూచుకొనుట. తనను తాను గొప్పగా చేసి చెప్పుకొనుట. 

తన యొక్క విద్వాంస లక్షణాన్ని, తనయొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని, తన ఆజీవన పర్యంతము తాను చేసిన పరిశోధనా ఫలమును తాను గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువాటి వాటినన్నింటిని తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తనయొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును ఎప్పుడైతే బలపరచుకుంటాడో అప్పుడు ప్రేయోమార్గమైనటువంటి, అజ్ఞానాంధకారమైనటువంటి, అవిద్యారూపమైనటువంటి, బంధకారణమైనటువంటి, మోహరూపమైనటువంటి సంసారమునందు చిక్కుకున్నాడు.

         కాబట్టి ఇది ఎటువంటిదయ్యా. చాలామంది అట వీళ్ళనే గురువులుగా భావిస్తారు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో వారు గురువులు కారు. 

ఎవరైతే ఈ అవిద్యాబలముచేత శాస్త్రజ్ఞులుగా, విద్వాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలముచేత, త్రిగుణమాలిన్యముచేత కర్తవ్యకర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపచేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధగురువులుగా ఉన్నటువంటివారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధకారణములో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది.

 తప్పక మోహం బలపడే అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఏమైపోతావూ అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడట. అప్పుడేమయింది. ఏ రకమైనటువంటి విద్యని పొందగలుగుతావు. ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు అంటే అసాధ్యం.

 ఎందుకంటే గురువుగారికే ఆత్మానుభవంలేనప్పుడు  శిష్యులకి ఆ అత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి వుండదు. ఎప్పటికప్పుడు ఆత్మోపరతి దిశగా నడపవలసినటువంటి గురువుగారు వారిని జగద్ వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతారు. 

🕉🌞🌏🌙🌟🚩

 ధృవతార - ధ్రువరేఖ - 3 , 🌻. భాగవతము 4-291, ధ్రువోపాఖ్యానము 🌻

"మనువు నుండి రేఖగా వచ్చుచున్న మార్గము పరమముగా అంగీకరించి అటు నిటు దాటకుండ చక్రనేమి యందు దిలీపుని ప్రజలు వర్తించుచున్నారు " అని కాళిదాసు రఘువంశమున వర్ణించెను.  

వృత్తి ధర్మములు, వయో ధర్మములు, వర్ణ ధర్మములు సక్రమముగా పరిపాలింపబడుట చేత మానవులీ రేఖను తమ యందు స్పష్టపరచు కొనుచుందురు.  అపుడు దేవతలను గౌరవించుటయు,  దేవతలు జీవులకు సకాల వర్షమును సస్య గో క్షీరాది సంపదలను ప్రసాదించి గౌరవించుటయు జరుగును.

ఇట్లు పరస్పరము గౌరవించుటయే యజ్ఞమాచరించుట.  " ఈ యజ్ఞమార్గమున దేవతలను గౌరవించుట వలననే దేవతలు మిమ్ము గౌరవించు చున్నారు",  అని గీతలో కృష్ణుడు చెప్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
[03/04, 5:23 pm] Mallapragada Sridevi: భగవాన్‌ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం.
ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. ‘భగవాన్‌! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు.
‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు.
‘భగవాన్‌ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది.
‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే!
ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు
అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది.
ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు. ‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’’
[03/04, 5:30 pm] Mallapragada Sridevi: ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.

అప్పట్లో మనకు ఆదివారం సెలవు దినం కాదు .

నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది  -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు .

అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు.  

మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి"   అంటూ మన సూర్యాష్టకం లో ఉంది . మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే.
🙏🙏🙏🙏🙏




రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
=తన మెడలోని.                 ముత్యాలహారం. 


ఓం  శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

గురువుని ఆరాధించ వలసిన రోజు.
శ్రీ గురో పాహిమాం
శ్రీ గురో రక్షమాం.

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు.

శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి,

విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు.

వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే.

ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణామూర్తయేనమ:

అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.

దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.

ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.

ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.

దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది.

అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా….

శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.

సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి.

మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
శ్రీ గురో పాహిమాం...

గురువుల యొక్క ప్రాముఖ్యత

గురువులు ఎన్ని రకాలు ఉంటారు
గురువుల వలన మనకు ఏమిటి ఉపయోగం
మనం ఏ గురువుని ఎలా ఆశ్రయించాలి

1) సూచక గురువు:- బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.

2) వాచక గురువు:- ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థము , వానప్రస్దానం , సన్యాసం ) వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో నివసిస్తావు.

3) బోధక గురువు:- మహా మంత్రాలను ఉపదేశిస్తారు లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌఖిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని వీరిని భోధక గురువు అంటారు. లోకికం నుండి అలౌఖికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...

4) నిషిద్ద గురువులు:- మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది చిత్తాన్ని శుద్ధి చేయరు విత్తాన్ని హరిస్తారు. ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.)*

5) విహిత గురువు:- మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు పై ఆసక్తి తగ్గించి, సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేస్తాడు.( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణతో జీవిస్తావు....

6) కారణ గురువు:- ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు. ( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు.)

7) పరమ గురువు:- ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు. శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని "అహం బ్రహ్మస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు అవగహన కల్పించి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ "పరమ గురువులు". వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజజీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీజన్మల విడుదలకు మార్గం చూపేవారు ఈ "పరమగురువు"...

నమస్కారం

ఒక రోజు, మహాభారత యుద్ధ సమయంలో దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు

"నేను రేపు పాండవులను చంపుతాను"

అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది - భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు..
శ్రీ కృష్ణుడు ద్రౌపదితో ఇలా చెప్పాడు, ఇప్పుడు నాతో మీరు రండి, అంటూ, శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు - శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి

ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు, అతను - "అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించిన తర్వాత ద్రౌపదిని అడిగాడు !! "ఏంటమ్మా! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు అని, శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా" అన్నాడు

అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది - "అవును తాతయ్యా.! వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.

భీష్ముడు చెప్పాడు

" నా మాటలలోని ఒక పదాన్ని కత్తిరించే పనిని చేసిన శపథాన్ని నిర్వీర్యం చేయగల పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"

శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు

"మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"

"మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు - దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు" అంటే ......

ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం,
అహంకారం,ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం,నామాట వినాలనుకోవడం, చులకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు".

"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."

పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు

"అభ్యర్థన
ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నియమంగా పెట్టుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ప్రతీ ఇల్లు స్వర్గం అవుతుంది."

ఎందుకంటే

నమస్కారం ప్రేమ.
నమస్కారం క్రమశిక్షణ.
నమస్కారం చల్లదనం.

నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.

🔸నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.

🔸నమస్కారం సంస్కరించడం నేర్పుతుంది.

🔸 నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.

🔸 నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.

🔸 నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది.

నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి. అదే నీటి చుక్క ఆకు మీద పడితే, మెరిసి పోతుంది ఔనా !. నీటి చుక్క లాగ ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడిస్తుంది.దుష్ట సంస్కారాలు వదిలి మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది.
.
గొప్ప మనసు...

నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది.పని చురుకుగానే
సాగుతున్నది. ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే " పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు.మరేం ఫర్లేదు.పనికి ఇబ్బంది లేదు" అన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య .  పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను. వారం నుండి పని కోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు.పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.  అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా...నీ పనితనం తెలీకుండా..
పనిలో పెట్టుకొనేది లేదు. వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.

అతను నా వైపు జాలిగా చూస్తూ" ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయ
చూపండి"అని ప్రాధేయ పడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ..
కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!
ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను. మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం " అన్నాడు. అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు.మధ్య మధ్యలో అతని వంక చూసాను.కష్టపడి పని చేయడం గమనించాను." పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను.  మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.
రాజయ్య వంక చూసాను.ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.  మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు.రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని ఆకలి గుర్తించ గలిగాను కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంప లేకపోయాను. రాజయ్య మాత్రం మంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.
అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది.
సాయంత్రం అయింది. మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను.అతడు కూలీలకు పంచాడు.
రాజయ్య బయలు దేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి
నమస్కరించాడు." నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను.
" నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు.అతని కన్నుల్లోని అవేదన సరిగానే గుర్తించాను.
అతను బయలు దేరిపోయాడు.ఎందుకో తెలీదు...రాజయ్య  వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు.రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు. అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి. రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని
కేకేసి పిలిచాడు.నాకు విషయం అర్థం అయిపోయింది.ఈ పూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు
అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.
"ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది.అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద సదభిప్రాయం దూరం చేసింది. బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ" చాలా రుచిగా ఉంటాయి.మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు.

రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు ప్పదీయసాగాడు.పావురాలు అమ్మిన వ్యక్తి ,రాజయ్యను వారిస్తూ" ఈ పని ఇంటి దగ్గర చేయి.లేకపోతే ఎగిరి పోతాయి" అన్నాడు.
రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు.
స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.
ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి. రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా. " ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.
" డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది.రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ఆకలి...ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి
ఉందో బోధ పడింది. అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి..రాజయ్యతో " అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్ట కోటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!" అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.
రాజయ్య అతన్ని వారిస్తూ" డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు. కొంచెం సేపు అలానే ఉండిపోయాను.
తరువాత బైక్ స్టార్ట్ చేసి ..రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు" అన్నాను.
"వద్దు అయ్యగారూ!" అన్నాడు." మరేం ఫర్లేదు.నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.
ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్క డ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.
"అదేంటి అయ్యగారూ! మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య.  " డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు.
మనసున్న వాడు గొప్పొడు.ఆ మనసు నీకుంది.రేపు పనిలోకి వచ్చేయి!" అని
బైక్ స్టార్ట్ చేసాను.  బైక్ డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది. నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!.
.***

గర్వం (చిన్న కథ)

వంగదేశాన్ని సుశేనుడు అనే రాజు పాలించేవాడు.

అతనికి బలమైన సైన్యం ఉండేది. పక్కదేశాలపై దండెత్తాడు. ఆక్రమించాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ సామంత రాజ్యాలయ్యాయి.

ఐశ్వర్యంతో, అధికారంతో సృష్టిలో తనని మించినవాడు లేడని రాజు గర్వించాడు.

చుట్టూ కావలసినంత మంది భజనపరులు రాజుకు ఉంటారు. వారి పని రాజును కీర్తించడమే. ఒకడు ఇంద్రుడంటాడు, ఇంకొకడు చంద్రుడంటాడు. మరొకడు దాన కర్ణుడంటాడు. ఇట్లా ఎందరు ఎన్ని రకాలుగా కీర్తించినా ఇంకా ఏదో అసంతృప్తి రాజుకు మిగిలింది.

భజనలో ఆరితేరిన ఒకడు “రాజా! రాజమార్తాండా! నువ్వు సృష్టికర్త కన్నా గొప్పవాడవు. భగవంతుని కన్నా బలమైన వాడవు” అని పొగిడాడు.

అప్పటిదాకా విన్న పొగడ్తలకన్నా ఇది రాజుకు బాగానచ్చింది. భట్రాజును ఘనంగా సత్కరించాడు.

ప్రతిరోజూ భగవంతుడి కన్నా గొప్పవాడు ఈ రాజు అని అర్థం వచ్చే పాటలు, కవులు రాసినవి గాయకులు ఆలపించేవారు.

ఈ వార్త దేశమంతా వ్యాపించి అందరూ ముక్కుమీద వేలు వేసుకున్నారు.

ఆ మాటలు విన్న రాజగురువు రాజుగారి సభకు వచ్చి “రాజా! మీరు దేవుడికన్నా గొప్పవారు” అన్నారు.

రాజు “ఆ సంగతి మాకు తెలుసు, దాన్ని మించింది ఏదైనా ఉంటే చెప్పండి” అన్నాడు పొగరుగా.

గురువు గారు “మీరు ఎంత గొప్పవారంటే మీరు చేసేపని దేవుడు కూడా చేయలేడు” అన్నాడు.

“ఇది బాగుంది. మరి ఆ పని ఏదో చెప్పండి” అన్నాడు రాజు ఆసక్తిగా.

గురువుగారు “రాజు! దేశంలో ఎవరయినా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అతనికి దేశ బహిష్కార శిక్ష విధించవచ్చు. అంటే అతన్ని దేశం నించీ తరిమేయవచ్చు. కానీ పాపం దేవుడు తనకు ఎదురు తిరిగిన వాణ్ణి తన రాజ్యంనించీ తరిమెయ్యలేడు. ఎందుకంటే ఈ అనంత విశ్వం ఆయన సృష్టే కదా!” అన్నాడు.

ఆ మాటల్తో రాజు అహంకారం ఆవిరైపోయింది.
గురువుగారి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు.

అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు...
.
యోగక్షేమం వహామ్యహం

కొన్నేళ్ళ క్రితం మన దేశంలోని ఉత్తరభారత ప్రాంతంలో ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు . భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు.
"అనన్యాశ్చింతయోమా...యోగక్షేమం వహామ్యహం"
- 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం
నన్ను నమ్మి , అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అన్న శ్రీకృష్ణ పరమాత్మ మాట ప్రకారం తన అవసరమైన మేరకే సంపాదించేవాడు, ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా, అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా, "వాసుదేవమితి" సర్వం అనుకునే వాడు .

ఒక రోజు అతను ఆసుపత్రి నడిపే చిన్న గది ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి "నన్ను గుర్తుపట్టారా '' అని అడిగాడు. '' క్షమించాలి,గుర్తుకు రావడం లేదు '' అన్నాడు డాక్టరు. అపుడు ఆయన ఇలా చెప్పాడు
''పదిహేను ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని 'నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను
"నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ గుర్తుకొచ్చింది '' అన్నాను. మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి 'మీరు, మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి' అన్నారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి, అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ వెళ్ళిపోయాడు, ఆ మాట విని నేను ఎంతో ఆశ్చర్య పోయాను. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా, మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , నా భార్య రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు,పుత్తడిబొమ్మల్లావుంటారు మీరు మాకు దేవుడితో సమానం.

అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు పదిహేను ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు. అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.'

అనన్యాశ్చింతయోమా....యోగక్షేమం వహామ్యహం

ఓం నమోనారాయణాయ.....
.

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ