భగవద్గీత.. 1
ప్రాంజలి ప్రభ....శుభోదయం గౌరవనీయులైన సభ్యులందరికి తెలియపరుచునది యేమనగా 2018, 2o22, 2024 లో భగవద్గీత ను పద్యాల రూపములో ఆ భగవంతుని సంకల్పము తో వ్రాయటం కొంత జరిగింది. నేడు మరల టైపు చేసి రోజుకు 9 పధ్యాలు తెల్లవారుజామున ప్రతిఒక్కరూ చదువుకొనగలరని వాడ్సప్ గ్రూపుల్లోను, గూగుల్ ఫేస్బుక్ లోను ప్రాంజలిప్రభగా పొందు పరచదలిచాను. భగవద్గీత ను ఎందరో మహానుభావులు వ్రాసినారు. అయినా నాకు నేర్పిన గురువు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను ఆరాధించే సీతా రామాంజనేయ స్వాములను ఆరాధిస్తూ లోగడ వ్రాసినవి ఇప్పుడు టైపు చేసి పెడుతున్నాను (చందస్సులో తప్పులు దొర్లినా తెలపగలరు సరిచేసి ముద్రణచేయించ అని పండితులను ఆర్ధిస్తున్నాను) మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ,. విశ్రాంతి ఘనాంకాధికారి, ప్రాంజలి ప్రభ, రచయిత, నిర్మాత హైదరాబాద్ ***** అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* -ధర్మాధర్మాల గురించి చెబుతుంది. -కర్తవ్యం గురించి చెబుతుంది. -నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. - ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. -సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. -ఏది శాశ్వతమో ఏది అశాశ...