Posts

Showing posts from May, 2026
Image
  శైవ – వైష్ణవ వేషధారణలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో   ....................................... ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో భారతీయ ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైన విషయాలు చిత్రరూపంలో ప్రతిబింబించబడ్డాయి.   భారతీయ మతపరమైన వర్గాలు, కులాలు, వృత్తులు, వేషధారణలు, ఆచారాలను నమోదు చేసి  భారతదేశంలో ఉన్న బ్రిటిష్ అధికారులకు “ భారతీయులు” ఎలా ఉంటారో వారి సంపన్నమైన నాగరికత ఏమిటో చూపించడానికి, అలాగే  ఐరోపా దేశాలకు మన సంప్రదాయాలను తెలియజేయడానికి ఇలాంటి చిత్రాలు రూపొందించబడ్డాయి. ఫోటోగ్రఫీ అప్పట్లో లేనందున, భారతీయ నాగరికతను చిత్రరూపంలో నమోదు చేసి తమ ప్రజలకు అందించారు. ఈ చిత్రం దక్షిణ భారత భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఉదాహరణ.   ఈ కళాఖండం 1830–1850 మధ్యకాలంలో రూపొందిన కంపెనీ పెయింటింగ్ శైలికి చెందినది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ మత సంప్రదాయాలను నమోదు చేస్తూ ఉన్న సమయంలో ఇది రూపొందించబడింది.   ఈ చిత్రంలో ప్రధానంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి చెందిన భక్తులను చూపించారు.   చిత్రంలో ఎడమ నుండి కుడి వరకు మూడు వేర్వేరు భక్తి జంటలు కన...
Image
  కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి వర్ణచిత్రం. ........................................ 18వ శతాబ్దపు భారతీయ చిత్రకళలో పహాడీ కాంగ్రా వర్ణచిత్రాలు అత్యంత సుకుమారమైన రమ్యమైన అద్భుతమైన శైలిగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో మహారాజా సంసార చంద్ పోషణలో 1780–1790 కాలంలో రూపొందిన శ్రీరామచంద్ర ప్రభువు  లంకపై  విజయ సాధించి అయోధ్యకు తిరిగి వస్తున్న మనోజ్ఞ భావన ఈ చిత్రశైలికి అద్భుతమైన నిదర్శనం.  వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో వర్ణించిన రావణ వధ అనంతరం శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు విజయోత్సాహంతో అయోధ్యకు తిరిగి వచ్చే సన్నివేశాన్ని ఈ కళాఖండం జీవం పోస్తోంది. చిత్రంలో శ్రీరాముడు అందమైన పసుపు రంగు వస్త్రాల్లో నలుపు తెలుపు మచ్చల గుర్రంపై హుందాగా, గంభీర వదనంతో ముందుండగా, వెనుక  ఛత్ర చామరాలు పట్టిన సేవకులు మంత్రులు, పురప్రముఖులున్నారు. జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి వానర వీరులు ఉత్సాహంగా  రాజపరివారంలో కలిసిపోయారు. ఈ చిత్రం. భక్తి విజయం ఐక్యత అనే మూడు భావాలను ఒకే చిత్రంలో చిత్రకారుడు ఆవిష్కరించాడు. శ్రీవాల్మీకి  తులసీదాసు ...
Image
 ఆంగ్లం చదివితేనే బతుకుతాం ! ......................................... ఆంగ్లం చదివితేనే బతుకుతాం అనే భావన ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవాలంటే 19వ శతాబ్దంలోని మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల విద్యావ్యవస్థను పరిశీలించాలి. 1800 నుండి 1860 వరకు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా సాంప్రదాయ దేశీయ విద్యావిధానం ప్రబలంగా ఉండేది. ఈ విద్య ఎక్కువగా పల్లెల్లో విస్తరించి ఉన్నప్పటికీ, అది అనధికారిక స్వరూపంలోనే కొనసాగేది. కాలక్రమేణా బ్రిటిష్ పాలకుల విధానాలు, వారి విద్యా పద్ధతులు ఈ వ్యవస్థపై ప్రభావం చూపి, తెలుగు వీధిబడి విద్యను బలహీనపరిచాయి. 1822–25 మధ్య సర్ థామస్ మన్రో నిర్వహించిన సర్వే ప్రకారం ఆంధ్రప్రాంతంలో దాదాపు 12 వేల గ్రామీణ పాఠశాలలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పాఠశాలలు తిణ్ణై బడులు లేదా పియల్ స్కూళ్లు అని పిలవబడేవి. ఇళ్ల అరుగులపై గురువు బోధించే ఈ పాఠశాలల్లో బోధన పూర్తిగా తెలుగులోనే సాగేది. పిల్లలు సాధారణంగా ఐదేళ్ల వయసులో విజయదశమి రోజున చదువు ప్రారంభించేవారు. మొదట ఇసుకలో అక్షరాలు రాయడం, తర్వాత తాళపత్రాలపై వ్రాయడం నేర్పేవారు. పెద్ద విద్యార్థులు చిన్నవారికి బోధించే మానిటోరియల్ విధానం అమల్లో ఉండేది. తెల...
Image
  ADE 1025-1026 కాలంలో గజనీ మహమూద్ చేపట్టిన దండయాత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైనది. ఇది అతని 15వ దండయాత్రగా పరిగణించబడుతుంది. 1026 జనవరిలో గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై అతను దాడి చేశాడు. ఈ దాడిలో గజనీ మహమూద్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి పవిత్ర జ్యోతిర్లింగాన్ని పగులగొట్టి ముక్కలుగా చేసి ఆలయంలోని అపారమైన బంగారం, వెండి మరియు విలువైన ఆభరణాలను దోచుకున్నాడు. ​ఈ దాడుల సమయంలో ఆలయ రక్షణ కోసం పోరాడిన వారు మరియు భక్తులు కలిపి సుమారు 70,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ దండయాత్ర కేవలం సంపదను కొల్లగొట్టడానికే కాకుండా, విగ్రహారాధనను నిరసిస్తూ సాగిన మతపరమైన మరియు రాజకీయ వ్యూహంతో కూడినది. సోమనాథ్ ఆలయం తదుపరి కాలంలో ఖిల్జీలు మరియు ఔరంగజేబు వంటి పాలకుల చేతుల్లో కూడా ధ్వంసానికి గురైనప్పటికీ, ప్రతిసారీ అది తిరిగి పునర్నిర్మించబడుతూ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ........ జిబి.విశ్వనాథ 9441245857 అనంతపురం.
Image
 చదవడానికి ముందు చిత్రాన్ని ఒకసారి పరిశీలనగా చూడండి. .............................................. తమిళనాడులోని పుండరీకాక్ష పెరుమాల్‌ దేవాలయం పల్లవుల కాలానికి చెందిన ప్రాచీన వైష్ణవ ఆలయం, ఈ ఆలయం దివ్యదేశాలలో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది. ఈ దేవాలయంలో నిర్మించాల్సిన భారీ రాజగోపురం పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రస్తుతం పునాది గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ వైష్ణ్వాలయం సుమారు 72 మీటర్ల ఎత్తుతో పూర్తయి ఉంటే ఎంత వైభవంగా ఉండేదో ఊహాజనిత రూపకల్పనలు మనకు చిత్రంలో అవగతమైతున్నది.   కర్ణాటకలోని విజయనగరం ( హంపి ) లో ఉన్న మహనవమిదిబ్బ విజయనగర సామ్రాజ్యపు రాజరిక వైభవానికి ప్రతీకగా  నిలుస్తుంది. 14వ నుండి 16వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ మహత్తర రాతి వేదికపై ఒకప్పుడు కర్రతో చేసిన స్తంభాలమంటపం ఉండేది. దసరా వేడుకల సమయంలో చక్రవర్తులు ఇక్కడే కొలువుదీరేవారు. నేటికీ దిబ్బ గోడలపై వేట దృశ్యాలు, ఉత్సవాలు, నాట్య దృశ్యాలు కనిపించడం ఆ కాలపు సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యా కేంద్రంగా వెలుగొందింది. ప్రస్తుతం అక్కడ ఇటుకల శిథిల...
Image
  ఎండాకాలంలో చల్లని నీరే తాగాలని ఎందుకు అనిపిస్తుంది. చల్లని నీరు తాగితేనే దాహం తీరుతుందా ! ........................................ ఎండాకాలంలో చల్లని నీరు మనకు ఇచ్చే ఆ తృప్తి వెనుక ఉన్న ఫిజియాలజీ (శరీరధర్మాన్ని ) కొంత తెలుసుకొందాం. ​ఎండాకాలంలో చల్లని నీరు తాగితేనే దాహం తీరినట్లు ఎందుకు అనిపిస్తుంది ? ​ఎండలో తిరిగి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటి కంటే చల్లని నీరు తాగితేనే మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. దీని వెనుక కేవలం మానసిక కారణాలే కాకుండా, మన శరీరంలోని న్యూరోలాజికల్ (నరాల సంబంధిత)  ఫిజియోలాజికల్ (శరీర ధర్మం) వంటి కారణాలు కూడా ఉన్నాయి. ​మన నాలుక నోటి లోపలి పొరలలో ఉష్ణోగ్రత మార్పులను గుర్తించే ప్రత్యేకమైన నరాలు ఉంటాయి. వీటిని TRPM8 గ్రాహకాలు అంటారు. చల్లని నీరు ఈ గ్రాహకాలను వెంటనే ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా మెదడుకు శరీరం చల్లబడింది, దాహం తీరిందనే సంకేతం సెకన్ల వ్యవధిలో అందుతుంది. ​వెచ్చనినీరు ఈ గ్రాహకాలను ప్రభావితం చేయదు, అందుకే ఎంత తాగినా ఇంకా ఏదో వెలితిగా దాహంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ​దాహం అనేది కేవలం నీటి అవసరం మాత్రమే కాదు శరీరం వేడెక్కిందని చెప్పే ఒక హెచ్చరిక కూడా. ​చల్ల...
Image
  సూర్యుని సారథి పేరు అనూరుడు. అనూరుడంటే అర్థం తెలుసా ? ............................................. అజ్మీర్‌ కోటలోని రాజపుత్ర వస్తుసంగ్రాహణాలయం (Museum ) లోనున్న సూర్యదేవుని శిల్పం ఎర్రని ఇసుకరాయితో చేయబడింది.ఈ ప్రతిమాశిల్పం రాజపుత్రుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఈ విగ్రహంలో సూర్యుడు తన రథంపై రాజసంగా ఉన్నాడు. రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నాయి. ఆ గుర్రాల పేర్లు (1) గాయత్రి (2) బృహతి (3) ఉష్ణిక్ (4)జగతి (5) త్రిష్టుప్(6) అనుష్టుప్ (7) పంక్తి. ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు, ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు, ఇంకా వేదకాలంలోని కాలచక్రానికి సంకేతాలు. సూర్యుని ప్రక్కన ఆయనకు సహచరిణులుగా ఉష అంటే ప్రభాత సంధ్య, ప్రత్యూష అనగా సాయంత్ర సంధ్య కనిపిస్తారు. కొన్నిసార్లు ఇతర పరిచారికలు కూడా ఉంటారు.వారు సూర్యుని కాంతికి, శక్తికి, జ్ఞానానికి ప్రతీకలు. ఈ శిల్పంలో ఆభరణాలను సున్నితమైన రూపకల్పనతోను, వస్త్రాల మడతలను, ముఖభావాలు ఆనాటి పనితనాన్ని చాటుతున్నాయి. సూర్యుడిని సాధారణంగా స్థానక (నిలుచున్న) స్థితిలో చూపిస్తారు. ఇక్కడ రథారూఢ (ఆసీన) రూపంలో చూపించడం వలన ఆయన విశ్వానికి శక్తిని, ప్రకాశాన్ని అం...
Image
  90 నిమిషాలు మాత్రమే జరిగన యుద్ధం - పూసపాటి గజపతి మరణం. ...................................... ఇక్కడున్న తెలుపునలుపు చిత్రం మైసూరు మహారాజులు నివసించిన పాత రాచభవనం. ఇది 1897లో జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా భస్మీపటలమైంది. ఇదో దారునిర్మాణం, అంటే పూర్తిగా కర్రలు,చెక్కలతో నిర్మిమించిన అపురూప రాచభవనమన్నమాట.దీనికే  అంబా విలాస్ ప్యాలెస్ అని పేరు. అంబా అంటే మైసూరు మహారాజుల ఆరాధ్యదైవమైన చాముండి అమ్మవారు. అప్పట్లో మైసూరు ఒడయారు రాజుల రాజభవనం పూర్తిగా గందం మరియు టేకు కలపలతో  నిర్మించబడింది.ఈ కారణంగానే ఆ భవనం అగ్నికి సులభంగా ఆహుతైంది. 1897లో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక దుర్ఘటనలో ఈ పాత చెక్క భవనం పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో రాజకుమార్తె జయలక్ష్మమ్మాణ్ణి వివాహ వేడుకలు కూడా అదే ప్రాంగణంలో జరుగుతున్నాయి. వేడుకల కోసం భారీగా దీపాలు, అలంకరణలు, హోమాలు ఏర్పాటు చేయడంతో ఒక చోట మంటలు అంటుకున్నాయి. కలపనిర్మాణం కావడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి, కాసేపటిలోనే మొత్తం భవనాన్ని ఆవరించాయి. ఆ అగ్నిప్రమాదంలో పాత రాజభవనం పూర్తిగా నాశనమైంది. తరువాత నాలుగవ కృష్ణరాజ వడయారు పాలనలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ...
Image
  ఎర్రచందనం ప్రధాన కొనుగోలుదారు ఎవరు ? ఏం చేస్తారు ? దొంగరవాణాకు కారణమేమిటి ? ...................................... ఎర్రచందనం శాస్త్రీయ నామం Pterocarpus santalinus. ఇది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN)  జాబితాలో అంతరించే ప్రమాదంలో ఉన్న వృక్షజాతిగా గుర్తించబడింది.  కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం పర్వత శ్రేణుల్లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే పెరుగుతుంది. భౌగోళిక పరిమితి కారణంగా దీని లభ్యత చాలా అరుదు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. ఎర్రచందనం వయసు & రకాన్ని బట్టి టన్ను ధర లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటుంది.అందుకేతక్కువ పెట్టుబడితో భారీ లాభాల కోసం  స్మగ్లర్లు దొంగరవాణా చేస్తారు.భారత ప్రభుత్వం ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించడం, CITES అంటే అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వ్యాపార సదస్సు అనుబంధం - 2  క్రింద ఈ వ్యాపారాన్ని నియంత్రించడం వల్ల చట్టబద్ధ మార్గంలో సరఫరా జరగక, డిమాండ్‌ను తీర్చడానికి దొంగరవాణా జరుగుతుంది.  ప్రపంచవ్యాప్తంగా దీని ప్రధాన కొనుగోలు దేశం చైనా, అక్రమ...
Image
  హళేబీడులో నాట్య సరస్వతి, శిలలో పలికిన అద్భుత విన్యాసం. .................................... హొయసల శిల్పకళా వైభవానికి తలమానికంగా నిలిచే హళేబీడు హొయసలేశ్వర దేవాలయంలో కొలువైన నాట్య సరస్వతి శిల్పం భారతీయ శిల్ప చరిత్రలోనే అపూర్వమైన కళాఖండం. సాధారణంగా వీణాపాణిగా శాంతమూర్తిగా పద్మాసనంలో కనిపించే సరస్వతీ దేవిని ఇక్కడ నాట్య భంగిమలో చిత్రించడం హొయసల శిల్పుల అసాధారణ సృజనకు ఊహాశక్తికి నిదర్శనం. హొయసల రాజధాని ద్వారసముద్రం మరోపేరు హళేబీడు. హళేబీడులోని ఈ దేవాలయం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. దేవాలయం బయటి గోడలపై చెక్కిన వేలాది శిల్పాల్లో నాట్య సరస్వతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా సరస్వతిని విద్యకు, జ్ఞానానికి ప్రతీకగా చూస్తాం. కానీ హళేబీడులో ఆమె నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ఆమె శరీరంలోని త్రిభంగ వంపు, అంటే మెడ నడుము మోకాలు వద్ద మూడు చోట్ల వంగిన తీరు కాలి మడమల లయబద్ధమైన కదలిక చూస్తే శిల ఈ క్షణంలోనే నాట్యం చేస్తుందేమో అనిపిస్తుంది. ఇది కేవలం శరీర సౌందర్యం కాదు. సంగీతం నృత్యం విజ్ఞానం విడదీయలేనివని చెప్పే తాత్విక సంకేతం. జ్ఞానం నిశ్చలంగా ఉండేది కాదు. అది నాట్యంల...
Image
 పశుపక్ష్యాదులలో వావి వరుసలుంటాయా ? ................................... మనుషుల్లో లాగా జంతువులు, పక్షులకు అక్క చెల్లి తల్లి పిన్ని కూతురు కొడుకు అన్న తమ్ముడు నాన్న చిన్నాన్న వంటి రక్త సంబంధాలపై అవగాహన ఉండదు. కాని ప్రకృతి వాటికి తన దగ్గరి బంధువులతో జతకట్టకుండా నివారించే కొన్ని సహజ పద్ధతులను నేర్పింది. దీన్నే శాస్త్రీయంగా ఇన్‌బ్రీడింగ్ అవాయిడెన్స్ అంటారు. జంతువులకు మనుషుల్లాంటి నైతికత సామాజిక నియమాలు వావివరుసల పట్టింపు ఉండదు. ఒక మగ కుక్కకు అవకాశం వస్తే తన తల్లితో చెల్లితో కూతురితో కూడా జతకట్టగలదు. కోళ్లు పిల్లులు మేకలు సింహాలు వంటి జంతువులలోనూ ఇది కనిపిస్తుంది. వాటికి ఇది నా తల్లిచెల్లి కొడుకు అనే స్పృహ ఉండదు. వాసన హార్మోన్లు బుుతుక్రమం ఆధారంగానే అవి జతను ఎంచుకుంటాయి. కాని ప్రకృతి ఇన్‌బ్రీడింగ్‌ను కొంతగా తగ్గించే విధంగా  ఏర్పాటు చేసింది. చాలా జంతుజాతుల్లో యుక్తవయసు రాగానే ఆడమగ జంతువులు తాము పుట్టిన గుంపు నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఉదాహరణకు సింహాల్లో మగపిల్లలు 2 లేదా 3 ఏళ్లకు గుంపు నుంచి తరిమివేయబడతాయి.ఏనుగుల్లో మగ ఏనుగులు 12 లేదా 15 ఏళ్లకు ఒంటరిగా వెళ్లిపోతాయి.తోడేళ్లు కోతులు జి...
Image
  ఎ డీర్ హంట్ - రాత్రి వేట రహస్యం. ................................... సామాన్యశకం 1775 కాలం నాటి ఎ డీర్ హంట్ అనే ఈ అపురూప రాజస్థానీ పెయింటింగ్ ప్రస్తుతం అమెరికాలోని బాల్టిమోర్‌లోని వాల్టర్స్ ఆర్ట్ మ్యూజియంలో ఉంది. రాజస్థాన్‌లోని కోటా సంస్థాన శైలికి చెందిన ఈ చిత్రం ఒక రాత్రివేళ జరిగిన జింకల వేట దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరింపచేస్తోంది. ఈ చిత్రంలో వేటగాడితోపాటు మరో స్త్రీచేతిలో ఏదో  ఉంచుకొన్న వస్తువును చూసి చాలామంది అది పురాతన కాలపు ‘ఫ్లాష్‌లైట్’ అని అపోహ పడుతుంటారు. కానీ నిజానికి అది వేట కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంప్రదాయ దీపం. మట్టి కుండలో గానీ శంఖాకారపు లోహపు గొట్టంలో గానీ నూనె దీపాన్ని ఉంచి దాని ముందు భాగంలో మాత్రమే కాంతి వచ్చేలా చిన్న రంధ్రం పెడతారు. ఆ వెలుతురును నేరుగా జంతువుల కళ్లపై కేంద్రీకరిస్తే చీకట్లో ఒక్కసారిగా పడిన వెలుగుకు జింకలు బెదిరిపోయి కళ్లు మిరుమిట్లు గొలిపి కదలకుండా నిలబడిపోతాయి. ఆ సమయంలో వేటగాళ్లు సులభంగా బాణం వేస్తారు. ఈ పురాతన పద్ధతినే ఇప్పుడు ఆధునిక వేటలో ‘స్పాట్‌లైటింగ్’ లేదా ‘జాక్‌లైటింగ్’ అని పిలుస్తారు. చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. ఈ పెయి...
Image
  మధ్యాహ్నం నిద్ర మంచిదేనా ? ఎంతసేపు ? ........................................ మనిషికి నిద్ర అంటే శరీరం స్విచ్ ఆఫ్ చేసుకోవడం కాదు, అది శరీరాన్ని మెదడును రిపేర్ చేసుకునే సమయం ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్ పెట్టినట్టు. నిద్రపోకపోతే మనిషి బతకలేడు. మెలకువగా ఉన్నప్పుడు మెదడులో వ్యర్థ పదార్థాలు  టాక్సిన్స్ పేరుకుపోతాయి, ముఖ్యంగా బీటా-అమిలాయిడ్ అనే ప్రోటీన్, ఇది ఎక్కువైతే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి వ్యాధులు వస్తాయి. నిద్రపోయినప్పుడు మెదడులోని గ్లింపాటిక్ వ్యవస్థ యాక్టివ్ అయ్యి ఈ చెత్తనంతా బయటకు పంపేస్తుంది, అందుకే మంచి నిద్ర తర్వాత తల తేలికగా ఉంటుంది.  పగలంతా నేర్చుకున్న విషయాలు, అనుభవాలు నిద్రలోనే దీర్ఘకాల జ్ఞాపకాలుగా మారతాయి, పరీక్ష ముందు రాత్రి సరిగా నిద్రపోతే చదివింది గుర్తుంటుంది, నిద్రలేకపోతే ఏకాగ్రత పోతుంది, కొత్తగా ఏమీ నేర్చుకోలేం. నిద్రలో గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది, అది కండరాలు, కణజాలాలు, ఎముకలు రిపేర్ చేయడానికి, కొత్త కణాలు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు ఎక్కువ నిద్రపోతారు, ఎదుగుతారు. గాయాలు త్వరగా మానాలన్నా నిద్ర అవసరం. నిద్రపోతున్నప్పుడు శరీరం ఇన్ఫెక...
Image
  విజయనగర సామ్రాజ్యపు రాజలాంఛనాలలో వరాహం, సూర్యచంద్రులు ఖడ్గం ఎందుకు ఉన్నాయి ? ........................................... దక్షిణ భారత రాజవంశాల చరిత్రలో రాజలాంఛనాలు వారి గుర్తింపు, శక్తి, సార్వభౌమత్వానికి ముఖ్యమైన ప్రతీకలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యానికి వరాహం, ఖడ్గం, సూర్యచంద్రులు ఎంత ప్రాధాన్యమో, అదే విధంగా శాతవాహన, పల్లవ, పాండ్య, చాళుక్య, చోళ, హొయసల, కాకతీయ, రెడ్డి, నాయక, వడయార్ వంశాలకు కూడా అంతే ప్రాధాన్యత గల ప్రత్యేక రాజచిహ్నాలుoడేవి. ఇవి నాణేలు శాసనాలు దేవాలయాలు జెండాలపై ఆ రాచముద్రలు కనిపిస్తూ ఆయా రాజ్యాల సంస్కృతిని, మత విశ్వాసాలను రాజకీయ శక్తిని తెలియజేస్తాయి. మొదటగా శాతవాహనులు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. వారి చిహ్నాల్లో సింహం ఏనుగు చైత్యం పడవ వంటి బొమ్మలు కనిపిస్తాయి. వారి నాణేలపై ఉజ్జయిని గుర్తు స్వస్తిక నదిలో ఓడ వంటి గుర్తులు ఉండేవి.సింగం శక్తికి ఏనుగు బలానికి గుర్తులు. ఓడవారి సముద్ర వాణిజ్య శక్తిని సూచిస్తాయి.  పల్లవుల కాలంలో సింహం ప్రధాన చిహ్నంగా నిలిచింది. సింహం పౌరుషానికి బలానికి గుర్తు. మహాబలిపురం, కాంచీపురం ప్రాంతాల్లో సింహస్తంభాలు విరివిగా కనిపిస్తాయి. వా...
Image
 రాబోయే కాలం బ్రహ్మచర్య యుగం అవుతుంది_ ఒక ఇటీవలి అంతర్జాతీయ సర్వే ప్రకారం, రాబోయే ఆరు సంవత్సరాలలో ప్రపంచంలోని దాదాపు 45% మంది అమ్మాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు. ఈ నివేదిక 1 ఫిబ్రవరి, 2025న లోక్‌మత్ వార్తాపత్రికలో ప్రచురితమైంది, మరియు ఇది మోర్గాన్ స్టాన్లీ సంస్థ చేసిన వివరణాత్మక అధ్యయనంపై ఆధారపడింది. _సర్వేలో కనుగొన్న ప్రధాన కారణాలు:_ 1. నేటి అమ్మాయిలు ఉన్నత విద్యను పొందుతూ తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.   2. వారు ఆర్థికంగా స్వతంత్రులు మరియు ఎవరిపైనా ఆధారపడాలని కోరుకోవడం లేదు.   3. వారు స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలనుకుంటున్నారు.   4. వారు వివాహం, మాతృత్వం మరియు కుటుంబ బాధ్యతలను తమ పురోగతికి అడ్డంకులుగా చూడటం ప్రారంభించారు.   5. ఈ ధోరణి కొనసాగితే, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం కూలిపోవచ్చు.   6. జనాభా తగ్గుదల, అవివాహిత పురుషుల సంఖ్య పెరగడం, మరియు వృద్ధాప్యంలో ఒంటరితనం సమస్యలు తలెత్తవచ్చు.   7. ప్రశ్న కూడా తలెత్తుతుంది: జీవితం చివరిలో తోడుగా ఉండటానికి ఎవరూ లేకపోతే, ...
Image
 తడి తగిలితె వెంట్రుకలెoదుకు మెత్తబడతాయి ? .................................... తడి తగిలినప్పుడు వెంట్రుకలు మెత్తబడటానికి కారణం వాటి నిర్మాణంలోనే ఉంది. ప్రతివెంట్రుకపై భాగంలో పొరలుపొరలుగా అమర్చిన క్యూటికల్ అనే రక్షణ కవచం ఉంటుంది. పొడిగా ఉన్నప్పుడు ఈ క్యూటికల్ పొలుసులు బిగుతుగా మారి మూసుకుపోయి ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉంటాయి. అందువల్ల వెంట్రుకలు గరుకుగా గట్టిగా ఉంటాయి. తడి లేదా నీరు తగలగానే ఈ క్యూటికల్ పొలుసులు కొద్దిగా విచ్చుకుంటాయి. వెంట్రుకలోని లోపలి భాగమైన కార్టెక్స్‌లో ఉన్న కెరాటిన్ ప్రోటీన్ నీటిని స్పాంజిలా పీల్చుకుంటుంది. కెరాటిన్‌లోని హైడ్రోజన్ బంధాలు సాధారణంగా వెంట్రుకలను బిగుతుగా ఉంచుతాయి. అయితే తడి పడినప్పుడు నీటి అణువులు ఈ బంధాలను తాత్కాలికంగా విడదీస్తాయి. దాంతో కెరాటిన్ తంతువులు సడలిపోతాయి. ఈ ప్రక్రియలో వెంట్రుక సుమారు 30% వరకు నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది. దాని వ్యాసం పెరుగుతుంది. బంధాలు సడలడం, నీరు లోనికి చొరబడటం వల్ల వెంట్రుకలు .మరింత మృదువును పొందుతాయి. అందుకే అవి మెత్తగా మృదువుగా మారుతాయి. అందువల్ల తడి జుట్టును దువ్వడం సులభం, తడి వెంట్రుకలను వివిధ ఆకారాలలోకి తేలిక...
Image
 గరుడునికి రెండు తలలా ? ఎందుకు ?   ......................................... విష్ణుభగవానుడు లక్ష్మీదేవితో సహ తన వాహనమైన గరుడునితో  కలిసి దర్శనమిచ్చే ఈ అద్భుత శిల్పం భారతీయ శిల్పకళలో ఒక విశిష్టస్థానం పొందింది. ఇందులో గరుడుడు దేవతలిద్దరిని తన భుజాలపై మోస్తూ, స్వర్గలోకానికి ఎగురుతున్నట్లుగా శిల్పి అద్భుతంగా ఆవిష్కరించాడు. శిల్పం శిఖర భాగంలో విష్ణువు గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన తలపై ఉన్న కీర్తిమకుటం ఆ దేవదేవుని మహిమను సూచిస్తుంది. చేతులలో చక్ర శంఖాలను ధరించి వున్నాడు. శంఖచక్రాలు ధర్మరక్షణకు నిదర్శనం. విష్ణుదేవుని వామాంకంపై లక్ష్మీదేవి ఆసీనురాలై వుంది.లక్ష్మీదేవి సంపదకు శుభప్రదానికి మూర్తీభవించిన రూపం. వీరిని మోస్తున్న గరుడుడు పూర్తిగా మానవరూపంలో ఉండి శక్తికి వేగానికి ప్రతీకగా వున్నాడు. ఈ శిల్పంలో గరుడుడు రెండు శిరస్సులతో కనిపించడం ఒక ప్రత్యేక లక్షణం. ఇలా ద్విమస్తకత్వంతో కనిపించడం దక్షిణ భారత శిల్పకళలోని ఒక శైలి మాత్రమే. ఇది శిల్పుల ఊహాశక్తికి ఉదాహరణ మాత్రమే.ఇలా శిల్పులు గరుడుని ముఖలక్షణాలను అతిశయోక్తిగా చెక్కడం ద్వారా ఆయనకున్న బహుముఖ శక్తికి నిదర్శనం. ఇంకా విష్ణువుకు వ...
Image
  పురాతన దేవాలయాలలో చిత్రలేఖనాలు వందల సంవత్సరాలైనా ఎందుకు పాడుకావు ? .....................................  మనదేవాలయాల్లో కనిపించే చిత్రలేఖనాలన్నీ  ప్రకృతిలో లభించే ఖనిజాలు మొక్కలు సేంద్రియ పదార్థాలతో తయారుచేసిన సహజ రంగులతోనే రూపొందించబడ్డాయి. ఈ రంగులు శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలవడానికి కారణం వాటి సహజసిద్ధమైన తయారీ విధానం అలాగే ఉపయోగించిన పదార్థాల నాణ్యత. పురాతన చిత్రకళలో “పంచవర్ణాలు” అనే ఐదు ప్రధాన రంగులు విస్తృతంగా ఉపయోగించేవారు. ఎరుపు రంగు కోసం ఎర్రమట్టి (రెడ్ ఓకర్), ఇంగువ (సిన్నబార్), లక్క పురుగుల నుంచి లభించే లాక్షారసం వాడేవారు. పసుపు రంగుకు యెల్లో ఓకర్, హరితాళమనే (ఆర్పిమెంట్) ఖనిజం పసుపు మోదుగ పూలరసం ఉపయోగించేవారు. తెలుపు కోసం శంఖపుపొడి సున్నం కయోలిన్ అనే తెల్లమట్టి ఉపయోగించేవారు. నలుపు కోసం దీపాల మసి (ల్యాంప్ బ్లాక్) బొగ్గుపొడి కాల్చిన కొబ్బరి చిప్పలపొడి వాడేవారు. నీలం రంగు కోసం నీలిమందు మొక్క నుంచి తీసిన ఇండిగో అలాగే విలువైన లాపిస్ లాజులి రాయి నుంచి తయారుచేసిన అల్ట్రామెరీన్ వాడేవారు. ఇది చాలా ఖరీదైనదిగా ఉండటంతో ముఖ్యమైన దేవతా చిత్రాలకు మాత్రమే ఉపయోగించబడేది....
Image
  మత్తులో ఉంచడానికి మద్యం, భంగ్ (గంజాయి) ధత్తూర(ఉమ్మెత్త) వంటి మూలికలను ఉపయోగించేవాడు. ..................................... ఈ వ్యాసాన్ని చదవడానికి ముందు ఇచ్చిన చిత్రాన్ని తెరిపారా చూడండి. 150 సామాన్యశకం (ACE)  సంవత్సరాలకు, అంటే 2 వ శతాబ్దానికి చెందినదిగా భావించే కౌశాంబి నుండి లభించిన ఈ మట్టిబొమ్మ నమూనా భారతదేశంతో పాటు ఆసియాలోనే మానవఉదర శస్త్రచికిత్సను చిత్రీకరించిన తొలి పురావస్తు ఆధారంగా పరిగణించబడుతోంది. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ కళాఖండం ఒక పురుషుని పొట్టను శస్త్రచికిత్స కోసం కోసిన దృశ్యాన్ని చూపిస్తుంది.లోపలి అవయవాలు, ముఖ్యంగా పేగులు బయటకు కనిపిస్తున్నాయి. వత్సరాజ్యానికి రాజధానిగా ఉన్న కౌశాంబిలో ఈ నమూనా లభించింది. ఇది ప్రాచీన మానవ శరీర నిర్మాణశాస్త్రం శస్త్రచికిత్సా జ్ఞానానికి చెందిన అరుదైన ఉదాహరణ. బహుశా సిజేరియన్ వంటి ఉదర శస్త్రచికిత్సలను లేదా ఇతర విధానాలను విద్యార్థులకు ప్రదర్శించడానికి వారి విద్యా ప్రయోజనాల కొరకు  ఉపయోగించి ఉండవచ్చు. సాంస్కృతికంగా ఈ కళాఖండం కుషాణుల కాలానికి చెందినది. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది చ...
Image
 కొడుకును  కూతురును కౌగిలించుకోగానే హాయిగా వుంటుంది. ఎందుకు ? ...................................... కొడుకును కూతురును భార్యను భర్తను జతగాడిని ప్రేయసిని కౌగిలించుకుంటే ఎంతో హాయిగా అనిపించడానికి కారణం మన శరీరం మెదడు మనసు మూడూ కలిసి సకాలంలో స్పందించడమే. మనం ప్రేమించిన వాళ్లను గట్టిగా హత్తుకున్న వెంటనే మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.దీన్నే బాండింగ్ హార్మోన్ లేదా కడల్ హార్మోన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్ ఒత్తిడిని తగ్గించే కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది.దాంతో శరీరం రిలాక్స్ అవుతుంది. గుండె వేగం బీపీ కాస్త తగ్గి ప్రశాంతత వస్తుంది. అదే సమయంలో డోపమైన్  సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లు కూడా విడుదల అవుతాయి. అవి ఆనందం తృప్తి భద్రతా భావాన్ని కలిగిస్తాయి. చర్మంపై ఉండే సి-టాక్టైల్ నరాలు సున్నితమైన స్పర్శకు ప్రత్యేకంగా స్పందిస్తాయి. ప్రేమతో కూడిన కౌగిలి ఈ నరాల ద్వారా మెదడులోని వాగస్ నాడిని ఉత్తేజపరిచి శరీరాన్ని శాంతపరుస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లి ఒడి తండ్రి భుజం మనకు రక్షణకు గుర్తుగా మెదడులో నమోదై ఉంటుంది. అందుకే పెద్దయ్యాక కూడా కుటుంబ సభ్యుల కౌగిలి తక్షణ భద్ర...
Image
 నిజం! శివప్పకు కిట్టప్పకు మధ్య బయోలాజికల్ వార్ ఫేర్ జరిగింది. ..................................... జీవాయుధయుద్ధం అంటే బయోలాజికల్ వార్‌ఫేర్ లేదా జెర్మ్ వార్‌ఫేర్. అంటే మనుషులకు జంతువులకు పంటలకు వైరస్ లు బ్యాక్టీరియాలు వ్యాప్తిచేసి బలవంతపు మరణాన్ని లేదా వ్యాధిని కలిగించడం. జ్వరాన్ని మరణాన్ని కల్గించడానికి వైరస్‌లు బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు (ఫంగి) వంటి విషపదార్థాలను ప్రయోగిస్తారు. మూడుకాళ్ల జ్వరాసురుడు సనాతనహిందూ ధర్మంలో జ్వరానికి ప్రతిరూపం. ఇతడు మూడుకాళ్లు మూడుతలలు మూడుచేతులు కలిగిన రాక్షసుడిగా తరచూ మేకముఖంతో కనిపిస్తాడు. జ్వర అంటే జ్వరం అసుర అంటే రాక్షసుడు. ఈ రెండుపదాల కలయికే జ్వరాసురుడు. భాగవతపురాణం విష్ణుపురాణాలలో బాణాసురుని కథలో జ్వరాసురుని ప్రస్తావన వస్తుంది.పరమశివుడి భక్తుడైన బాణాసురుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు.బాణుడికి సహాయంగా శంకరుడు తన జ్వరరూపమైన జ్వరాసురుడిని శ్రీకృష్ణుని సైన్యంపైకి పంపాడు. జ్వరాసురుడు మూడుతలలు మూడుకాళ్లు మూడుచేతులతో ఉంటాడు. జ్వరాసురుడు శ్రీకృష్ణుని సైనికుల్లో తీవ్రమైన వేడిని పుట్టించి వారిని స్పృహతప్పేలా చేసాడు. అంటే వైరస్ కారణాలతో ఇదో రకం జ్వరమన్న ...
Image
  అగ్నులు ఎన్ని రకములు ? అవి ఏవి ? .................................... హిందూశాస్త్రాలు వేదాలు పురాణాల ప్రకారం సందర్భాన్ని బట్టి అగ్నిని ప్రధానంగా మూడు ఐదు ఏడు నలభై తొమ్మిది రకాలుగా విభజించారు. త్రేతాగ్నులు మూడు రకములు.యజ్ఞాలలో వెలిగిస్తారు. (1)గార్హపత్యం - గృహస్థుడు నిత్యం రక్షించే గృహాగ్ని. పడమటి వైపు ఉంటుంది. ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. (2) ఆహవనీయం - దేవతలకు హవిస్సు అర్పించే యజ్ఞాగ్ని. తూర్పు వైపు ఉంటుంది.   (3)దక్షిణాగ్న దీనికే అన్వాహార్య పచనమని పేరు. పితృకర్మలు, శ్రాద్ధాలకు వాడే అగ్ని. దక్షిణం వైపు ఉంటుంది.    సప్తజిహ్వలు అంటే ఏడు రకాలుగా మండే అగ్నులు. ముండకోపనిషత్తులో చెప్పిన ఏడు అగ్నులన్నమాట.అగ్ని మండే విధానాన్ని రంగు వేగం తీవ్రతను బట్టి విభజన చేశారు. (1) కాళీ – నలుపు రంగులో వుండి మెల్లగా లోపల మండుతుంది.  (2) కరాళీ – మండే సమయంలో భయంకరంగా వుండి ఉగ్రంగా ఎగసిపడుతుంది.  (3)మనోజవం  – మనస్సు వేగంతో చలించేది.అంటే చిటపటలాడుతూ తీవ్రంగా మండుతూ వేగంగా విస్తరించేది.  (4) సులోహితా – ఎర్రటి కాంతితో మండుతూ, అధిక ఉష్ణాన్ని ఇస్తూ మండేది. (5)సుధూమ్ర...

03-05-2026

Image
 జంతువులకే ఆ పరుగులెందుకు ? .................................... ప్రకృతి ప్రతిజీవికి ఒక ప్రత్యేకశక్తిని ఇచ్చింది. కొన్ని జీవులు తెలివితో బతికితే మరికొన్ని అసాధారణ వేగంతో మనుగడ సాగిస్తాయి.గాలిలో నీటిలో భూమిపై అత్యంత వేగంగా కదిలే జీవులను పరిశీలిస్తే  వేగం వాటి జీవన విధానంలో ఎంత కీలకమో అర్థమవుతుంది. ఆకాశంలో పెరెగ్రైన్ ఫాల్కన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవి. వేటాడేటప్పుడు గాలిలో గంటకు 389 కి.మీ. వేగంతో కిందికి దూకుతుంది, ఈ వేగాన్ని స్టూప్ అంటారు. గోల్డెన్ ఈగిల్ గంటకు 240 నుంచి 320 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది, దీని దృష్టి మనిషి కంటే ఎనిమిది రెట్లు పదునైనది కావడం వల్ల అంత వేగంలోనూ ఎరను ఖచ్చితంగా గుర్తిస్తుంది.  ఫ్రిగేట్ బర్డ్ అనే సముద్రపక్షి గంటకు 153 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, ఇది వారాల తరబడి గాలిలోనే ఉంటూ అలాగే నిద్రపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది.  భూమిపై చిరుతపులి అత్యంత వేగవంతమైన జంతువు, కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 110 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కానీ దాని శరీరం వేడెక్కిపోవడం వల్ల 20 నుంచి 30 సెకన్లకు మించి ఈ వేగాన్ని కొనసాగించలేదు. ప్రాంగ్‌హార్న్ యాంటిలోప్ అనే జ...

02-05-2026

Image
  02/05...102.. సుభాషితమ్ 𝕝𝕝 శ్లో𝕝𝕝 అల్పతోయశ్చలత్కుమ్భోహ్యల్పదుగ్ధాశ్చ ధేనవః। అల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితః॥ తా𝕝𝕝 తక్కువ నీరుగల కుండ చలిస్తుంది, తక్కువ పాలు ఇచ్చే ఆవులు చాలా పొగరుగా ఉంటాయి  మరియు తక్కువ విద్య కలవాడు, చాలా గర్వం కలవాడుగా ఉంటాడు, అందవిహీనుడు ఎక్కువ చేష్టలు చేస్తూ ఉంటాడు. * 02/05..102..నేటి గీతం శివయ్య  పల్లవి శివయ్యా… నీవే దిక్కయ్యా శరణు శరణు పరమేశయ్యా కన్నీటి మాటల పూజలతో కరుణ చూపవయ్యా ॥ చరణం – 1 నీ ఆజ్ఞ లేక చీమకైనా కాటు రాదంటారయ్యా నావికాని బంధములను నాకెందుకు చేరువచేయా ॥ మరుక్షణమే దూరమయ్యే మాయల గీతమెందుకయ్యా మరచిపోలేని జ్ఞాపకాలై మనసు నింపెదెందుకయ్యా ॥ చరణం – 2 మది మోయలేని సంతోషం వరమై నీవిచ్చావయ్యా అదే వేళలో బాధరూపం జీవితానికి చూపావయ్యా ॥ నీ లీలల లోతు తండ్రీ నాకెంతకూ అందదయ్యా నీ వైపే చూస్తూ ఉండే నిశ్శబ్దమే మిగిలిందయ్యా ॥ చరణం – 3 మార్పుల మధ్య నిలిచిన నిజం నీవేనని తెలిసిందయ్యా నిన్ను మించిన ఆనందం లోకంలో లేదయ్యా ॥ కోర్కెల బంధనాలన్నీ కరిగిపోవునయ్యా నేనే నీవై లీనమయ్యే దయను ప్రసాదించయ్యా ॥ ముగింపు శివయ్యా… నీవే దిక్కయ్యా శరణాగతి నీ చరణాలయ్యా జన్మ ...