****



365) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఓంశ్రీమాత్రే నమః

ఘటైకాకారధీస్థా చిద్ఘటమేవావభాసయేత్ ౹
ఘటస్య జ్ఞాతతా బ్రహ్మచైతన్యేనావభాసతే 
౹౹4౹౹

వ్యాఖ్య :-

ఘటాన్ని మాత్రమే ధారణచేసే బుద్ధి వృత్తి యందున్న చిదాభాస ఘటాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. మరి ఘట మనేది తెలియటం మాత్రం(జ్ఞాతత్వం) బ్రహ్మచైతన్యం ద్వారానే అవభాసితమౌతుంది.అంటే -
ఘటము యొక్క ఆకారమును పొందిన బుద్ధియందులి చిదాభాసుడు ఘటమున్నదని తెలియజేయును.ఇట్లు ఘటమున్నదని తెలియుటను
తెలుపునది బ్రహ్మాచైతన్యము,కూటస్థము.
బుద్ధి ఘటాదుల ఆకారమును పొందుటను బుద్ధివృత్తులందురు.
ఘటాకారంలో ఉండే బుద్ధివృత్తిని,ఆ బుద్ధివృత్తిలో ఉండే చిదాభాస(జీవుడు) ప్రకాశింప చేస్తాడు.
కాని, ఘటానికి సంబంధించిన జ్ఞానాన్ని(ఇది ఘటం అనే జ్ఞానాన్ని)మాత్రం కలిగించలేడు.

ఈ బుద్ధివృత్తులు ఆయా విషయముల అజ్ఞానమును తొలగించును.
ఆ ఘటం యొక్క జ్ఞాతత్వ ధర్మం ఆ ఘటాన్ని తెలియజేస్తోంది.
బుద్ధియందున్న చిదాభాస , ఘటమందున్న బ్రహ్మచైతన్యం ఈ రెంటి సంబంధం వల్లను ఘటజ్ఞానం కలుగుతోంది.విషయజ్ఞానము బ్రహ్మజ్ఞానము చేతనే అది జ్ఞానస్వరూపమగుటచే 
తెలియబడుచున్నది.
బుద్ధివృత్తులు చంచలములగుటచే వానివల్ల కలిగే అజ్ఞాన నిరసము కూడా క్షణికమే అగును.
స్థిరమగు కూటస్థస్పర్శచే జ్ఞానమునకు స్థిరత్వము కలుగుచున్నది.
సరే, ఘటాన్ని ఫ్రకాశింపజేసేది బ్రహ్మచైతన్యమైనప్పుడు ఇక బుద్ధివృత్తితో పనేముంది ?
__(())--


366) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

ఓంశ్రీమాత్రే నమః
అజ్ఞాతత్వేన భాతోఽ యం ఘటో బుద్ధ్యుదయాత్పురా ౹
బ్రహ్మణైవోపరిష్టాత్తు జ్ఞాతత్వేనేత్యసౌ భిదా 
౹౹5౹౹

వ్యాఖ్య:- ఘటాన్ని ప్రకాశింపజేసేది బ్రహ్మచైతన్యమైనప్పుడు బుద్ధివృత్తితో పనేముంది ? అంటే -

ఈ ఘటమనేది బుద్ధివృత్తి ఉదయించటానికి పూర్వం బ్రహ్మ ద్వారానే అజ్ఞాతరూపంలో ప్రతీతమౌతూనే ఉంది. పిమ్మట జ్ఞాతరూపంలో ప్రకాశితమౌతోంది.ఈ రెంటిలోనూ ఉన్న భేదం ఇదే !
బుద్ధి వృత్తి ఏర్పడుటకు పూర్వము "ఘటమున్నదని తెలియదు" అని-బ్రహ్మచైతన్యము చేతనే తెలియును. బుద్ధివృత్తి ఏర్పడిన పిదప ఆ బ్రహ్మ చైతన్యము చేతనే "ఘటమున్నదని తెలియును"
అని తెలియును. బుద్ధివృత్తి ఉదయించటానికి పూర్వం,"నేను ఘటాన్ని   తెలుసుకొన్నాను" అనటంలో ఘటానికి సంబంధించిన సామాన్య జ్ఞానం మనస్సులో ఉంటుంది.ఇందు వల్ల 
"ఘటోజ్ఞాతః" అనేది దృష్టిగోచరమౌతోంది.

కాని,ఘట విషయకమైన విశేష జ్ఞానం లేనందువల్ల "అజ్ఞాతత్వే న జ్ఞాతః" అనాల్సి వస్తోంది - అజ్ఞాత రూపంలో తెలుసుకొన్నాను అని. దానినే ప్రత్యక్షంగా చూచినప్పుడు "జ్ఞాతత్వేన జ్ఞాతః"అనవలసి వస్తోంది.

ఈ విధమైన రెండురకాల జ్ఞానమూ కూడా బ్రహ్మచైతన్యం వల్లనే కలుగుతూ ఉన్నప్పటికీ ఒకదానియందు బుద్ధివృత్తి లేనందున"అజ్ఞాతత్వేన జ్ఞాతః" లాగా, రెండవదానియందు చిదాభాసతో కూడిన బుద్ధివృత్తి ఉన్నందువల్ల "జ్ఞాతత్వేన జ్ఞాతః"అవుతోంది.
ఈ విధంగా జ్ఞాతత్వం,అజ్ఞాతత్వం అనేవి సిద్ధించటం కోసం బ్రహ్మకు అతిరిక్తంగా బుద్ధివృత్తి అవసరం అవుతోంది. విషయముల గూర్చి తెలిసిననే గదా ప్రయోజనము.ఆ తెలియుట బ్రహ్మచైతన్యము వలననే అయినచో ఇక బుద్ధి వలని ఆవశ్యకత ఏమి అనే ప్రశ్న సమాధానింపబడినది.  బ్రహ్మము జ్ఞానస్వరూపము కనుక అది స్వప్రకాశమై విషయముల గూర్చి అజ్ఞానమునుగాని జ్ఞానముగాని తెలుపుచుండును.
విషయముల జ్ఞానాజ్ఞానముల సిద్ధికి మాత్రమే బుద్ధివృత్తి ఆవశ్యకమగును.
ఒక విషయము గూర్చిన బుద్ధివృత్తి ఏర్పడక పూర్వము, ఆ విషయమును గూర్చిన మన  అజ్ఞానము మనకు తెలియును.  ఆ బుద్ధివృత్తి ఏర్పడిన పిదప ఆ విషయమును గూర్చిన జ్ఞానము మనకు తెలియును. ఈ జ్ఞానము తెలియుటయే పరిబాషయందు "జ్ఞానస్య జ్ఞాతతా" అనబడినది.
అసలు ఒకే ఘటమందు జ్ఞాతత్వం,అజ్ఞాతత్వం  రెండూ ఉండటం ఎట్లా సంభవం ?

((()))

367) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
ఓంశ్రీమాత్రే నమః

చిదాభాసాన్త ధీవృత్తిర్ జ్ఞానం లోహాన్తకున్తవత్ ౹
జాడ్యమజ్ఞానమేతాభ్యాం వ్యాప్తః కుమ్భో ద్విధోచ్యతే 
౹౹6౹౹

చిదాభాసతో కూడిన బుద్ధివృత్తి జ్ఞానము.ఇది ఇనుప ములుకుగల అంకుశము టిది.జడత్వమనగా అజ్ఞానము.ఈ రెండింటి చేత ఘటము ఒకటియే అయినా, తెలిసిన కుండ,తెలియని కుండ 
అని రెండు విధములుగా చెప్పబడుచున్నది.

బల్లెము యొక్క చివరిభాగంలో తీక్షణమైన లోహపు ముక్కవున్నట్లే , చిదాభాసకు అగ్రభాగాన బుద్ధివృత్తి ఉంటుంది.అది జ్ఞానం. బల్లెపుకఱ్ఱ లాంటిది జడత్వం - అజ్ఞానం. అంటే చిదాభాసమనే జీవునితో కూడి ఉన్నట్టి బుద్ధివృత్తినే జ్ఞానం అంటారు."బోధేచ్ఛా బుద్ధిః" అని ఆచార్యులవారు అన్నారు. చిదాభాస లేనట్టి బుద్ధివృత్తిలో ఉండే జడత్వమే అజ్ఞానమన్నమాట.

జాడ్యము అనగా జడత్వము బ్రహ్మేతర విషయముల లక్షణము.దానివల్ల విషయములు తమంత తామే తెలియబడక ఉండును.అనగా విషయములను ఈ జడత,అజ్ఞానం లేపనము వలె ఆవరించి వుండును.ఈ లేపనమును దూసికొని విషయమును గూర్చిన బుద్ధివృత్తి కలిగినప్పుడు జ్ఞానము కలుగును.బుద్ధి కూడా జడమే అగుటచే బుద్ధియందున్న చిదాభాసయే ఇనుప ములుకు వలె అజ్ఞాన లేపనమును భేదింపగలుగును. ఇట్లు చిదాభాసతో కూడిన బుద్ధివృత్తి ఆవరించుట, జాఢ్యము,అజ్ఞానము ఆవరించుట అనే రెండు విధములుగ అన్ని విషయములు తెలియబడుచున్నవి. 

అజ్ఞానము గూర్చి ఒకమాట. అదికేవలము జ్ఞానము లేకపోవుట మాత్రమే కాదు. అది స్వయముగ ఇతర ఉన్న వస్తువుల వలె పని చేయుచు, జ్ఞానమును అడ్డగించుచున్నది కనుక.
కాని అది వాస్తవముగ ఉన్నచో దానికి నాశనము లేదు.
చూ.భగవద్గీత 2 .16

అయినా జ్ఞానముచే అజ్ఞానము నశించుచున్నది. కనుక అజ్ఞానము వాస్తవముగ ఉన్నదనిగాని,లేదనిగాని చెప్పుటకు వీలుకాదు. అది సత్  అని గాని అసత్ అనిగాని నిర్వచింప వీలులేదు."సదసద్ భ్యామ్ అనిర్వచనీయమ్"- అది ఉన్నట్లు కన్పించునది మాత్రమే.
"భావరూపమ్". ఈ విధముగా జ్ఞానము,అజ్ఞానము ఈ రెంటిచేత వ్యాప్తమైన ఘటం 
జ్ఞాతంగానూ,అజ్ఞాతంగానూ కూడా ఉంటుంది.

అజ్ఞాతమైన కుంభం బ్రహ్మచేత ప్రకాశమానమైనట్లుగా ,
జ్ఞాతమైన కుంభం కూడా బ్రహ్మచేతనే ఎందుకు ప్రకాశమానం కాకూడదు ? అంటే -

శ్రీ అన్నమయ్య సంకీర్తన
శ్రీ అన్నమయ్య కీర్తన
🕉️🌞🌏🌙🌟🚩

రాగం :- భైరవి,
స్వరకర్త :-  రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ,
పాడినవారు :- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్


పరిపూర్ణుఁడవు నీకు పరాకున్నదా నిన్ను
మరిగి వుండనిదే మా వల్ల తప్పు గాకా॥


వినవా నీవేమియైనా విశ్వమెల్ల వీనులే
యెనసి విన్నవించని యెడ్డతన మింతే గాక
కనవా నీ విన్నియును కన్నులే యెందు చూచినా
పనితో నా భావము జూపని నేరమి గాకా!!


పలుకవా నీ వేమియైనా బహుశబ్దమయుడవు
అలరి పిలువని నా అవివేక మింతే గాక
నిలువవా నా ముందర నిఖిల స్వరూపుడవు
తెలిసి చూడలేని సందేహ మింతే గాక!!


మన్నించవా నీవేమి మఱుగు చొచ్చితి నంటే
పన్ని మత్తుడనై యున్న పాప కర్మము గాక
యిన్నిట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిన్నాళ్ళెఱుగని భాగ్య మిట్లుండెగాకా!!

పరిపూర్ణుండవు నీకు పరాకున్నదా!!

🕉🌞🌏🌙🌟🚩

ll పల్లవి ll
ఎంతటివారలు నెవ్వరును హరిఁ
జింతించక నిశ్చింతులు గారు!!

అతిజితేంద్రియులు ననశనవ్రతులు-
నతుల తపోధనులగువారు!
చతురానన గురుస్మరణము దొరకక
తతి నూరక పుణ్యతములుగారు!!

అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-
ననుపమ పుణ్యులు యాజకులు!
వనజోదరు ననవరతముఁ దలఁచక
వినుతి స్మృతికిని విభుదులుగారు!!
  
దురిత విదూరులు దుర్మతిహీనులు
నిరతానందులు నిత్యులును!
తిరువేంకటగిరిదేవుని గొలువక
పరమార్గమునకు బ్రహ్మలు గారు!! 
(())

శ్రీ అన్నమాచార్య సంకీర్తన

1.అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలువురు నుచ్ఛర్వాన పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

2.ఉదయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల | అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

3.పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల | వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

4.మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల | నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

5.పాలిండ్లు కదలగా పయ్యదల రాపాడ భామినులు వడినూచు వుయ్యాల | వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

6.కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల | అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

7.కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల | కమనీయ మూర్తి వేంకటశైలపతి నెకు కడువేడుకై వుండె వుయ్యాల ||

(()))
.161 & 162- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)

161 శ్లోకము:-

విశ్వామింబికే! త్వయి రుచాంపతయః కియంతో?
నానావిథాబ్దికలితా, క్షితయః కియత్యః ?
బింబాని శీతమహసాం లసతాంకియంతి? 
నైతచ్ఛవేద, యది కో విబుధో బహుజ్ఞః ?

భావము:-

విశ్వజననీ!  నీ అందు  ఎందరు సూర్యులు  కలరో, ఉప్పు , చెఱకురసము, మద్యము ఆది సముద్రములు, ఎల్లలుగా కల దేశములు ఎన్ని కలవో, ఎన్ని తేజోవంతమైన చంద్ర మండలములు కలవో, ఏవ్వరు తెలిసికోలేరు. అట్టి వారిని విబుధులు అని అనక 
అల్పజ్ఞానము కలవారనే చెప్పవలెను.

162శ్లోకము:-

అవ్యక్తశబ్దకలయాఖిల మంతరిక్షమ్
త్వం వ్యాప్యదేవి!  సకలాగమసంప్రణీతే!
నాదో స్యుపాధివశతో ధవచాంసి, చాసి 
 బ్రాహ్మీంవదంతి కవయో ముకవైభవాం త్వామ్!!     

భావము:-

ఓ దేవి!

సకల వేద తంత్ర శాస్త్రములచే చక్కగా చెప్పనడినట్లు  అవ్యక్తమైన ’ఓం’కారమై ఆకాశము అంతటా
నాదమయమై వ్యాపించి ఉన్నావు.ఆ తత్త్వమును ఆపాదించు  వాక్కు  -అనగా వేదము కూడ నీవే.
ఇట్లు కార్య కారణములు రెండు విధములుగా వాగాత్మవైన బ్రహ్మి -అనగా బ్రహ్మశక్తి-  
నీవే అని నీ వైభవమును  పండిత వర్గముకొనియాడుదురు.

(()))


163 & 164- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం

163)శ్లోకము:-

నానావిథైర్భువనకజాల సవిత్రి! రూపై
ర్వ్యా ప్తైక నిష్కలగభీరమహస్తరంగైః!

వ్యక్తం విచిత్ర యసి సర్వముఖర్వశక్తే!
సా వైష్ణవీ తవకలాకధితామునీంద్రై!!

భావము:-
ఆన్ని లోకములకు జంతువులకు తల్లీ! నీవు, కళా శూన్యమైన సంపూర్ణ బ్రహ్మ మయయై సర్వవ్యాపితము, ఏకము, సర్వకారణ శక్తి గా ఉన్నప్పుడు  జ్యోతి స్వరూపమున ఉందువు.

ఆశక్తి  కార్యావస్థ అందున్నప్పుడు  ఆ జ్యోతి తరంగములు ప్రపంచములోని సర్వ వస్తువుల 
వేరు వేరు రూపములు చేకొనును. అట్టి వ్యక్తమైన సృష్టి రూపమును ప్రసాదించు
వైష్ణవీ లేక విష్ణు మాయా అనిపిలవబడు శక్తివి నీవే.

164)శ్లోకము:-

వ్యక్తిత్వమంబ! హృదయే హృదయే తథాసి 
యేన ప్రభిన్న ఇవబద్ధ ఇవాంత రాత్మా!

సేయం కలా భువన నాటక సూత్రభర్త్రి!
మాహేశ్వరీతి కథితా తవచిద్విభూతిః!!

భావము:-

ఓ  సర్వజగన్నాటక సూత్రధారిణీ!
లెక్కలేనన్ని వ్యక్తులను తనకళా విశేషమాత్రముగా సృష్టించి వారి హృదయములలో ఉండి,
భిన్నరూపమున  భద్ధమైన వేరు వేరు ఆత్మలుగా ప్రవర్తించు సర్వాంతరాత్మ, బంధ విముక్త, 
నిత్యముక్త,,  చిత్ శక్తి స్వరూపవైన మాహేశ్వరి గా కొలవబడు శక్తివి నీవే.
((()))

165 & 166- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)

165)శ్లోకము:-

ఆహారశుద్ధివశతః పరిశుద్ధసత్వే నిత్యస్థిరస్మృతిధరే వికసత్ సరోజే!
ప్రాదుర్భవస్యమలతత్త్వ విభాసికా యా  సాత్వంస్నృ తాగురు గుహస్య సవిత్రి! శక్తిః!!   

భావము:-
 
తల్లీ! సాత్విక ఆహారముచే నిర్మల అంతః కరణము కలది, స్థిరమగు ప్రజ్ఞప్రదర్శించునది,
 వికసించిన పుండరీకము వంటి స్వచ్ఛ హృదయము కలది. శుద్ధ సత్య స్వరూపమున ప్రకాశించు నది, అయి ఆవిర్భవించు కౌమారీ తత్త్వముగా
స్మరింపబడు శక్తివి నీవే.

166)శ్లోకము:-

హవ్యం యయా దివిషదో మధురంలభంతే కవ్యం యయా రుచికరం పితరో భజంతే!
అశ్నాతిచాన్నమఖిలోపిజనోయయైవ సాతే వరాహవదనేతి కలాంబ! గీతా!

భావము:-

దేవతకు యజ్ఞమున సమర్పించు హవ్యము, పిత్రుదేవతలకు శ్రాద్ధమున సమర్పించు కవ్యము.
సమస్త జనులు భుజించు అన్నము ఏ దేవి కళాప్రసాదముగా పండితులు కీర్తింతురో ఆ వారాహి మాతవు నీవే.

((()))


142) యోగవాసిష్ఠ రత్నాకరము 

ముముక్షు ప్రకరణము / ఒకటవ అధ్యాయము / పరమార్థ వర్ణనము

1-24

యః: పుమాన్సాంఖ్యదృష్టీనాం బ్రహ్మ వేదాన్తవాదినామ్‌ 
విజ్ఞానమాత్రం విజ్ఞానవిదామేకాన్తవిర్మలమ్‌.

1-25

యః శూన్యవాదినాం శూన్యో భాసకో 
యోఽ ర్కతేజసామ్‌ 
వక్తా మన్తా ఋతం భోక్తా ద్రష్టా కర్తా సదైవ సః

సాంఖ్యదృష్టి గల వారాతనినే పురుషు డనియు, వేదాంతవాదులు బ్రహ్మ మనియు, విజ్ఞానవాదులు కేవలము నిర్మల విజ్ఞానమాత్ర మనియు, శూన్యవాదులు శూన్య మనియు వచించుచున్నారు. అతడు సూర్యాది ప్రకాశములను గూడ ప్రకాశింవ జేయువాడు; ఆతడే సదా సర్వజీవులందును వసించువాడును, తెలిసికొనువాడును, అనుభవించువాడును, చూచువాడును, చేయువాడును అయియున్నాడు.

1-26

యస్మాద్విష్ణ్వాదయో దేవాః సూర్యాదివ మరీచయః యస్మాజ్జగన్త్యనన్తాని బుద్బుదా జలధేరివ
యం యాన్తి దృశ్యవృందాని పయాంసీవ మహార్లవమ్‌ 
య ఆత్మావాం పదార్థం చ ప్రకాశయతి దీపవత్‌. 

సూర్యని నుండి కిరణముల వలె పరమాత్మనుండి విష్ణువు మొదలగు దేవతలు ఉద్భవించుచున్నారు. మఱియు సముద్రము నుండి బుడగలవలె అనంతకోటి జగత్తులాతని నుండియే జనించుచున్నవి. నదులు సముద్రంలో చేరునట్లు ఈదృశ్య సమూహమంతా అతనిలో లయమవుతున్నది. ఆ పరమాత్మ దీపమువలె తనను తాను ప్రకాశింపజేసికొనుచు పదార్థములను గూడ ప్రకాశింపజేయుచున్నాడు. 

1-27

య ఆకాశే శరీరే చ దృషత్స్వప్సు లతాసు చ 
పాంసుష్వద్రిషు వాతేషు పాతాలేషు చ సంస్థితః.

ఆతడు ఆకాశమందును, శరీరములందును, శిలలందును, జలమందును, లతలందును, ధూళియందును, పర్వతములందును, వాయువునందును, పాతాళాది లోకములందును అనగా సర్వత్ర కూడ వ్యాపించియున్నాడు.
((()))

143) యోగవాసిష్ఠ రత్నాకరము 

ముముక్షు ప్రకరణము / ఒకటవ అధ్యాయము / పరమార్థ వర్ణనము

1-28

నాశరూపోఽ వినాశాత్మా యోఽ న్తస్థః సర్వజన్తుషు 
గుప్తో యోఽ ప్యతిరిక్తోఽ పి సర్వభావేషు సంస్థితః

ఆ పరమాత్మ ప్రపంచరూపముచే నాశవంతుడై యున్నట్లు తోచినను, తన యథార్థ (ఆత్మ) రూపముచే నాశరహితుడే అయియున్నాడు: మఱియు ఆ పరమాత్మ సమస్త ప్రాణులయొక్క అంతరంగమున (అతి సూక్ష్మరూపు డగుటచే) దాగియున్నాడు. అయినప్పటికి (మహత్తర రూపుడగుటచే) ఉపాధు లన్నిటిని దాటిగూడ వర్తించుచున్నాడు. సమస్త పదార్థములందును ఆతడు వెలయుచున్నాడు. 

1-29 యశ్చిన్మణిః ప్రకచతి ప్రతిదేహసముద్గకే 
యస్మిన్నిన్దౌ స్ఫురన్త్యేతా జగజ్జాలమరీచయః.

ఆ చిద్రూప పరమాత్మయను మణి ప్రతి దేహమను పెట్టెయందును ప్రకాశించుచున్నది. ఆ పరమాత్మయను చంద్రునియందీ జగత్సమూహములను కిరణములు స్ఫురించుచున్నవి. 

1-30  కుర్వన్నపీహ జగతాం మహతామనన్త 
వృన్దం న కించన కరోతి న కాశ్చనాపి 
స్వాత్మన్యనస్తమయసంవిది నిర్వికారే త్యక్తోదయస్థితిమతి స్థిత ఏక ఏవ. 

ఆ పరమాత్మ అనంతకోటి మహామహా బ్రహ్మాండ సమూహములను నిర్మించుచు, అందనేక క్రియల నాచరించుచున్నప్పటికి వాస్తవముగ ఏమియు చేయుటలేదు. ఏలయనగా నిర్వికారమై, ఉదయాస్తమయరపాతమైనట్టి స్యాత్మయందున్నవాడై, ఆతడు ఒక్కడే అయి వెలు గొందు చున్నాడు. (రెండవ వస్తువు లేదు).

(()))

🧘‍♂️144) యోగవాసిష్ఠ రత్నాకరము

ముముక్షు ప్రకరణము / ఒకటవ అధ్యాయము / పరమార్థ వర్ణనము

1-31

అత్ర జ్ఞానమనుష్ఠానం న త్వన్యదుపయుజ్యతే మృగతృష్ణాజలభ్రాన్తిశాన్తౌ చేదం  నిరూపితమ్.

ఈ ఆత్మప్రాప్తి, సంసారభ్రాంతి నివారణా కార్యములు జ్ఞానానుష్ఠానము మఱియొకటి యేదియు ఉపయోగింపదు. మృగతృష్ణాజలభ్రాంతి నివారణమందీ విషయము నిరూపింపబడినది. (ఇది జలము కాదు, ఎండమావులు అను జ్ఞానమే ఆ జలభ్రాంతిని తొలగించుచున్నది గదా!).

1-32

నహ్యేష దూరే నాభ్యాశే నాలభ్యో విషమే న చ స్వానన్దాభాసరూపోఽ సౌ స్వదేహాదేవ లభ్యతే. 

ఈ ఆత్మ దూరమున లేదు. సమీపమున లేదు; అది అలభ్యమున్ను కాదు; విషమ ప్రదేశమందున్ను లేదు. స్వానంద ప్రకాశ రూపమగు ఈ ఆత్మ మనుజునకు స్వశరీరము నుండియే లభించుచున్నది. 

1-33

సాధుసంగమ సచ్ఛాస్త్రపరత్రైవాత్ర కారణమ్‌ 
సాధనం బాధనం మోహజాలస్య యదకృత్రిమమ్‌.

సాధుజనసాంగత్య, సచ్చాస్త్రములందు తత్పరుడై యుండుటయే జ్ఞానప్రాప్తికి, తద్ద్వారా ఆత్మప్రాప్తికి కారణమై యున్నది. అకృత్రిమ (నిత్యసిద్ధ) మగు ఆత్మయొక్క సాక్షాత్కారమే సంసార మోహజాలమును తొలగించి వేయుచున్నది.

*రోజుకో అన్నమయ్య సంకీర్తన*
*రోజూ మీకోసంచేస్తున్న సాహితీ యజ్ఞం*

*చ* అడుగరే ఈ మాట అతని మీరందరును
యెడయని చోటును యిగరించు బ్రియము II
*చ1.* పొరపొచ్చ మగుచొట పొసగవు మాటలు
గరిమ నొరసితేను కలగు మతి
సరపులు లేనిచోట చలము వెగ్గలమౌను
నొరసి పెసగే చోట నుమ్మగిలు వలపు II
*చ2.* వొలసి నొల్లని చోట వొనరపు నగవులు
బలిమి చేసేచోట పంతము రాదు
అలుకచూపేచోట అమరదు వినయము
చలివాసి ఉండేచోట చెండిపడు పనులు II
*చ3.* ననుపు లేని చోట నమ్మిక చాలదు పొందు
అనుమానమైన చోట అంటదు రతి
యనసినాడు వేంకటేశుడు నన్నింతలోనే
తనివిలేనిచోట దైవారు కోర్కెలు ఇఇ
...


*రోజుకో అన్నమయ్య సంకీర్తన*
*రాగము: కేదారగౌళ*
రేకు: 0090-4
సంపుటము: 5-353
*॥పల్లవి॥* సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల
*॥చ1॥* వనితల మనసులు కుందెన చేసిటు
వలపులు తగ నించో లాల
కనుసన్నలనెడు రోఁకండ్లను
కన్నెలు దంచెదరోలాల
*॥చ2॥* బంగారు చెరఁగుల పట్టుపుట్టముల-
కొంగులు దూలఁగనోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోలాల
*॥చ3॥* ఘల్లు ఘల్లుమని కంకణరవములు
పల్లవ పాణులకోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు-
లొల్లనె దంచెదరోలాల
*॥చ4॥* కప్పుర గందులు కమ్మని పువ్వుల-
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతిఁ దేలుచుఁ గోనే-
టప్పనిఁ బాడెదరోలాల.

*రోజూ మీకోసంచేస్తున్న సాహితీ యజ్ఞం*
*రాగము: సౌరాష్ట్రం*
రేకు: 0349-02
సంపుటము: 4-286
॥పల్లవి॥ వీధులవీధుల విభుఁడేఁగీ నిదె
మోదముతోడుత మొక్కరొ జనులు
॥చ1॥ గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగ బగ్గములు పట్టరో జనులు
॥చ2॥ ఆడే రదివో య‌చ్చరలెల్లను
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీఁడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు
॥చ3॥ శ్రీవేంకటపతిశిఖరముచాయదె
భావింప బహువైభవము లవే
గోవిందనామపుఘోషణ లిడుచును
దైవం బితఁడని తలఁచరో జనులు.


1. రచన: అన్నమాచార్య

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||
--((*))--

 2. రచన: అన్నమాచార్య

రాగం: బేహాగ్
తాళం: ఆదితాళం

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ||

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ |
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ||

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ |
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ||

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప |
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ||
--((*))--

3. రచన: అన్నమాచార్య

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ||

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ||

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ||

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ||

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ||

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||

4. రచన: అన్నమాచార్య

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ||

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ||

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు |
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ||
--((*))--

* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం. శ్రీ జి. నాగేశ్వర నాయుడు గారు.


రేకు: 61-3
సంపుటము: 1-312
రేకు రాగము: ధన్యాసి.


నందనందన వేణునాదవినోద ము-
కుంద కుందదంతహాస గోవర్ధనధరా !!


రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా!!

కమల కమలవాస కమలారమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా !!


పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నరహరి నామ పన్నగశయనా!!

🕉🌞🌎🌙🌟🚩


5. రచన: అన్నమాచార్య

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||

బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ||

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ||
--((*))--

అన్నమయ్య సంకీర్తన
*॥పల్లవి॥* అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీపతినిధానము
*॥చ1॥* కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు
*॥చ2॥* నెమ్మి నలమేల్‌మంగ నీ కాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవెంకటేశ నీభావమే భోగము.


సాధించెనే ఓ మనసా
ఆరభి రాగం-ఆది తాళం
ఘనరాగ పంచరత్న కీర్తన

పల్లవి:
సాధించెనే ఓ మనసా !!సా!!
భోదించిన సన్మార్గ వచనముల

అనుపల్లవి:
బొంకుచేసి తా పట్టిన పట్టు !!సా!!

1. సమయానికి తగుమాటలాడెనే
దేవకీ వసుదేవుల నేగించి నట్టు !!సమ!!

2. రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సంప్రదాయకుడు !! సమ!!

3. గోపిజన మనోరధ మొసంగలేకనే
గేలియు జేసేవాడు !!సమ!!

4. వనితల సదా సొక్క జేయుచును
మ్రొక్కజేసే పరమాత్ముడదియు గాక,
యశోద తనయుడంచు ముదంబునను
ముద్దు పెట్ట నవ్వు చుండు హరి !!సమ!!

5. పరమ భక్త వత్సలుడు
సుగుణపారావారుండా జన్మమ
నఘుడి కలి భాదల డీర్చువాడనుచు
నే హృదంబుజమున జూచుచుండగా !!సమ!!

6. హరే! రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేషశెయన పరనారీ సోదరాజ విరాజ తురగరాజ
రాజనుత నిరామయాప ఘన సరసీరుహ దళాక్ష
యనుచు వేడుకున్నను తాబ్రోవకను !!సమ!!

7. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంభరధర లసన్మకుట కుండల విరాజిత
హరేయనుచునే పొగడగా త్యాగరాజగేయుడు
మానవేంద్రుడైన రామచంద్రుడు !! సమ !!

8. సద్భక్తుల నడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే, అలుగ వద్దననే
విముఖులతో చేరబోకుమనెనే, వెతగల్గిన తాళుకొమ్మనెనే,
దమశమాది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంతరాకనే !!సమ!!



అన్నమయ్య కీర్తన
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ||
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ||
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ||

 *ఓం నమో వేంకటేశాయ* 

((())))

* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం. శ్రీ జి. నాగేశ్వర నాయుడు గారు.


రేకు: 61-3
సంపుటము: 1-312
రేకు రాగము: ధన్యాసి.


నందనందన వేణునాదవినోద ము-
కుంద కుందదంతహాస గోవర్ధనధరా !!


రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా!!

కమల కమలవాస కమలారమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా !!


పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నరహరి నామ పన్నగశయనా!!

((()))

పున్నాగవన మిత్రబృందమునకు స్థిరవాసర శుభాకాంక్షలు
శ్రీ అన్నమాచర్య కీర్తన
ఏపురాణముల నెంత వెదికినా | 
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
వారివిరహితములు అవి గొన్నాళ్ళకు |
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
కమలాక్షుని మతిగాననిచదువులు |
కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములే కాని వితథముగావు ||
శ్రీవల్లభుగతి జేరనిపదవులు |
దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు |
పావనము లధికభాగ్యపుసిరులు ||
*ఓం నమో వేంకటేశాయ* 

అన్నమయ్య సంకీర్తన

అయ్యో వారిభాగ్య మంతేకాక

నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు !!

॥పల్లవి॥


దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా

సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు

యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా

కావరపు జీవునకు గతుగతుకే!! 

॥అయ్యో॥


హరి శరణంటేఁ గాచే‌ అట్టియుపాయమే వుండఁగ

విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ

పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా

అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను!! 

॥అయ్యో॥


యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను

అక్కటా మూఢున కెందు ననుమానమే

మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి

తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే!! 

॥అయ్యో॥

((())))

 అయ్యో వారిభాగ్యమెంతో అంటే వారి ప్రాప్తం. భాగ్యమునకు నోచుకోని వారు వెన్నచేతిలో వున్నా నెయ్యి యెక్కడున్నాదా అని వెదకుతూనే వుంటారు. పరమాత్మ ప్రస్ఫుటంగా దిక్కులన్నిటా నిండి వుండగా నాస్తికులకు శూన్యముగానే తోస్తుంది. వానలు బాగా కురిసే యేరు యెంత వ్యర్ధంగా పొర్లిపారినా గర్వంతో నీటిని పట్టి దాచుకోని అహంకారులైన జీవులకు చివరికి మిగిలేది నాకి నాకి నోరుతడుపు కోవడమే మిగులుతుంది. హరిని శరణని సుఖంగా వుండటం యెంత తేలికైన వుపాయము కాని హరిపట్ల విరక్తి కలవారికి గర్వమే అధికమౌతుంది. 

బప్పుగా నరులకు పట్టపగలే ఉండగా తెలిసికొన్ని అంధకారమనే మాయలో గడుపుతారు. ఇక్కడ శ్రీవేంకటేశుడి ఎదుటనే వుండగాను అక్కడ మూర్ఖుడి అనుమానమే. మక్కువతో అమృతం త్రాగించబోయినా గర్విష్ఠి అయిన యువకుడికి అది పట్టక పెంటదిబ్బల్లో తిరుగుతుంటాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.

((())) 

 6. రచన: అన్నమాచార్య


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||

(())

శ్రీ శ్రీనివాస గానామృతం

దైవానుగ్రహముతో :- సాహిత్యం, సంగీతం, గానం. డా కట్ల. శ్రీనివాసాచార్యులు

భక్తి లేదు నాకు ప్రభువిరక్తి లేదు నాకు

శక్తి హీనుడనన్నిట శరణంటి ఏలుకో హరీ!!


బంధములలోన చిక్కి బడలికతో యున్నాను

బందీనై ఇంద్రియముల బానిసైనాను

మందమతినై నిను మరచి మనుచున్నాను

ఇందిరనాథ నన్నిక నీవే రక్షించవే!!


అరిశడ్వర్గములు నన్ను ఆవహించే యున్నవి

పరిపరివిధముల మనసును పాడుజేయుచున్నవి

కొరగాని కోర్కెలెన్నో కొనసాగుచునే యున్నవి

నరాధముడనైతీ హరీ నన్ను ఆదుకోవే!!


కల్ముశములెన్నో మదిలో కొనసాగుచు యున్నవి

పలు కోర్కెల వెంట మదిపరుగు బెడుచున్నది

నిలిచియుంటి నిష్ఠతోడ శ్రీనివాసా దాసుడనై

తెలిసిన దిక్కెళ్ళ నీవే తగురీతి బ్రోవవే!!

(()))

శ్రీ అన్నమాచార్య సంకీర్తన

రేకు: 257-2

సంపుటము: 3-327

రేకు రాగము: లలిత.

పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి

యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా!! 

॥పల్లవి॥

కామినులఁ జూచిచూచి కన్నులఁ గొంతపాపము

వేమరు నిందలు విని వీనులఁ గొంతపాపము

నామువారఁ గల్లలాడి నాలికఁ గొంతపాపము

గోమునఁ బాపము మేనఁ గుప్పలాయ నివిగో!! 

॥పుట్టి॥

కానిచోట్లకు నేఁగి కాఁగిళ్ళఁ గొంతపాపము

సేన దానాలందుకొని చేతులఁ గొంతపాపము

మానని కోపమే పెంచి మతిఁ గొంతపాపము

పూని పాపములే నాలోఁ బోగులాయ నివిగో!! 

॥పుట్టి॥

చేసినట్టివాఁడఁగాన చెప్ప నీకుఁ జోటులేదు

దాఁసుడ నే నైతిఁ గొన దయ దలఁచితివయ్య

యీసరవులెల్లఁ జూచి యేమని నుతింతు నిన్ను

ఆసల శ్రీవేంకటేశ ఆయఁబోయఁ బనులు!!

॥పుట్టి॥


భావం:-

పుట్టినది మొదలు ఏ పుణ్యమూ చేయలేదు. ఇందిరానాథా నన్నిక ఎట్లు రక్షిస్తావయ్యా. కామ భావనతో స్త్రీలను చూచి చూచీ నా కన్నులు కొంత పాపము మూటగట్టుకొన్నాయి.

నాలుక పిడుచకట్టు కొన్నా అబద్ధములాడి ఆడీ నా నాలుక కొంత పాపము చేసింది. ఇదిగో యీ విధంగానే నా పాపము కుప్పలా పేరుకుపోయింది.

 వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి వెళ్ళి నా కాళ్లు కొంత పాపము పోగుచేసికొనినవి. పట్టకూడని దానములను పట్టిపట్టీ నా చేతులు కొంత పాపము అంట కట్టుకొన్నాయి.

మానుకోలేని కోపమును పెంచి పోషించి నా మనస్సు కొంత పాపము చేసింది. ఇదిగో ఈ విధంగా పూని పనిలేక చేసిన పాపాలు నాలో రాశివలె అయినవి. ఇదీ అదీ అని లేకుండా అనేక పాపాలను చేశాను కాబట్టి నీకు చెప్పే చోటు కూడా లేదు. అందుకే నిన్ను శరణు జొచ్చి నీ దాసుడనయ్యాను. నన్ను దయదలచవయ్యా నా యీ పద్దతులు తెలిసి కూడా నిన్నేమని ప్రార్థించగలను శ్రీవేంకటేశ్వరా అయిందేదో అయింది ఇక నీవే దిక్కు అంటు అన్నమయ్య కీర్తించాడు.


 *శ్రీ అన్నమయ్య  సంకీర్తన*

🕉️🌞🌏🌙🌟🚩


గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు


రేకు: 225-4

సంపుటము: 3-141

రేకురాగము: వసంతవరాళి.


నారాయణుఁడీతఁడు నరులాల

మీరు శరణనరో మిమ్ముఁ గాచీని!!


తలఁచిన చోటను తానే వున్నాఁడు

వలెననువారి కైవసమెపుడు

కొలచెను మూఁడడుగుల జగమెల్లాను

కొలిచినవారిఁని చేకొనకుండునా!!


యెక్కడఁ పిలిచినా ఏమి అని పలికి

మొక్కిన మన్నించు మునుముగను

రక్కసుల నణఁచి రక్షించు జగములు

దిక్కని నమ్మినఁ తిరముగా నేలఁడా!!

 

చూచిన యందెల్ల చూపును రూపము

వోచికఁ  పొగడిన వుండు నోటను

యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట

చేచేతఁ పూజింప సేవలు గొనఁడా!!

*నారాయణుఁడీతఁడు నరులాల..*

 భావము:-

- శ్రీ అమరవాది సుబ్రమణ్య దీక్షితులు గారు

     శ్రీమన్నారాయణుని భక్తితో కీర్తిస్తూ అన్నమాచార్యులవారు శరణాగతితో ఈ కీర్తన వినిపిస్తున్నారు. భక్తులు ఆయనను ఎక్కడ స్మరిస్తే అక్కడే వున్నాడు. తనే కావాలన్న వారికి తాను లొంగివుంటాడట.

 భక్తి అనే తాడుతో తప్ప యెన్ని తాళ్ళు తెచ్చినా ఆయన్ని కట్టలేమని యశోద తెలుసుకొన్నది. దుర్యోధనుడూ తెలుసుకొన్నాడు. దిక్కని నమ్మినవారు యెక్కడికి పిలిస్తే... అక్కడికి వస్తాడు. ఎక్కడ చూచిన అక్కడే తన రూపం చూపే ఆయనే... మన శ్రీవేంకటేశ్వరుడు "చేచేత పూజింప సేవలు గొనడా?” అంటున్నారు.

     ఓ నరులారా! ఈ మహానుభావుడే నారాయణుడు. మీరు ఈయనే దిక్కని శరణు వేడండి. మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు.

1. ఈ దేవదేవుడు తలచిన చోటనే వున్నాడు. తానే వున్నాడు. స్వయంగా తానే వస్తాడు. తనను ఎవరు ప్రేమిస్తే వారికి కైవసమై (లొంగిపోయి) వుంటాడు. సమస్త భువనాలను మూడంటే మూడు అడుగులు (పాదాలు) పెట్టి కొలిచిన వాడు, కొలిచిన వారిని (పూజించినవారిని) చేకొనకుండునా?

2. ఈ సర్వేశ్వరుడు ఇక్కడా, అక్కడా అని చూడడు. ఎక్కడకు పిలిచినా వస్తాడు. రావటమే కాదు, ఏమి... యెందుకు పిలిచావు అని మరీ కనుక్కొంటాడు. "మొక్కిన మన్నించు మునుముగను"... (అంటే... అంత హడావుడిగా యెందుకు పిలిచావని విసుగుకొనకుండా వరుసగా మన్నిస్తాడట...). హిరణ్యకశిపుని వంటి రాక్షసులు బారినుండి కూడా తన భక్తులను కాపాడుటకు, వచ్చి రక్షిస్తాడని ఋజువయింది కదా! జగద్రక్షకుడు దిక్కని నమ్మినవారిని, తిరముగా నేలడా? (స్థిరముగా రక్షించడా?)


3. ఈ శ్రీహరి 'ఇందుగలడందులేడని సందేహము వలదు'... అన్నట్లు తన రూపము చూచిన యందెల్ల చూపును. ఓచిక పొగడిన (ఉచితమైన రీతిగా కీర్తించిన) ఆ కీర్తించిన వారి 'నోటి' యందే వుంటాడు. అంటే పలుకులోన పలుకు దైవము అన్నమాట. అటువంటి ఈ శ్రీమన్నారాయణుడు వేరెవరోకాదు, యేచిన శ్రీవేంకటేశ్వరుడే (అతిశయించిన తిరుమలాధీశుడే). మరి... చేచేత పూజింప (చేతులారా పూజిస్తే) మన సేవలు గొనడా? (తప్పక స్వీకరిస్తాడు).



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ