***


Mandala design 1

1. ఆవకాయ మీదొట్టు 

2. పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు


3. కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు
4. నారద లీల
5.  పదవి కోసం పెన్షన్లు,

6.  పెంపుడు కుక్క
7. అంకితం:
8. * ఒక మంచి విషయము*
9. త్రికరణశుద్ధి కధ  
10. మా  నాన్నే..  నాకు  గొప్ప అమ్మ



1. ఆవకాయ మీదొట్టు 

 ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా 🤗

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"
ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"
ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---
"గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

ఆవకాయ తినగానే కలిగే ,  అలౌకికానందం---"కేతువు"
తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"
ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"
ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.

 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు,
మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
 
〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును,
గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!
--(())--

2. పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు

 మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం

 ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

 జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం

 ఫలితం: దీనివల్ల (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
 కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం

తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం

ఫలితం: దీనివలన
బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు

 బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

 బఫే భోజనాలు

ఫలితం:
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం*
వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం

ఫలితం:
దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పక పోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచన తో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే టట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. 🙏
-(())--

3. కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు...😜

2.మనకు అర్థం కాకున్నా భద్రంగా  దాచుకునేది ఏది?
  డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్...🤓

3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి...😩

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు😜

5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి...😲

6.పొలాలు అభివృద్ధి చెందితే?
 ప్లాట్లు అవుతాయి🙁

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేషెంట్  చెప్పినప్పుడు..😫😜😜😂😂 ********
“SORRY “
అనే పదము చాలా
చిత్రంగా  ఉంటుంది...
మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.
అదే  డాక్టర్  చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు....!😂
******** ప్రపంచంలో
రెండు అతి ప్రమాదకరమైన
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
😜😜😜🤣🤣🤣
********
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
కానీ ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
😄😄😄😄😄😀
********
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు  వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ 😜😜
********
మీరు నవ్వుకోవడం కాదు అందరికి పంపండి
--(())--


4. నారద లీల

శ్రీ- అంటే, స- అంటే, తి- అంటే ? నారదుడికి ముగురమ్మల మంత్రం ఏంటది..?

ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.

ఇంకేం.. కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి 'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. త్రిమూర్తులైన భార్యలైన మీరు ముగ్గురూ, సకలలోక వాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.

ముందు సరస్వతీ దేవి నారదునితో.. నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.

ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు... వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.

పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.

ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటోంది. ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటోంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు.

ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితులు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ..ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు. అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.
శ్రీ లక్ష్మిలోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. అదే ''ఓం శ్రీసతియే నమః' అనే మంత్రం పుట్టిన కథ.

--(())--

5.  పదవి కోసం పెన్షన్లు,
 పదవి కోసం పెన్షన్లు, ఋణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా?

వెనుజులా చరిత్ర చదవండి. మారండి


చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధి గా ఆయిల్... 1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో... ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికీ, బీద కుటుంబాలకీ నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ‘ధర పెరగని రొట్టె ముక్క’ అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, బ్రెడ్, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూత పడి పోయాయి. More than three million rich industrialists, skilled workers and intelligent students have left the country. ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తూన్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు.

 హ్యాపిగా తినటం, ప్రభుత్వo ఇచ్చే భ్రుతి తో ఆనందించటం..! ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీలకోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించ లేదు. 2005 లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసా విలువ లేని డబ్బు..! 2018 వచ్చేసరికి ఇన్-ఫ్లేషన్ 13,00,000% అయింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూ లో జంతువులన్నీ చచ్చి పోయాయి. వెనిజుల ముఖ్యపట్టణం పేరు కారకాస్. Carcass అంటే జంతువు కళేబరం. (The dead body of an animal). ప్రతి ఏటా, ఆ నగరంలో ప్రతి లక్షమంది జనాభాలో లో 20 వేలమంది మర్డర్లకి గురి అవుతున్నారు. ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా, ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. టూరిస్టులని ఆదేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకొక కేవలం గంట నీళ్ళు. షాపుల్లో చివరికి టూత్-పేస్ట్ లేదు. ఉన్నా కొనటానికి డబ్బు లేదు. తినటానికి తిండి లేని వారి సంఖ్య అయిదేళ్ళలో 30 నుంచి 66% కి పెరిగింది. చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు... ఇదీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి.

సమ సమాజం కావాల్సిందే.

కానీ ఉచితం గా ఇవ్వటం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులని రిజెక్ట్ చెయ్యాలి.

ఈ దేశ ఉదాహరణ గురించి అందరికీ చెప్పండి....మనదేశ ఎన్నికల విధానంలోనే పెద్ద లోపం ఉంది..
కేవలం  ఓటు హక్కును వినియోగించు కోవడం ద్వారా దేశ భవిష్యత్తుని మార్చలేము.

మార్పు నాయకులలోనో, పార్టీలలోనో కాదు..

రావాల్సింది....ప్రజల్లో
🙏🙏🙏

6.  పెంపుడు కుక్క

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి  సౌకర్యంగాలేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయల వారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి "మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను" అన్నాడు. సరేనన్నారు రాయలవారు.
             వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకు పోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయల వారు "ఏం మాయ చేశావు రామకృష్ణా" అని అడిగారు.
              రామకృష్ణ నవ్వేసి "మహారాజా లోకంలో అందరూ
తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశ పడతారు. నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్ధమయి కుక్కకి జ్ఞానోదయం అయింది."
అన్నాడు.
            " అలా మనదేశంలో కూడా ఊరికే మొరుగుతూ గంతులు వేసే కుక్కల్ని సిరియా, ఇరాక్, పాకిస్తాన్ ల్లో పారేసి ఆరునెలల తర్వాత వెనక్కి తీసుకొస్తే ముడుచుకుని ఒక మూల పిల్లుల్లా పడుకుంటాయి" అని ముగించాడు అందరి కరతాళ ధ్వనుల మధ్య!!


--(())--

7. అంకితం:

 మనదేశంలో వుంటూ మనదేశంలో తింటూ మనదేశాన్ని తిట్టే కుక్కలకి!
“పాపమయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చుచేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం చేస్తూ కాలాన్ని నిందించకండి,
అర్థం చేసుకోకుండా అవమానపర్చకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి, కోపంగా 10 మాటలు కాదు ప్రేమగా ఒక్క మాట చాలు, ఎంత సీనియారిటి అన్నది కాదు ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం, ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం, ఏమి సాదించామన్నది కాదు ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం, మరియు ఎంతో మంది స్నేహితులన్నది కాదు ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం” ఎవరు పంపారా అని కాదు సత్యమా అసత్యమా ఇది ముఖ్యం

--(())--

8. * ఒక మంచి విషయము*

నేను ద్రాక్ష (అంగూర్) పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।

నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  "కిలో 80 సర్।"
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  " మరి వీటి ఖరీదెంత?"
పండ్లతను : "30 రూపాయలకు కిలో సర్"
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"

అప్పుడు నాకు అర్థమైంది... సమాజము,సంఘముమరియు కుటుంబమునుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।

దయ చేసి మీ కుటుంబము *సమాజము మరియు *మిత్రులతోఎప్పుడు టచ్ లో ఉండండి.....

పవిత్రమైన స్నేహాన్ని స్నేహం లాగే చూడండి దానికి ఎటువంటి చెడుని ఆపాదించకండి....
        
ఈ జన్మకే....
 ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ.. ఇరవై ..........సంవత్సరాలు !
తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న!
బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.

అదే  నిలుపుకోవాలంటే  ?
 
ప్రియమిత్రులందరికీ  వందనములు తను  చిన్నతనంనుండీ  కనీసం  చదువు కోవడానికి
డబ్బులేక .  తమ  కనీస  అవసరాలు  కూడా  తీర్చు కోలేక  ,  వారు   గడిపిన  భయంకర  అవస్థలు తమ పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ , ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే , తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు
తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు

"  పెద్దాడికి  ఎక్కువ ఇచ్చి  మా  నాన్న మాకు అన్యాయం చేసాడనో , నా  స్వార్జితం  నాకు  దారిన పోయే  దానయ్య  కైనా రాసే  హక్కు  నాకుంది  అంటూ  మా నాన్న  తన ఆస్థి  అంతా  మా  అక్కకు  రాసారనో  , మా  ఇంట్లో  ఉంటూనే  మా  అమ్మ  తన  జవహరి అంతా  ఇద్దరు  కూతుళ్ళకు  దోచి  పెట్టి  కోడళ్ళకు అన్యాయం  చేసిందనో  , ఇలా  వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ , బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా  తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ ,  తన అశాంతితో జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .

ఎవరి  కోసం  ?
ఎందు  కోసం ?
దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?

జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు , అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం  అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా  జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి ,  వివాహాలకు కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా , ఎవరు ఎవరికి  హాని  చేస్తారోనని  అనుక్షణం  భయపడుతూ  , చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని
శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా? ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.

కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా  ఈ  ఆస్థి పంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు. ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.

మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?

  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం .

దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...

కోర్టులు  పరిష్కరిస్తా యనుకుంటే  ఫలితం  శూన్యం ధన నష్టం  ఒకరి  మీద  ఒకరు  అబద్దపు  వ్యక్తిగత దూషణలు  చేసుకుంటే  సన్నని  దారులు  కూడా  శాశ్వతంగా మూతపడతాయి .
ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు

రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు. 
సర్వేజనా సుఖినోభవంతు
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞



9. త్రికరణశుద్ధి కధ 
 
ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతు కనిపించాడు..

నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ?

మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహము కలిగినది.

వెంటనే మారు వేషం లో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు.

రైతు నాకెందుకో ఈ రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను
అన్నాడు.

ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు.

కాని రైతు దున్నడము మానలేదు.

ఇంద్రునికి కోపము వచ్చిన్ది.

వరుణుడి ని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు.

వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రమ్ నేను ఏమీ చేయ్యలేనన్నాడు..

పవనుడి ని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకుడదు అని చెప్పాడు.

దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు.

ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు ,
కప్పల నాయకుడు మేము ఈ రోజు అస్సలు అరవము...

కానీ మినుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు..

ఇంద్రుడు వాటినీ పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు,

అవి సరే మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి.

ఇంద్రుడు ఇంక వర్షం యెలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు..

కానీ ఆ రాత్రి వర్షం కురిసింది..

ఇంద్రునికి అవమానం తొ పట్టరాని కోపము వచిన్ది. అందరినీ పిలిపిన్చాడు.

వరుణుడు చల్లగాలి వీచిన్ది మహరాజ అన్నాడు..

పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నడు...

కప్పలు మినుగురులు మిణుకు మిణుకు మని మేరవడమ్ వల్లే అరిచాము అన్నవి..

మిణుగురు పురుగులు మేము మాత్రమ్ అస్సలు బయటకు రాలేదు అన్నవి...

ఇంద్రుని కి ఏమీ జరిగిందో పాలుపోలేదు..

నారదుని కి విన్నవించారు. నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు.

ఆ రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించు కొని దున్నుతూ ఉన్నారు..

ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులను కొని పొరపాటు పడ్డాయి..

కప్పలు అరవడం తొ చల్లటి గాలి వీచిన్ది...

దానితో వర్షం కురిసింది అని చెప్పాడు..

కష్టాన్ని నమ్ముకొన్న వారు ఎన్నడూ నష్టపోరు.

నీవు చేసే పని లో  నీతి నిజాయితి వుంటే విది సైతం తల వంచ వలసిందే,

త్రికరణశుద్ధి తో నీ విదిని నీవు నిర్వర్తించు ఫలితం పై వాడికి వదిలివేయి నీకు అంత శుభమే జరుగుతుo ది.🙌🔺

🔱🕉🔱🕉🔱🕉🔱🕉🔱🕉


10. మా  నాన్నే..  నాకు  గొప్ప అమ్మ
.
.

గంగాధరం !  నిన్ను  ప్రిన్సిపాల్  మేడం  పిలుస్తున్నారు !

ఆయా  వచ్చి చెప్పిన  మాటలకు  ఎండలో  మొక్కలకు  పాదులు చేస్తున్న గంగాధరం  అదిరిపడ్డాడు.

“దేనికి ?” అడిగాడు  అయాను
ఏమో !  నాకేం  తెలుసు ? అంటూ  వెళ్లిపోయింది  ఆయా.

చేతులకు  ఉన్న  మట్టిని   గబగబా..  కడిగేసుకుని, తలపాగా  విప్పి  చెమటలు  కారుతున్న  ముఖాన్ని  తుడుచుకున్నాడు.

వడి వడిగా అడుగులు  వేస్తూ   కారిడార్  చివరన  ఉన్న   ప్రిన్సిపాల్  రూమ్  వైపు వెడుతున్నాడు.. అతని  మనసులో  ఆందోళన. “ ఏమి  జరిగింది ?  మొక్కల  గురించా? ఎక్కడైనా  పొరపాటు  చేశానా? లేక  తన  పిల్ల  ఏమైనా  తప్పు  చేసిందా?  ఎవరినయినా  కొట్టిందా?  అలా  చెయ్యదే!  ఏమి  జరిగింది?  ఇన్ని  రోజులుగా  ఒక్కసారీ..  ఎప్పుడూ  తనను  పిలవని   ప్రిన్సిపాల్   మేడం  ఎందుకు  పిలిచారు?” తడబడుతున్న అడుగులతో.. గుమ్మం   దగ్గరకి  వెళ్ళాడు.

చిన్నగా  స్ప్రింగ్  డోర్   మీద  శబ్దం  చేశాడు.

“అమ్మగారండీ !”  లో  గొంతుకతో  పిలిచాడు.

“లోపలికి   రా !”   ప్రిన్సిపాల్  గొంతు  అధికారికంగా  వినిపించింది. అతనిలో   ఆందోళన  పెరిగిపోయింది.

కళ్ళజోడు పెట్టుకుని, తెల్లని  జుట్టుతో కాటన్ చీర కట్టుకుని హుందాగావున్న  ప్రిన్సిపాల్ మేడమ్ ని  చూడగానే  వంగి నమస్కరించాడు.

ఆమె  టేబుల్  మీద  ఉన్న  ఒక  కాగితం  తీసి  అతనికి  ఇస్తూ..  “ చదువు”  అంది

వణికిపోయాడు  గంగాధరం

“ మేడం  నేను చదువుకోలేదు. నాకు  ఇంగ్లీష్  రాదు.  తెలుగు  కూడా రాదు. ఏదైనా పొరపాటు  చేస్తే  మన్నిచండమ్మా!  తప్పు  చేస్తే  ఇంకొక్క  అవకాశం  ఇవ్వండమ్మా..!
దీనంగా  అన్నాడు గంగాధరం.

అతడి  కళ్ళల్లో  నీళ్ళు  ఆగడం  లేదు.

“ మీ దయవలన   నేను  నా  కూతురిని  ఇక్కడ  చదివించుకుంటున్నానమ్మా..  పొమ్మని మాత్రం అనకండమ్మా...  దాన్ని  ఇలాంటి  స్కూల్  లో  నా  జన్మలో  చేర్చలేను ! పొమ్మని  అనకండమ్మా ”  వణికిపోతున్నాడు .

“ అరెరే !  ఏదేదో  ఊహించేసుకోకు!  మేము  నీ  పిల్లకి సీటు  ఇచ్చింది  ఆమె  తెలివి  తేటలు  చూసి,  నువ్వు  మా  సిన్సియర్ వర్కర్ వి కూడా  కాబట్టి.  ఈ  కాగితం  నీకు  చదివి  పెట్టడానికి  టీచర్  గారిని  పిలుస్తా..వుండు  !  ఇది  నీ  కూతురు  రాసిందే !  నీకు  చదివి  వినిపించాలని  అనిపించి  నిన్ను  పిలిపించాను.  ఇది  నువ్వు  వినాలి.” 

ప్రిన్సిపాల్ గారి  పిలుపు  విని  సరోజ  టీచర్  అక్కడకి  వచ్చింది.  ఆమె ఆ  పేపర్  తీసుకుని  చదవడం  మొదలు  పెట్టింది...

“ ఈ రోజు  మా క్లాసులో  మాతృదినోత్సవం  గురించి  వ్యాసం  రాయమన్నారు . .

“ నేను   ఒక  పల్లెటూరిలో పుట్టాను.  అక్కడ  ఇప్పటికీ  విద్య  వైద్యం అనేవి  రెండూ ప్రజలకు  సమీపంలో ఎక్కడాలేవు. పిల్లలను  కనడం  అంటే  అక్కడి ఆడవాళ్ళకు  మళ్ళీ  పుట్టడమే..  పిల్లలను  కనలేక పురిటిలోనే  చనిపోయే తల్లులు  ఎక్కువ  మా  ఊరిలో.

అలాగే  మా  అమ్మ  నన్ను  కంటూ  తను  కన్ను  మూసింది.
నన్ను  తన  చేతుల్లోకి  తీసుకోకుండానే., తన దగ్గర  పాల రుచిని నేను గుర్తు  పెట్టు  కోకుండానే  పురిటిలోనే  కనుమూసింది.

నన్ను  తన  చేతులలోకి  తీసుకున్నది  అప్పటికీ  ఇప్పటికీ  మా నాన్న  ఒక్కడే !
తల్లిని  చంపి   పుట్టాను  అన్నారు. "శనిగొట్టుదానిని"  అన్నారు. ఎవ్వరూ  నన్ను  కనీసం  ఎత్తుకునేవారు కారు.

నాన్నను  మళ్ళీ  పెళ్లి  చేసుకోమని  అమ్మమ్మ,  నాన్నమ్మ ,  తాతలూ  అందరూ  బలవంతం  చేశారు, కొడుకును  కనమని.

ఎందరు  ఎన్ని  రకాలుగా  చెప్పినా  నాన్న  వినలేదు . 

ఆ ఊళ్ళో  ఉంటే  వాళ్లందరూ అలాగే  బలవంతం  చేస్తారని., ఉన్న  ఇంటినీ.,  పొలాలనూ., అన్నిటినీ.. వదిలి..  రోజుల  పిల్లనైన నన్ను ఎత్తుకుని..  నాకు  అన్నీ తానే కావాలని, తనకు  అక్కడ  ఉన్న  అన్ని  సౌకర్యాలనూ వదిలిపెట్టి..  వట్టి  చేతులతో..,  నా దురదృష్టం  మీద  బాధతో.,  నా మీద  ప్రేమతో.,  నన్ను  పెంచాలి   అనే  కసితో  ఈ  పట్టణం  వచ్చేశాడు.

చిన్నప్పుడు  నాకోసం ఎన్నెన్ని  కష్టాలు  పడివుంటాడో !

ఇప్పుడు  తలచుకుంటుంటే  అనిపిస్తుంది .

ఒక్కటే   రొట్టె  ఉంటె  తనకు  రొట్టెలు  ఇష్టం  ఉండవు  అనేవాడు.
నాకు  ఇప్పుడు  తెలుస్తోంది
నా  ఆకలి  తీరితే  తన  ఆకలి  తీరిపోయినట్లు.. తను  పస్తులు  ఉంటూ  నాకు  తినిపించేవాడు  నాన్న ..
అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి.

తన శక్తికి  మించి  నాకు  ఎన్నో  సదుపాయాలు  కల్పించాడు నాన్న .

నన్ను ఈ స్కూల్  లో  చదివించడం కోసం  ఇక్కడ  తోటమాలిగా చేరాడు.

ప్రేమ  ఆప్యాయత  అనేవి  అమ్మకు  మారుపేర్లు  అయితే అవి  నేను  పొందుతున్నది   నాన్న  నుండి.

త్యాగం అమ్మకు  ప్రతిరూపం  అయితే..  మా నాన్న  త్యాగానికి  నిర్వచనం.

మా  నాన్నే నాకు గొప్ప అమ్మ

ఈ  మాతృదినోత్సవం  సందర్భంగా  నేను  నాన్న గురించి కాకుండా ఇంకేం రాసినా  నాకు సంతృప్తి అనిపించదు.
ఇంకా  ఈ స్కూల్  లోనే  ఉన్న  తోటమాలి  నాతండ్రి  అని  గర్వంగా  చెప్పుకుంటా ..
నాన్న  నీళ్లు  పోసే ఈ మొక్కల్లో  నాన్న  కోల్పోయిన  మా  అమ్మ  నాకు  కనిపిస్తుంది.

ఈ  వ్యాస  రచనలో   నేను  ఫెయిల్  కావచ్చు .  నా టీచర్  కి  ఇది  నచ్చకపోవచ్చు .

కానీ  నిస్వార్ధ  ప్రేమకు  ప్రతిరూపం  అయిన  నా  తండ్రికి  ఇది  నేను  అర్పించే   కృతజ్ఞత.

చదువుతున్న  సరోజ  టీచర్  గొంతులో కన్నీటి  జీర !

వింటున్న  ప్రిన్సిపాల్   చీర  చెంగుతో   కళ్ళను  అద్ధుకుంటోంది.

గంగాధరం  వెక్కి  వెక్కి  ఏడుస్తూ..  ఏడుపు  దిగమింగు  కుంటున్నాడు.

ఆ  ఎ.సి .  గది  నిశ్శబ్దంగా  అతడి  వెక్కిళ్ళ చప్పుడు   వింటోంది.

ఆ  పేపర్లను  సరోజ  టీచర్ నుండి.. వణుకుతున్న చేతులతో అందుకుని.. గుండెలకు  హత్తుకున్నాడు.

నిలబడలేక  పోతున్నాడు.

ప్రిన్సిపాల్  మేడం  అతడికి  దగ్గరగా  వచ్చింది. కుర్చీ  దగ్గరకి  తీసుకు  వెళ్ళింది .  కూర్చో బెట్టింది   తన టేబుల్  మీద   ఉన్న  గ్లాసులో  నీళ్ళను  అతడి  చేతికి  ఇచ్చింది.

ఆమె  గొంతులో  ఏదో  తెలియని  ఆర్ద్రతఁ !

“ గంగాధరం ! "..
మీ  అమ్మాయి  రాసిన  ఈ వ్యాసానికి  మేము  10/10  మార్కులు  ఇచ్చాము. మాతృదినోత్సవం  సందర్భంగా  ఇంతకంటే   గొప్ప  వ్యాసం  ఎవరూ  రాయలేరు. ఎందుకంటే . .
ఇది  ఒక  కూతురు  తన  నాన్నలో అమ్మ ప్రేమని చూస్తున్న అనిర్వచనీయమైన  అనుభూతికి అక్షరరూపం.   మేము  రేపు  మన స్కూల్  లో   మాతృదినోత్సవం  జరపబోతున్నాము.  దానికి  ముఖ్య అతిధివి  నువ్వే !

నిన్ను  మించిన  తల్లి   ఇంతవరకూ  మా స్కూల్   చరిత్రలో  మాకు  తెలీదు. అందుకే  నీకు సత్కారం  చెయ్యాలని నిర్ణయించుకున్నాం.
నీ అంగీకారం కోసమే  నిన్ను  పిలిపించాను .”  అంటూ..

“ మేము  ఈ   సత్కారం  చెయ్యడానికి   ముఖ్య  కారణం    పిల్లలను  తల్లులే  కాదు  తండ్రులు  కూడా  అమితంగా  ప్రేమిస్తారు.. పిల్లలకోసం  త్యాగం చేస్తారు..  అనే  విషయం  అందరికీ  తెలియాలని.

నిన్ను  గౌరవించడం  ద్వారా  మీ  అమ్మాయి  తన  తండ్రి  ప్రపంచం  లోనే  గొప్పతల్లి  అన్న  మాటలను  నిజం  చెయ్యాలీ  అని.,  ఆ తండ్రి
మా  స్కూల్  లోనే ఉన్నాడు  అని  పిల్లల  తల్లిదండ్రులకు  చెప్పాలని.

నువ్వు   మనబడి  తోటలో   పూల చెట్లను  కాపాడే  తోటమాలివి  మాత్రమె  కాదు.

" నువ్వు  అంగీకరిస్తే  రేపటి  మన స్కూల్  మాతృదినోత్సవ  సభలో సత్కారం అందుకునే గొప్ప అమ్మవి. మాకు  ముఖ్య  అతిథివి ! ”

గంగాధరం..  ప్రిన్సిపాల్  మేడమ్  ఔదార్యానికి  కృతజ్ఞతతో  నమస్కరిస్తూ. . .  కూతురు  వైపు   చెమర్చిన  కళ్లతో  అడుగులు  వేస్తున్నాడు . . .

తన  కన్నబిడ్డ  గుండెలోతుల్లో   గూడుకట్టుకున్న  మమకారం మనసుని   ముద్ద చేస్తుంటే..
గుండెలనిండా  హత్తుకుని . .  కళ్లలో  పెట్టుకుని  కాపాడుకోవాలని . .

***

ఇది ఒక వాట్సప్ ఇంగ్లీష్  మెస్సేజ్ కి తెలుగు స్వేచ్చానువాదం.

రచయితకి ప్రణామాలతో..

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ