శ్రీ భగవాన్ వాణి ... 32 ...


 

శ్రీ భగవాన్ వాణి ... 32 ...

*" సముద్రంలోని నీరు సూర్యుని నుంచి వచ్చే వేడి కి ఆవిరై ఆకాశం వైపు ప్రయాణించి మేఘమవుతుంది.

*ఆకాశంలో చల్లటి గాలి స్పర్శతో మేఘాలలోని నీరు వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతుంది. అనేక అనేక బిందువుల రూపంలోని నీరు కాలువలుగా...నదిగా మారి...సముద్రంలో కలుస్తాయి.

*సాగరంలోని నీటి బిందువులు ఆవిరై ఆకాశంలోకి వెళ్లి మేఘాలుగా మారినట్లు...నీటిబిందువుల రూపంలోని సాధకులు ఉపాసకులు చల్లటి గాలి తో నిండిన మేఘ రూపంలోని గురు స్పర్శతో... తిరిగి వర్షబిందువులుగా మారి అనేక అనేక ఉపాసకులుగా నేలను చేరి ప్రయాణించి సాగరరూపంలోని పరమాత్మలో విలీనం అవుతారు.అదే తన్లీనత.

*సాధన యొక్క లక్ష్యం అస్థిత్వాన్ని కోల్పోవటం. లక్ష్యబోధంతో బాహ్య అవబోధాలన్నింటినీ తొలగించుకొని అంతరంలోకి ప్రయాణించి సాగర రూపంలోని పరమాత్మలో విలీనం కావాలి."

*వినయశీలుడే అందరికన్నా గొప్పవాడు. వినయాన్ని మించిన ఆభరణం ఏమున్నది!*

*కార్యసిద్ధి, కీర్తి లభించినప్పుడు కొంతమంది మరింత పరిపక్వతతో అణకువగా ఉంటారు. అయితే మరికొందరు వారి దృక్కోణాన్ని కోల్పోతారు.*

*ఒక సాధారణ మానవుడు తన గొప్పలను సదా చెప్పుకుంటూ ఉంటే, మహనీయులు తమ ప్రతిభలు జయాపజయాలు, సుఖదుఃఖాల ద్వారా భగవంతుడే వ్యక్తీకరింప బడుతున్నాడని భావిస్తారు.*

*సకల అనుభవాల ద్వారా వారు సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దైవేచ్ఛ మన ఆలోచనల ద్వారా నెరవేరుతుందని తెలుసుకోవటమే ఆ పరమసత్యం.*

*శుభం భూయాత్*

శ్రీ భగవాన్ వాణి ... 33 ...

భగవంతుని ముందు అందరు సమానులే అయిన అడవులలో, కొండలప్రక్క జీవించేవారు గురిఞ్చి తేలుకుంటే మంచిది   
వర్ణన......
*మేము మనుఁష్యులమే* 

మానవ జాతిలొ పవిత్రమైన నెలమీద పుట్టిన వాళ్ళం నెల మనుషులం 
అలవాట్లకు ఆనవాయితులకు మాదోక లోకం విచిత్రంగా చూసే సమాజం అదో ప్రపంచం........!!

హిమాలయ కొండలనే కాదు కేరళ ప్రాంతం మేఘాలయ నుండి మరాఠా వరకు వేరు వేరు మూలాలూతో బ్రతికే జాతులం......!

గోండులని, తోడూలని, సంతాళిలంటూ మరెన్నోపేర్లతో  భారతదేశపు పర్వాత శ్రేణుల్లో జీవించే జన జాతులం.........!!

సుచి శుభ్రతలొ మనోభావాలలొ కలుషితం లేని మా కుటుంబాల్లో మాటల్లో మర్మాలు వేరుగా లేని జీవులమని చూసే సమాజం.......!!

మేము మనుషులం అడవి మనుషులం అరణ్య వాసులం పరివేశం పరిశుభ్రంగా పర్యావరణంలో కాలుష్యం లేని జీవితం అదే మా ముఖచిత్రం........!!

కొండా కూనల్లో బ్రతికేవాళ్ళం బ్రతుకుతున్నాం బ్రతికేస్తాం........!!

మా సగటు జీవితాన్ని సాగెదాకా సాగుతు పోయే జీవితం.......!!

అటవీ ప్రాంతం, వన్య ప్రాణుల మృగాల మధ్యలో మ్రానుల మధ్యలో మనుగడతో మట్టి కొంపలు, మట్టి మార్గాలు మట్టి కుండలో కూడు తినే జాతులం అదే మా ముఖ చిత్రం......!!

బట్ట కట్టు మారినా,భాషా భావం మారినా భావాలు ఒకటే మేమూ భరత భూమి బిడ్డలం అదే మా ముఖచిత్రం.......!!

బిగుసు మొహాలు చప్పి ముక్కులు చెవిలో పోగులు చుట్ట చప్పరింపులు ఆకులతో ఔషాదాలతోబ్రతుకు  బ్రతికేస్తాం అదే మా ముఖ చిత్రం......!!

ఉదయించే సూర్యుడు అస్తమయంతో అలవరచుకునే దిక్కులు దిశలతో ఆదివాసీ మనుషులంమేము మనుషులం అదే మా ముఖచిత్రం......!!

చదువు లేని వాళ్ళం తెలివితేటలూ లేకపోయినా  సంస్కారవంతులం.......!!

నిప్పులాంటి మనుషులం నిప్పుమీద నడిచే వాళ్ళం  వెదురుమీద నృత్యం చేస్తూ వెదురులోనే జీవితం.......!!

ముఖ చిత్రాలకు వాడుకునే మనుషుల్లా ముఖలామీద రంగులు పూసుకొని ముఖాల వెనుక దాచుకునే సౌందర్యం మాకు చేతకాని అలవాటే ........!!

మా అలవాట్లే మాకు ఆనందం మా ముఖాలకు మా వేషాధారణే మా ముఖ చిత్రాలకు అందించే అందం.........!!
****

శ్రీ భగవాన్ వాణి ... 34 ...23--2-2023

 లక్షణములు 

సామాన్యముగ‌ న్యూనతగాని, ఆధిక్యము గాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణము.    కాని శ్రీ కృష్ణునికి ఆధిక్యము అను బుద్ధి లేకుండుటయే గాక , అందరును సమానమను అభిప్రాయము కూడ అతనికి లేదు. 

అనగా ఎవడు చేసుకొనిన కర్మకు తగిన ఫలము వానిని అనుభవింప జేయుటయు, ఎదుటివాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణములు.

తానందరికి సముడు గాని, తనయందు అందరును సమముగా ప్రవర్తింపరు.  కనుకనే కృష్ణుడందరి యెడల ఒకే విధముగ ప్రవర్తింపలేదు.

గోపకుల యెడల చూపిన ప్రవర్తనకును,  యాదవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు.  పాండవుల యెడ చూపిన ప్రవర్తనకు ,  కౌరవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు.  భక్తుల యెడ చూపిన ప్రవర్తనకు ఋషుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు.  ఇట్లే మిగిలిన చేష్టలనూహింపవలెను.

భగవంతుడు జీవులకు కల్పవృక్షముగా పనిచేయును.  ఎవ్వరేమి కోరి అర్చింతురో వారి కది సమకూర్చును.  

 కోరినదిచ్చును గాని తానిచ్చునది యని యుండదు.  కోరుట వలన గలుగు మోసము ఇది.  కోరనివారికి తానే నిర్ణయించును.  కనుక కోరనివారి కిచ్చునట్టి స్థితి కోరినవారు పుచ్చుకొనలేక పోవుచున్నారు.

శ్రీ భగవాన్ వాణి ... 35 ...--2-2023

****

* సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు.

* మీలో ఏ పాపమూ లేదు, దైన్యమూ లేదు, మీరు అనంతశక్తి సంపన్నులు. లేవండి! మేల్కొనండి! మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి."

*తాత్కాలిక సంతోషం దుఃఖాన్ని తెస్తుంది. తాత్కాలిక సంతోషం అంటే దేనిపైనో ఆధారపడి వచ్చే సంతోషం. ఒక విషయంపై ఆధారపడి ఉండే సంతోషం విషయంతోపాటే పోతుంది. ఈ సృష్టిలో ఏ విషయమైనా శాశ్వతంగా నిలిచి ఉండదు. కనుక సంతోషం శాశ్వతంగా నిలిచి ఉండదు. ఈ విషయం అర్థమైతే కలిగిన సంతోషానికి సాక్షిగా ఉండటం తప్ప కొత్త సంతోషాన్ని కోరుకోం. సంతోషాన్ని కోరుకునే గుణంపోతే దుఃఖం కూడా దూరమవుతుంది. ఎందుకంటే రాని సంతోషాన్ని కోరుకోవటంవల్ల, వచ్చిన సంతోషం నిలిచి ఉండాలనుకోవడం వల్లనే దుఃఖం వస్తుంది. ఆత్మ/దైవం శాశ్వతం, సర్వవ్యాపితం కనుక వాటితో వచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది !

* ఆత్మోద్ధరణ - దేవుడు, జీవుడు, బుద్ధి, చిత్తము ఈ నాలుగు ప్రజ్ఞలుగ నున్నవాడు మానవుడు. సామన్య మానవుని చిత్తము బాహ్య ప్రపంచముతో ముడిపడి యుండును. బాహ్యమును దర్శించుటకు, అనుభూతి చెందుటకు పాంచభౌతిక శరీరమున్నది. స్వభావము బాహ్య ప్రపంచమందలి అనుభవముల ఆధారముగ గట్టిపడు చుండును. ఇష్టము, అయిష్టము, అభిప్రాయములు ఏర్పడి అవి సత్య మనిపించు చుండును. తాను, తన స్వభావము కాదని తెలియుటకు వలసిన బుద్ధి కూడ తన యందే యున్నది. బుద్ధిని వినియోగించినచో స్వభావము నుండి తాను విడిపడ వచ్చును. విచక్షణ బుద్ధి లక్షణమే. ఇట్లు అంతయు వ్యాపించిన ఒకే తత్త్వము గుణముల ద్వారా ప్రత్యేకమై, బుద్ధిని, స్వభావమును కలిగి యుండును. ఇట్లు ప్రజ్ఞ నాలుగు స్థితులలో మానవుని యందు

*****


శ్రీ భగవాన్ వాణి ... ప్రాంజలి ప్రభ .... 24 --02 -2023

 maallaprgada ramakrishna 

ప్రేమ దేవుడికి సంబంధించిన అంతిమ అనుభవం. అస్తిత్వం అర్థరహితం కాదని ప్రేమ నిరూపిస్తుంది. జీవితం అర్థవంత మయిందని చూపిస్తుంది. ప్రేమను అనుభవానికి తెచ్చుకోని వ్యక్తి జీవితం అర్థరహిత మనుకుంటాడు. యాదృచ్ఛిక మనుకుంటాడు. అజ్ఞాత, అచేతనమయిన సహజశక్తుల దయాదాక్షిణ్యాలు అనుకుంటాడు. భౌతికవాదులు జీవితాన్ని చూసే విధానమది. కేవలం పదార్థాల సమ్మేళనం అనుకుంటారు.

అప్పుడు జీవితం అర్థరహితం. అర్థరహితమైన, ప్రాముఖ్యత లేని జీవితం పాట పాడలేదు. నాట్యమాడలేదు. అర్థవంతం కాని జీవితాన్ని పిరికివాళ్ళు మాత్రమే బతుకుతారు. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ప్రేమ నీకు మార్గాల్ని చూపిస్తుంది. కాంతి నిస్తుంది. ధ్యానపు ఛాయల్ని ప్రదర్శిస్తుంది. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే బ్రతుకుతారు. ఇది ఎప్పటికీ పూర్తికాదు. ఇది భౌతిక జీవితం యొక్క బాధాకరమైన పార్శ్వం. భౌతిక జీవితం అంటే మనకు చిత్రీకరించబడిన చిత్రం ఇదే. కానీ మన లోపల మనకు ఓదార్పు ను సంతృప్తిని కలిగించే ఒక మూలం ఉంది. దీని ఆభాస మనకు అంత తరచుగా రాదు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఉంది, అది మన దృష్టిగోచరం కాకుండా ఉంటోంది.

చైతన్యంతో మనస్సు కలిసి ఉన్నప్పుడు, కనిపించే ప్రపంచం స్వప్న స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఇక్కడ వస్తుమయ ప్రపంచం ఉనికిలో ఉండదు అని సూత్రం చెబుతుంది. అత్యున్నత స్థాయి చైతన్యంలో, సాధకుడు శూన్య స్థితిలో ఉన్నట్లుగా వస్తుమయ ప్రపంచం అదృశ్యమవుతుంది. శూన్యం అనేది మిగతావాటన్నిటినీ తిరస్కరించే స్థితి. ఇంద్రియాల నుండి ఉద్భవించిన ఆలోచనలతో మనస్సు కలవరపడకుండా ఉంటేనే అలాంటి స్థితి సాధ్యమవుతుంది.

భౌతిక వస్తువులను అతిస్వల్ప కాలంలోనే నిర్లక్ష్యంగా పాడు చేయడం, చిందరవందర గావించడం, ఇంద్రియోద్వేగంచే గాని, తామసిక జడత్వంచే గాని భౌతిక వస్తువులను, సేవలను దుర్వినియోగం చెయ్యడం, దుబారా చెయ్యడం - ఈ లక్షణాలు అభ్యుదయానికి ప్రతిబంధకాలై లక్ష్మిని వెడల గొటుతాయి. 

ఇంకా వుంది 

****


శ్రీ భగవాన్ వాణి .... శాంతి మంత్ర పలుకులు .. ప్రాంజలి ప్రభ . 36       


ఏ పని చేసినా సఫలం కావాలని కోరుకోవటం మానవ సహజం.

ఉన్నతమైన జీవితాన్ని గడపాలనుకోవటం కూడా సహజమే.


అందుకు ఏమి చేయాలి? పెద్దలేమంటారంటే మనసు పెట్టిచేయాలి అంటారు.

మాట కూడా మంచిగా మాట్లాడలన్నా చదవాలన్నా మనసులో దృఢమైన భావం జనించాలి. ఆప్పడు ఆ మాటకు బలముంటుంది. ఆ పనికి ఫలముంటుంది. ఉన్నత మన జీవనాన్ని, ఉన్నత స్థితిని ఆకాంక్షించే వారికి మనస్సు, వాక్కు ఒక్కటిగా యుండటం ఆవశ్యకం.

అందుకే ప్రతిఒక్కరు ఈవిధముగా ప్రార్ధించాలి 


వాక్కు మనసునందున మనసు వాక్కునందున ప్రతిష్ఠతమగుగాక!

పరమాత్మ నాలో ప్రకాశించెదవుగాక!

మనస్సు వాక్కు రెండూ వేదాల యథారార్థాన్ని నాకు తీసుకు వస్తాయి గాక.!

నేను విన్నది యావత్తు నన్ను వీడ కుండుగాక.!


నేర్చుకన్న దానిని రేయింబవళ్ళు యోచించస్తాను గాక!

నేను వ్యావహారిక సత్యాన్ని పలికెదను గాక!

పార మార్థకసత్యాన్ని పలికెదను గాక.!

ఆ భగవంతుడు నన్నుగురువును కాపాడుగాక.!


నన్ను రక్షించు గాక.!

గురువును రక్షించుగాక..!

****


శ్రీ భగవాన్ వాణి ... 35 ...--2-2023

* వేదము నీ స్వరూపమే. నీ ముఖమే వేదము. సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడచువారిచే పొందబడెదవు.  వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యము, ప్రియమైనవాడు, సత్యవర్తనముచే పొందగినవాడు . మాయావి, మాయను వశము చేసుకున్నవాడు . బ్రహ్మనుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు.

*వేదోక్త కర్మానుష్ఠానముచే ప్రసన్నుడవగు వాడు, స్మృతి విహిత ధర్మమునందు ప్రీతిగలవాడు, జరాయుజ, ఉద్భిజ, ఆండజ, స్వేదజములను ప్రాణులే స్వరూపమైనవాడు, జలములో మరియు భూమిపై నివసించే ప్రాణులే స్వరూపముగా గలవాడు. 

*ఓ దేవా! దేవతలు మొదలగు వారందరిలో శ్రేష్ఠులు నీ విభూతులే. దేవతలలో ఇంద్రుడు నీవే. గ్రహములలో సూర్యుడు నీవే . లోకములలో సత్యలోకము నీవే. నదులలో మందాకిని నీవే. వర్ణములలో శ్వేత వర్ణమునీవే. సరస్సులలో మానస సరోవరము నీవే . పర్వతములలో హిమవంతుడవు నీవే. గోవులలో కామధేనువు నీవే. సముద్రములలో పాలసముద్రము నీవే. లోహములలో బంగారము నీవే .

 ఓ ఈశ్వరా! తపస్స్వరూపుడవగు నీవు తపస్సును చేయువారికి ఫలమునిచ్చెదవు. స్తుతిస్వరూపుడవగు నీవు నిత్యము భక్తులచే స్తుతింపబడెదవు. నీ మనస్సు భక్తుల స్తుతిచే మిక్కిలి ఆనందించును .

* ఆచరణ యందు దోషాలుంటాయనే కారణాన కర్మను మాని వేయడం కంటే, వాటి నిర్మూలనకై కర్మను సాధనగా చేపట్టడం శ్రేయస్కరం. దోషాలు రాకూడదన్న దృఢసంకల్పం కలిగి వుండి, నీ కోశ సంశుద్ధికి దేవీశక్తి నాహ్వానిస్తూండే పక్షంలో ఆ దోషాలు రానేరావు. 

****

శ్రీ భగవాన్ వాణి ... ప్రాంజలి ప్రభ .... వాతావరణం శాంతికి ... 36

మనసులో చీకాకు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే మనమున్న వాతావరణ ప్రభావం కూడా అవసరమే చుట్టు వున్న పరిస్థతులు అనుకూలంగా లేకపోతే మానసికంగా శాంతి యుండదు. ఏ పని సక్రమంగా చేయలేము.

అలాగే మనం పీల్చేగాలి సువాసన భరితంగా ఉంటే సంతోష పడతాము. అదే దుర్వాసన వస్తుంటే చీకాకు పడతాము. ఇంతా ఎందుకు చెప్పటం అంటే మనకు ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదకరము ఉండాలంటే మంచి వాతావరణము అవసరము.

ఈ విషయం మన పూర్వులకు బాగా తెలుసు కాబట్టే వారు పర్యావరణ కాలుష్యము కాకుండా నిత్యము హోమ క్రియలను జరిపేవారు. సువాసనలు వచ్చే పూల చెట్లను పెంచేవారు. ఫల వృక్షాలను పెంచేవారు. ఆ ఫలాలను స్వార్థానికి కాక ప్రకృతిలో జీవాలకు కూడా అందులో భాగాన్ని కల్పించేవారు. గోవులను పూజించేవారు.
అటువంటి వాతావరణం వుంటే మనస్సు ఆహ్లాదంగా యుండి ప్రశాంతతను పొందుతుంది.పూర్వీకుల పర్యావరణ చింతనా వైశిష్ట్యాన్ని సూచించే మంత్రాలలో ఈమంత్రం ఒకటి.

సత్కార్యం చేయాలని అభిలషించే మనకు గాలిమధురంగా వీచు (వలయును) గాక.!
నదులు మధురమైన నీటిని ప్రవహించునుగాక.!
ఓషధులు చెట్లు లతలు మొదలగునవి పరిపుష్టితో నుండుగాక!
భూమి మాధుర్యాన్ని అందించుగాక,!
మన పితయైన ఆకాశం (మాధుర్యాన్ని)తియ్యదనాన్నివర్షించు గాక.!
ఓషధులకుకు అధిపతియైన చంద్రుడు మధురంగా యుండు గాక!
పశువులు అధికంగా పాలను ఇచ్చు గాక!

ఇలా వారు భావన చేసేవారు అందుకు తగిన చర్యలను చేపట్టేవారు.
****
శ్రీ భగవాన్ వాణి ... ప్రాంజలి ప్రభ ... సమస్త జీవుల శాంతి కొరకు ... 37 
 
మన వేదధర్మము నందు ప్రాచీన ఋషులు జీవితాన్ని ఒక మహా యజ్ఞం గా భావించారు భావించటమే కాదు ఆచరణలో పెట్టారు.

ప్రకృతి మొత్తము ఆత్మస్వరూపమనే తెలుసు కున్నారు. అందుకే చెట్టు, గుట్టా పుట్టా ,మట్టీ, ఆకాశము, నీరు, అగ్ని, గాలి, భూమి. ఈ పంచ భూతాలను, నక్షత్రాలను సమస్త విశ్వములో యున్న ప్రతీ పరమాణు స్వరూపాన్ని కూడి దైవ శక్తిగా భావించి ఆచరించి పూజించి తరించారు.
ఎవరు మంగళకరము ననుగ్రహించెదరో ఆ భగవంతుని ప్రార్ధిస్తాం.

యజ్ఞము సక్రమముగా పరిసమాప్తి యగుటకు ప్రార్ధిస్తాం.

మనకు దేవతలు శుభము చేయుగాక.!
మానవులందరికి మేలు జరుగు గాక.!
చెట్టు చేమ లు ఊర్ధ్వ ముఖముగా పెరుగు గాక.!
మన వద్దయున్న ద్విపద జీవులకు మంగళకరమగు గాక.!
చతుష్పాద జీవులకు మేలు కలుగు గాక.!

మనకు వారి అనుభవాలను శిష్య ప్రశిష్యులద్వారా పంచారు. కావుననే భారతదేశం ప్రపంచమున ఉన్నత స్థాయిలో యున్నది. ప్రపంచదేశాలకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే గురుస్థానంలో యున్నది. జీవనమనే మహాయజ్ఞము సక్రమముగా సాగటానికి ప్రార్థనా మంత్రము. ఇది సృజింప బడిన సమస్తము యజ్ఞ వస్తువే వాటి మంగళకరం కోసం ఈ మంత్రం ప్రార్ధిస్తుంది.
++++
శ్రీ భగవాన్ వాణి .. ప్రాంజలి ప్రభ ... 38 
 
ఈ మంత్రము ఓంకారము పరబ్రహ్మ స్వరూపమని చెపుతున్నది.

మన వేద ధర్మమున ఓం కారమునకు విశిష్టమైన స్థానమున్నది.

ఓంకారము మంత్రముల దోషమును క్షాళన చేస్తుందని పూర్వుల. విశ్వాసము.
ఈ మంత్రము కూడా ఇంద్రియములకు శిక్షణ నీయుటయే ముఖ్యోద్దేశ్యము.
ఇందులో దేవతలను సహాయము అర్థించుట లేదు. భగవంతుని నాదస్వరూపమైన ఓం కారాన్ని ప్రార్ధించట జరిగినది.
ఏ నాదం వేదాల అత్యంతశ్రేష్టమైన,  భాగమో, వినాశంలేని వేదాల నుండి ఉద్భవించినదో ఆ ఓంకారం నాకు మేధస్సును ప్రసాదించు గాక.!
దేవా నేను అమృతమయుడైన పరబ్రహ్మను గురించిన జ్ఞానమును పొందుదును గాక.!
నా శరీరం ఆరోగ్యవంతంగా యుండు గాక.!
నా నాలుక మధురాతి మధురమైన మాటలనే పలుకు గాక.!
చెవులు మంచి విషయములనే ఆలకించుగాక.!
ఓంకార పరబ్రహ్మమాలౌకిక వస్తువుల గురించిన జ్ఞానంచేత నీవు ఆవరింపబడియున్నావు..!
భగవంతుని ప్రాప్తిస్థానము నీవు నేర్చుకొనిన దానిని మరచి పోకుండా కాపాడు.!
***
శ్రీ భగవాన్ వాణి .. ప్రాంజలి ప్రభ ... 39 

ప్రపంచముతో సంబంధము ఉన్నది కావున మనిషిని ప్రేయస్సు శ్రేయస్సులు సమీపిస్తాయి.

బుద్ధిమంతండు రెండవ దానిని ఎన్నుకుంటాడని కఠోపనిత్తు 1-2-2 లో చెపుచున్నది.

ప్రేయస్సు కర్మ సంబంధమైనది ఇంద్రయసౌఖ్యమును కలిగించునది.
శ్రేయస్సనగా ఉన్నతమైనది, ధర్మము, మోక్షము.

ఆ విధంగా శుభమైన వాటిని ఉన్నతమైన వాటిని ఎన్నుకోవటానికి మన ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడానికని దేవలసహాయాన్ని అర్థించటానికై ఈమంత్రము విని యోగించటమైనది.
బృహస్పతిః... బృహస్పతి నః స్వస్తి దధాతు... మాకు అభ్యదయము ఒసగుగాక.,!

ఓ దేవతలారా,! మాచెవులు శుభాన్నే వినునుగాక.,! యజ్ఞకోవిధులమైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదము గాక.,!

మీ స్తోత్రాలను గానం చేస్తు మాకు నియమితమైన ఆయూషకాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో గడుపుదుము గాక.,!

శాస్త్ర ప్రశంసితుడైన ఇంద్రుడు సర్వజ్ఞుడైన సూర్యుడు ఆపదలనుండి రక్షించే తార్క్ష్యుడు మా బ్రహ్మ వర్చస్సును పాలించే బృహస్పతి మాకు శాస్త్రాధ్యయనంలో, అందు చెప్పబడిన సత్యానుష్ఠానంలో అభ్యుదయాన్ని ఒసంగెదరుగాక..,!
****
శ్రీ భగవాన్ వాణి .. ప్రాంజలి ప్రభ ... 40 

 ఈ విశ్వం మొత్తము శక్తిమయము. ఆ శక్తి నాట్యవిలాసమే ప్రపంచం. కంటికి కనిపించే ఈ బాహ్య ప్రపంచకమును నడిపించు స్థూలశక్తులనే కాకుండా, అంతర ప్రపంచకమును సూక్ష్మ రూపమున నడిపించు సూక్ష్మ శక్తులను ఒక దైవంగా భావించారు సనాతన ధర్మ పరాయణులైన ఉపనిషత్కాలపు ఋషులు. ఈ దైవాలు అభిమాన దైవాలుగా పేర్కన బడినాయి.

ఒక్కోదేవత ప్రపంచంలో ఒక దాన్ని మానవునిలో ఒకదాన్ని నడిపించేవిగా స్వీకరింప బడినాయి.

ఉదాహరణకు:-సూర్యునికి కంటికి సంబంధము అదుచే కంటికి అభిమాన దేవత సూర్యుడు.

పగటికి అభిమాన దేవత అర్యముడు ప్రాణానికి అభిమాన దేవత మిత్రుడు ఇలా ఈదేవతలతో అనగా ప్రకృతి శక్తులతో కలిసిమెలిసి జీవించమని మానవునకు ఉపదేశించ బడినది.
ఋతం. సత్యం రెండు ఒకే దానిని సూచించే పదాలు .ఋతం అన్నది వ్యావహరిక సత్యం .
ఉదా:-సూర్యాస్తమయాలు నిత్యం చూసే విషయం

సత్యం ..అసలు సూర్యాస్తమయాలు లేవన్నది పారమార్థిక సత్యం. భగవంతుడే నడిపిస్తున్నాడన్నది పారమార్థిక సత్యం.

మిత్రుడు, వరుణుడు, అర్యముడు మాకు మేలు చేయుదురు గాక.,!

ఇంద్రుడు బృహస్పతి మంచినొన గూర్చునుగాక విస్తీర్ణమైన పాదములుగల (సర్వ వ్యాపి అయిన) విష్ణువు మాకు మేలు చేయునుగాక.!
బ్రహ్మమునకు నమస్కారము..!

ఓ వాయువా నీకు నమస్కారము.!
నీవే ప్రత్యక్ష బ్రహ్మమగుచున్నావు.!
నీవే ప్రత్యక్ష బ్రహ్మమని చెప్పుచున్నా ను.! నీవే ఋతం నీవే సత్యం అనీ వక్కాణించుచున్నాను.!

ఆ బ్రహ్మము శిష్యడనైన నన్నును ఆచార్యునుని రక్షించుగాక..!
 త్రివిధ శాపములు శమించు గాక.!
****

శ్రీ భగవాన్ వాణి .. ప్రాంజలి ప్రభ ... 40 

*శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం*

*గడ్డపార (గునపం) యొక్క ముఖ్య ఉపయోగం దానితో నేలను త్రవ్వి మొక్కలు నాటుకోగలగటం. ఆ మొక్కలకు కాసిన పండ్లుగాని, కూరగాయలుగాని మన ఆకలిని తీరుస్తాయి. అంతేకాని ఆ గునపాన్ని మింగేస్తే మన ఆకలి తీరదు కదా.*

 *అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సును, ఇంద్రియాలను ధ్యానం వైపు మరల్చుకోవాలి కానీ సంసారాన్ని వదలివేస్తానంటే అది మనను మళ్ళీ అంతకంటే తీవ్రంగా కమ్ముకుంటుంది.*

*స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగే చిలకలను తెచ్చి బండికి కట్టి లాగమంటే అవి లొంగకపోగా బండిని కూడా ఆకాశంలోకి ఎగరేసుకు పోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటే అవి సమయం కోసం పొంచి ఉండి మనను ఘోరంగా దెబ్బ తీస్తాయి.*

*మండే అగ్నిని తెచ్చి మసి గుడ్డలో మూటకట్టి ఇంట్లో పెట్టుకుందామంటే అది దాగి ఉండకపోగా ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అలాగే మమకారాన్ని బలవంతంగా దాచి ఉంచుదామంటే అది మనలనే బానిసగా చేసుకుని ఆశలలో పడవేస్తుంది.*

*అలాగే విష సర్పాన్ని తెచ్చి దిండుకింద పెట్టుకొని అణగి ఉండమంటే అది మననే కాటు వేస్తుంది. అందువల్ల ఈ సంసారాన్ని నిగ్రహించాలంటే మనవల్ల కాదు. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం.*

 *ఇంద్రియాలు, మనస్సు స్ప్రింగ్ వంటివి. బలవంతంగా అణచి పెట్టాలని చూస్తే అదను చూసి అంతకంటే బలంగా ఎదురు తిరుగుతాయి. ఈ మనస్సు, శరీరము మనకు శత్రువులు కావు. పరమార్థ సాధనకు ఎంతో ఉపయోగపడే సాధనాలు.*

*అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం పరుగులు పెట్టే వీటికి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు మెల్లమెల్లగా ఆసక్తిని కలిగించాలి. ఒకసారి రుచి మరిగిన తరువాత వాటంతట అవే సంసారాన్ని వదిలివేస్తాయి.*
****



స్వయంకృతం
             

*భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనసు.* 

*కంటికి కనిపించని మనసు- కనపడనంత దూరతీరాల అద్భుతాలను చూపిస్తుంది. ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది.* 

*మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. గాలిమేడలు కట్టేస్తుంది. బికారిని కోటీశ్వరుణ్ని చేసి అందలమెక్కిస్తుంది.* 

*మనసు మాయ. మనిషిని మయసభలో చిందులేయిస్తుంది. బజారులో అడుగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది.* 

*ఆడంబరాలు రుచిచూపిస్తుంది. మనసు మాట విన్న మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు.*

*దేవాలయంలో అడుగుపెట్టగానే ధ్యానంపై ధ్యాస నిలవదు. మనసు దారి మళ్లిస్తుంది. కోర్కెల చిట్టా విప్పుతుంది. భగవంతుడు నవ్వుకుంటాడు. మనసు కవ్విస్తుంది. మురిపిస్తుంది. ఆవేశం రగిలిస్తుంది. దురాశలో ముంచుతుంది.*

*రోషాలు-ద్వేషాలు, పంతాలు- పట్టింపులు, కక్షలు- కార్పణ్యాలు,- అన్నింటికీ మూలం మనసు.* 

*మనసు చేసే అల్లరికి మనిషి బానిస. జీవితం భ్రమ అన్న సత్యాన్ని మరపించి, జీవితం సత్యమన్న భ్రమలో ముంచుతుంది.*

*మనసు మల్లెలా సుతిమెత్తన. చిన్నదెబ్బకు పెద్దగా రోదిస్తుంది. ఎదుటివారి కష్టాలకు కన్నీళ్లు కారుస్తుంది. అయినవారు పరమపదిస్తే పదిరోజులు పరితాపం చెందుతుంది.* 

*అది బండరాయిలా అతి కఠినం. కష్టాన్ని దిగమింగుతుంది. దుఃఖాన్ని భరిస్తుంది. ఉపద్రవాన్ని తట్టుకుంటుంది. మనసుకు మరపించే శక్తి లేకుంటే మనిషి మనుగడ అసాధ్యం.*

*మనిషి సామర్థ్యం మనసే. మనిషి ఎదుగుదలకు బాటలు పరుస్తుంది. జీవితంలో పైకి రమ్మని పోరుతుంది. సుఖంగా సంతోషంగా జీవించడానికి సన్నాహాలు చేస్తుంది. అవకాశాలు అందిపుచ్చు కోమని సతాయిస్తుంది. మనసు చేసే మాయ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు.*

*’నేను మనసు మాట వినను. స్థిర చిత్తుడను’ అని పలికేవాడే ఆ మాయలో పడుతుంటాడు.*

 *కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నిలయం మనసు. కోప తాపాలకు మూలం మనసు.* 

*ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది.* 

*మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది.*

*మనసును అదుపు చేస్తే అసూయ, అసంతృప్తి, అసహనం, అహంభావాలు దరికిరావు.* 

*కోరికలను అదుపు చేసుకుంటే … సంతృప్తికర జీవితం సుఖమయం  ఔవుతుంది. మనిషి తన హద్దులను దాటకూడదు. నేల విడిచి సాము చేయడం మంచిది కాదు.*

*ఉన్నతమైన మానవజన్మ లభించినందుకు మానవత్వాన్ని మరచిపోకూడదు. మనసు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు.* 

*నీతి నియమాల కళ్ళెం వేసి మనసును లొంగదీయగలిగేది భక్తి ఒక్కటే...*            

*ఆ భక్తి వంట బట్టిందా….                    
జీవితం ఆనందభరితమే!*    
*ఆరోహణ,అవరోహణ అంతా               
మనిషి స్వయం కృతమే.*

*****

*సంస్కార బలం- వాసనా బలం- గుణ బలం, నీ సూక్ష్మ శరీరం మీద పనిచేస్తే విచారణ, విచక్షణ  విజ్ఞత మరపుకు వచ్చేస్తాయి.*

*ప్రకృతి త్రిగుణాత్మకమై నీ మీద ప్రభావితమవుతుంది. ఇది సృష్టి ధర్మం.*

*తత్వ వివేకం ద్వారా నిర్ణయమయ్యేది బ్రహ్మము మాత్రమే  అది నీ స్వరూపము.*

*'త్వం' పద లక్ష్యార్ధము ':- ' తత్ ' పద వాచ్యార్ధము. 'తత్ ' పద లక్ష్యార్ధము 'అసి' పద వాచ్యార్ధము 'అసి ' పద వాచ్యార్ధమే నీ లక్ష్యార్ధము ఆ నిలకడ చెంది ఉండాలి.*

*శ్రవణ మాత్రము చేత తరించినవాడు ప్రహ్లాదుడు. మననము చేత తరించినవాడు భృగువు. నిధిధ్యాసనంలో తరించినవాడు మార్కండేయుడు.*

*యోగైనా - జ్ఞానైనా- సాధకుడైనా శరీర ధారులు నిషిధ్ధ కర్మ తీవ్ర  ఫలితాన్నిస్తుంది.*

*సాధకుడు ఏమరిపాటు లేకుండా ఉండాలి. కత్తి అంచు మీద నడవటం వచ్చా అన్నారు పెద్దస్వామి వారు. కాలు తెగకుండా కత్తి అంచు మీద నడవగలిగే నైపుణ్యం నీకు వస్తే స్వరూప జ్ఞానం వస్తుంది. 'యోగాత్ కర్మ సుకౌశలం'.*

*నేను అమనస్క స్థితిలో నిర్ణయమైతే ఆ నేను ఆత్మ బ్రహ్మ.*

*రూప- గుణ- ధర్మా ల చే ఆనందించే అభ్యాసాన్ని పోగొట్టుకోవాలి.*

*రూప, గుణ, ధర్మాలచే వ్యవహరించాలి ఆనందానుభవాన్ని పొందకూడదు.*


నారద భక్తి సూత్రాలు -

చతుర్ధాధ్యాయం - సూత్రము - 63


🌻 63. స్తీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్‌ ॥| 🌻


పురుషులలో శృంగారం ఉదయించడానికి కారణ భూతమైన స్త్రీల కథలను వినరాదు. ఇంద్రియ భోగాలకు, వ్యసనాలకు ఆలవాలమైన ధనంతో ముడిపడిఉన్న విషయాలను వినరాదు. నాస్తికులతో వాదన చేయరాదు. ఈ మూడింటిని శత్రువులుగా చూడవలెను.

స్త్రీ విషయంగా దర్శనం, స్పర్శనం, కేళి, కీరనం, గుహ్యభాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియానివృత్తి అని ఎనిమిది మైధున భావా లున్నాయి. స్త్రీ సంపర్కం చేయకున్నను పై ఎనిమిది వికారాల వలన మనసు చలించి భక్తిభావం విచ్చిన్న మవుతుంది. స్త్రీలపై తృష్ణ భోగ్యతా బుద్ధి విడనాడాలి. అట్లే స్త్రీలు కూడా పురుషుల యెడ ఈ విధమైన వికారాలు కలుగకుండా చూచుకోవాలి.

*****

సమయం వృథా చేయకండి..!!   🌹🌹*

*ప్రతి రోజు ప్రాణులు నశించుట మనం చూస్తూనే ఉన్నాము. అయినా ప్రతి యొక్కరు తాము శాశ్వతమని భావిస్తుంటారు.*

*ప్రపంచంలో అదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తాను ఎంత కాలం జీవిస్తాడు అని ఎవరు చెప్పలేరు.*

*ముందటి రోజు చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి మరునాడు మరణించడం మనం చూస్తూనే ఉన్నాం.* 

*ఇది వాస్తవం కాబట్టి,  ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చిత్తశుద్ధితో ధర్మాచరణకై కృషి చేయాలి. ఒక విషయాన్ని తరచుగా మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి.*

*ఓ మనసా! నీ ఇంద్రియాలన్నీ సక్రమముగా పనిచేస్తున్నప్పుడే పరమాత్మను సేవించాలి. కర్మేంద్రియాలు శక్తిని కోల్పోయినప్పుడు నీవు ఏమీ చేయలేవు.*

*వృద్ధాప్యం దాపురించిన పిదప నీవు దేవాలయానికి వెళ్లాలన్నా, ఉపవాసములు వుండాలన్నా అనుగ్రహ భాషణాలు వినాలన్నా ఓపిక ఉండదు.*

*అందువలన ఓపిక ఉన్న సమయంలోనే పరమాత్మను సేవిస్తూ ధర్మాచరణ కొనసాగించాలి. అలా కాకుండా అనవసరంగా మీన మేషాలను లెక్కపెడుతూ ధర్మాచరణను వృద్ధాప్యంలో చేయవచ్చని భావిస్తే ఏమీ సాధించకుండా జీవితాన్ని ముగిస్తాం.*

*కాబట్టి యౌవన దశలోనే భగవంతుని సేవను ధర్మాచరణను చిత్తశుద్ధితో ప్రారంభించాలి...*

      *శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ