కర్ణాటకలోని గౌరీపురలో లభించిన రెండవ దేవరాయల తామ్ర శాసనం.
కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా, జగలూరు తాలూకాలో ఉన్న గౌరీపుర గ్రామంలో గాద్రి పాలానాయక-కంచోబలేశ్వర ఆలయంలో విజయనగర చక్రవర్తి రెండవ దేవరాయల కాలం నాటి అత్యంత విలువైన రాగి ఫలక శాసనం( రాగిరేకుల శాసనాలు) వెలుగులోకి వచ్చాయి. ఇవి విజయనగర చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన ఆధారంగా నిలుస్తోంది.
శాసన స్వరూపం మరియు భాష >
ఈ శాసనం మూడు రాగి పత్రాల సమితిగా రూపొందించబడి, ఒక ఉంగరం 6: సహాయంతో పటిష్టంగా భద్రపరచడం జరిగింది.అంటే రాగిరేకుల తామ్ర శాసనలు ఒక రింగ్ కు అటాచ్ చేసి వున్నాయి. శాసన మూలపాఠం సంస్కృత భాషలో, నాగరిలిపిలో వుంది. అయితే శాసనం చివరి భాగంలో గ్రంథలిపి మరియు తెలుగులిపి రెండింటినీ ఉపయోగించడం ఇందులో ఉన్న విశేష లక్షణం.
కాల నిర్ణయం
శాసనంలో పేర్కొన్న వివరాల ప్రకారం
శక సంవత్సరం > 1358 (వసు-శర-అగ్ని-క్షమా)
తెలుగు సంవత్సరం > రాక్షసనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ద్వాదశి
గ్రెగోరియన్ తేదీ > నవంబర్ 2, 1435 (బుధవారం)
చారిత్రక అంశాలు మరియు దాన వివరాలు
వంశావళి > ఈ శాసనం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశ పరంపరను, రెండవ దేవరాయల వరకు క్రమంగా వివరిస్తుంది.
భూ దానం > పాండ్య-నాడులోని అరసీకెరె-మాగిణి ప్రాంతంలో ఉన్న ఆలదహళ్లి గ్రామాన్ని రాజు పేరు మీద అగ్రహారంగా మార్చి, దానంగా అర్పించారు.'
దాన గ్రహీత > భరద్వాజ గోత్రీకుడు, విష్ణుస్వామి తనయుడు అయిన నృసింహారాధ్య శర్మ,ఇతనిని నృసింహదేశిక అని కూడా పిలుస్తారు. ఈ ప్రసిద్ధ పండితుడికి ఈ గ్రామం దానంగా ఇవ్వబడింది.
నేపథ్య వివరాలు >
నృసింహారాధ్య శర్మ ఖ్యాతేశ్వర దేవాలయంలో పురోహితునిగా సేవలు అందిస్తూ, పాండురంగ క్షేత్రంలోని విఠలదేవుని అచంచలమైన భక్తుడుగా ఉండేవారని ఈ శాసనం స్పష్టం చేస్తోంది.
ఈ అమూల్యమైన శాసనాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ASI) లోని శాసన శాఖ అధికారికంగా నమోదు చేసి భావి తరాలకు భద్రపరిచింది.

Comments
Post a Comment