*రామాంజనేయ భాష్య ప్రభవం*
హనుమజ్జయoతి సందర్భంగా శుభాకాంక్షలు
శా. నామిత్తంబుగ నీవు నాథుడవుగన్ నానంద హృద్యంబుగన్
నేమీయిచ్ఛను తీర్చు నామదిగనున్ నీధర్మ సర్వాత్మకున్
నీమా భక్తునిగా నుశక్తికలనా నిత్యానుబంధంబుగన్
ఈ మాలింగన సంతసాభవముగన్ ఈప్సిత మోక్షంబుగన్ ॥
సరళ భావం:
“ఓ నాథా! నీవు నా జీవితానికి కారణభూతుడవు; నిన్ను పొందుట వలన నా హృదయం ఆనందంతో నిండిపోయింది.నా కోరికలన్నిటినీ ధర్మమార్గంలో నెరవేర్చువాడవు; సమస్త జీవులకు ఆత్మస్వరూపుడవు.
నేను నీ భక్తునిగా నీ శక్తిని, నీ కృపను నిత్యసంబంధంగా పొందుతున్నాను.ఈ నీ ఆలింగనానందమే నాకు పరమఫలమై, కోరుకున్న మోక్షస్వరూపమై అనుభవమవుతోంది.”
*****
మ. కో. కోరనింకను నేను యేమియు కొత్తగామది మిత్రమా
సార సంభవ నీ కటాక్షము సాధు బుద్దిగ నేస్తమా
ప్రేరణంబుయు నీదయాకృప ప్రేమ తత్వము సాలుమా
మారలేనును నీదునామము మానసంబున రామమున్
ఒక మిత్రుడు/దివ్యస్వరూప సాన్నిధ్యం వల్ల మనసులోని కోరికలు క్రమంగా తగ్గిపోయాయి. ఆ సాన్నిధ్యమే జ్ఞానాన్ని, సద్బుద్ధిని, ప్రేమతత్వాన్ని కలిగించింది. దాని ప్రభావంతో మనసు పూర్తిగా మారిపోయి, ఇక కొత్తగా ఏమీ కోరాల్సిన అవసరం లేకుండా ఒకే భావంలో స్థిరపడింది. చివరికి ఆ స్థితి రామస్మరణలో లీనమై, “నీవే నా మనసు” అనే ఏకత్వ భావానికి చేరింది.
****
రాముడు హనుమంతునితో పలుకులు
ఎంత వారికి నైన తప్పదు ఎంచ లేనిది కాలమున్
పంతమన్నను పాశమన్నను పాఠ్యమవ్వక తప్పదున్
శాంతి యన్నది లేని రోజులు సంభవంబగు కర్మగన్
ఎంత చెప్పిన భార్యతోడగు నోటులోటగు మిత్రమా
కాలగతి తప్పదు. బంధాలు, ఆశలు, పంతాలు అన్నీ జీవితం నేర్పే పాఠాలే. శాంతి లేని రోజులు కూడా కర్మఫలమే. కానీ, జీవితంలో భార్య సహచర్యం లేకపోతే మాటలకే లోటు ఏర్పడుతుంది; మనసు చెప్పుకునే తోడు లేక జీవితం వెలితిగా మారుతుంది — ఓ మిత్రమా! అని రాముడు చెప్పినట్లుంది.
****
హనుమంతుని ఓదార్పు
తోడు గున్నది హృద్యమందున తిష్ట వేసియు సత్యమున్
నేడుమర్వక వేదనంబున ని త్యమెందుకు మిత్రమా
నాడు చేసిన పుణ్యమంతయు నమ్మ గల్గుట తోడుగన్
పాడు తాపము నిన్ను చేరదు పాఠ్యమే యగు సీతగన్
“ప్రభూ! తోడు దూరమైనా, ఆమె హృదయంలోనే నిలిచి ఉంది — అది సత్యం. గతించిన దినాలను తలచుకొని నిత్యం వేదనలో మునిగిపోవడం ఎందుకు? మీరు చేసిన పుణ్యమే మీకు తోడుగా నిలుస్తుంది. సీతమ్మవారు మీ జీవితానికి పాఠమూ, పవిత్రతయూ. అలాంటి స్మరణ ఉన్నచోట దుఃఖతాపం మిమ్మల్ని జయించలేదు” అని హనుమంతుడు ఓదార్చినట్లుగా ఉంది.
****
రాముని వాక్కులు
పలుకులన్నియు శాంతి పోషక పాలనామది తీరుగన్
సలపరింతలు లేనిజీవన సన్నిదేదియు తెల్పుమా
అలక కోపము తప్పకేయగు ఆశ పాశము చింతయే
వలను చిక్కగ జీవమేయగు వాన యెoడల సీతగన్
భావం:
“మాటలు అన్నీ శాంతిని పోషించే విధంగా ఉండాలి — అదే జీవనపాలన యొక్క సరైన తీరు. చిన్న చిన్న సరస సంభాషణలు, అలకలు, ఆప్యాయతలు లేని జీవితం ఏ ఆనందాన్ని ఇస్తుంది చెప్పు మిత్రమా! ఆశ ఉన్నచోట అలక, కోపం, చింత తప్పవు. ప్రేమ అనే వలలో చిక్కుకున్నప్పుడే జీవితం నిజమైన అనుభూతిని పొందుతుంది; వాన–ఎండల మాదిరిగా సుఖదుఃఖాలతో కూడినదే సీతాసహచర్యం” అని రాముడు చెప్పినట్లుంది.
****
హనమ మాటలు
సన్నజాజులు పూలు తెచ్చియు శాంతి కోరితి గుర్తుగన్
మిన్ననైనను సఖ్యతాభవ మేలొసంగును సిద్ధిగన్
నెన్న యున్నను మర్వలేనిది లేర్చి కూర్చగ సఖ్యతన్
సన్నిధానము దీక్ష తత్త్వము సామరశ్యము మౌనమున్
భావం:
“ప్రభూ! చిన్న సన్నజాజి పూలు తీసుకొచ్చినా, అందులో శాంతి కోరికే గుర్తుగా ఉంటుంది. చిన్న అలకలు వచ్చినా, సఖ్యతాభావమే చివరికి మేలును ఇస్తుంది. ఎన్నో సంఘటనలు జరిగినా మరువలేని అనుబంధమే మనసులను మళ్లీ కలిపి కూర్చోబెడుతుంది. నిజమైన సాన్నిధ్యం అనేది దీక్ష, తత్త్వం, సామరస్యం, మౌనం — ఇవన్నీ కలిసిన పవిత్ర బంధం” అని హనుమంతుడు చెప్పినట్లు ఉంది.
***
రాముని మాటలు
ఉ.నమ్మకమేయిదీ పలుకు నన్నును నెమ్మది గుంచ గల్గగన్
నమ్మిన వారుగామనసు నామది తీరుగ నుండ గల్గగన్
నెమ్మది బాధతొల్గగల నీదగు సఖ్యత వేదవాక్కముల్
సమ్మతి రావణాసురుని సాధ్య యసాద్యము సీత చూపుగన్
భావం:
“నీ మాటలు నాలో నమ్మకాన్ని నింపి, మనసుకు నెమ్మదిని కలిగిస్తున్నాయి. విశ్వసనీయులైన స్నేహితులు మనసుకు ఆధారంగా నిలుస్తారు. నీ సఖ్యత వేదవాక్యంలా బాధను తొలగించే శక్తిని ఇస్తోంది. సీతమ్మ చూపు ఉన్నచోట రావణాసురుడి సాధ్యాసాధ్యాలు ఏమాత్రం నిలవవు; ధర్మమే చివరకు గెలుస్తుంది” అని రాముడు హనుమంతునితో అన్నట్లుంది.
****
హనుమ మాటలు
శా.రామా రావణ శంబుదేవరకళా రాక్షశ్వ తీరే తపమ్
రామానిత్యపరాత్పరాభవముగన్ రాజ్యంబు సంతృప్తిగన్
రామాలక్ష్యముసీతతాకను విరాగీగాను నేచూసితిన్
రామాసీతగుణంబునీతలుపులే రమ్యత్వ విశ్వాసమున్
మొత్తం భావతత్త్వం:
రావణుడు శివభక్తుడు. తపస్సు, విద్య, శక్తి, రాజ్యసంపద — అన్నింటినీ సంపాదించాడు. దేవకృపతో అతని రాజ్యం వైభవంగా ఉంది. అయినప్పటికీ, సీతమ్మను అపహరించినా ఆమెను తాకని ఒక నియమవిరాగం అతనిలో కనిపించింది. ఆ నియమాన్ని హనుమంతుడు గమనించాడు.
కానీ, ఆ బాహ్యశక్తి కంటే గొప్పది ఏమిటంటే —
రాముడు హృదయంలోని విశ్వాసం.
రాముని తలపుల్లో ప్రతిఫలించిన సీత గుణగణాలే నిజమైన రమ్యత, పవిత్రత, ధర్మసౌందర్యం అని హనుమంతుడు గ్రహించాడు.
****
రామ పలుకు
హనుమాదీవెన నివ్వనీమనసుగన్ దీప్తించ రామంబుగన్
జనలక్ష్యంబగు జాగృతీవిధముగన్ జాతశ్వ సేవార్దిగాన్
ననయాశక్తిగ నిన్ను గొల్వగనిజానామంబు
యుక్తేయగున్
ఘనమేనీదయ సర్వ వేళలగు టన్ గమ్యంబు ధైర్యంబుగన్
మొత్తం భావతత్త్వం:
“ఓ హనుమా! నీ దీవెన, నీ సాన్నిధ్యం నా మనసును రామతత్వ దీప్తితో నింపుతోంది. ప్రజలకు ఆదర్శమయ్యే జాగృతి, సేవాభావం నీవల్లే స్ఫూర్తి పొందుతున్నాయి. నిన్ను ఆశ్రయించి స్మరించుట వల్ల నిజమైన నామస్మరణకు యుక్తి, శక్తి లభిస్తుంది. నీ దయ ప్రతి వేళ గొప్ప ఆధారంగా నిలిచి, జీవనగమ్యానికి ధైర్యాన్ని ఇస్తోంది” అని రాముడు పలికినట్లు ఉంది.
****
Comments
Post a Comment